నూతన కలెక్టర్ ప్రావిణ్యను కలిసిన.

నూతన కలెక్టర్ ప్రావిణ్యను కలిసిన దివ్యాంగుల అసోసియేషన్ సభ్యులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

సంగారెడ్డి జిల్లాకు ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన నూతన జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య ను గురువారం నాడు దివ్యాంగుల అసోసియేషన్ ముఖ్య ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసీ పూల మొక్క ను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా కలెక్టర్ జిల్లాలో ఎన్ని దివ్యాంగుల సంఘాలు అసోసియేషన్ లు ఉన్నాయి అని అసోసియేషన్ సభ్యులకు అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగుల అభ్యున్నతికి అవసరమైన సదుపాయాల ఏర్పాటుపై, ప్రభుత్వ పథకాల అమలు, ఉపాధి అవకాశాలు మరియు శిక్షణా కార్యక్రమాలపై స్పందనను కలెక్టర్ కు తెలియజేశారు. కలెక్టర్ సా నుభూతితో సమస్యలు విని అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో సోలార్ సొసైటీ అధ్యక్షురాలు జుబేదా బేగం, తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా అధ్యక్షులు రాయికోటి నర్సిములు,దివ్యాంగుల సంఘం జిల్లా నాయకులు రామ్ శెట్టి, ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి కె నర్సిములు, ఇస్మాయిల్, నాయకురాలు విజయలక్ష్మి,,దివ్యాంగుల సంఘం నాయకులు లక్ష్మణ్ సుశీల వయోవృద్దుల దివ్యంగుల రెస్పాన్స్ అధికారి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version