గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకోవాలి పౌ…

గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకోవాలి పౌ

కొంపల్లి సర్పంచ్ సడల శ్రీకాంత్,ఐసిడిఎస్
సూపర్వైజర్ సునీత

భూపాలపల్లి నేటిధాత్రి

గర్భిణీ స్త్రీలు బాలింతలు ఆరోగ్యవంతమైన శిశువు ఎదుగుదలకు తోడ్పడే అధిక పౌష్టిక ఆహారాలు కలిగిన ఆకుకూరలు గుడ్లు వంటి మొదలైన సమతుల్య ఆహారం తీసుకోవాలని కొంపెల్లి గ్రామ సర్పంచ్ శ్రీకాంత్,ఐసిడిఎస్ సూపర్వైజర్ సునీత తెలిపారు.శనివారం భుపాలపల్లి మండలంలోని కొంపల్లి గ్రామంలో పోషణ్ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ సునీత,సర్పంచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలకు వెయ్యి రోజుల ప్రాముఖ్యత కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలన్నారు.గర్భిణీ స్త్రీలు,కిశోర బాలికలకు ఎదుగుదలకు పాలు,ఆకుకూరలు,గుడ్లు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలు బాలింతలు అంగన్వాడి టీచర్స్ పద్మా, సునీత,స్వరూప,రజిత తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version