ప్రజావాణిలో దరఖాస్తులు స్వకరించిన కలెక్టర్..

ప్రజావాణిలో దరఖాస్తులు స్వకరించిన కలెక్టర్

సీ ఎం కార్యలయము ప్రజా వాణి నుండి వచ్చిన దరఖాస్తులు పరిష్కరించాలి

వనపర్తి నేటిదాత్రి .

 

 

వనపర్తి జిల్లా కార్యాలయంలో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు దరఖాస్తులను కలెక్టర్ ఆదర్శ్ సురభి స్వకరించారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణి లో 40 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను జిల్లా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ముఖ్యమంత్రి కార్యాలయం హైదరాబాద్ ప్రజాభవన్ నుండి ప్రజావాణిలో వచ్చిన, దరఖాస్తులు పరిష్కరించాలని జిల్లా లో ని అధికారులను కలెక్టర్ ఆదేశించారు

నష్టపరిహారం ఇప్పించాలని వినతిపత్రం అందజేత…

నష్టపరిహారం ఇప్పించాలని వినతిపత్రం అందజేత

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ శాంతినగర్ కాలనీ సమీపంలో ఉపరితల గని రెండో దఫా పనుల కొరకు డిసెంబర్ 3న ప్రజాభిప్రాయ సేకరణ ఉన్న నేపథ్యంలో కాలనీవాసులకు ఇంటి స్థలాలు కేటాయించి ,ప్రస్తుతం ఉన్న ఇండ్లకు నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ అధికారికి కాలనీవాసులు వినతి పత్రం అందించారు. ఉపరితల గని మొదటి దఫా లో జరిగిన బాంబ్ బ్లాస్టింగ్ లకి కాలనీలలోని ఇండ్ల గోడలు పగిలిపోయాయని, దుమ్ముకు ప్రజలు అనారోగ్యాన బారిన పడ్డారని అందుచేతనే రెండోదఫా పనులు ప్రారంభానికి ముందే నష్టపరిహారం చెల్లించి తమ కాలనీవాసులను ఆదుకోవాలని వినతిపత్రం అందించినట్లు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version