ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం : ఆర్టిఏ మెంబెర్ బీమీడి జైపాల్ రెడ్డి
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ద్యేయంగా ప్రజలకు అన్నిరకాల మౌలిక సదుపాయల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుండి పనిచేస్తుందని ఆర్టిఏ మెంబెర్ బీమీడి జైపాల్ రెడ్డి అన్నారు. తుంకుంటలో డబుల్ బెడ్ రూమ్ కాలనీ వాసులకు ప్రజా సౌకర్యర్థం ఆర్ టి సి బస్ సౌకర్యాన్ని సికింద్రాబాద్ నుండి తుంకుంట డబుల్ బెడ్ రూమ్ కాలనీ వరకు బస్సులు శనివారం ప్రారబించారు. ప్రజలు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలనుసద్వినియోగంచేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ కౌన్సెలర్ సింగిరెడ్డి మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు టిఆర్. రవీందర్ గౌడ్, సింగిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, ఎండి. గౌస్ బాబా, మల్లేష్ యాదవ్, గట్టు ప్రదీప్, మధుసూదన్ రెడ్డి, బి నాగమణి, బి నర్సింగ్ యాదవ్, కాలనీ వాసులు పాల్గొన్నారు.
