వివేకపూరిత మాటలను వెనక్కి తీసుకోవాలి

వివేకపూరిత మాటలను వెనక్కి తీసుకోవాలి

బీఆర్ఎస్ నాయకుడు ఒంటేరు చక్రి

పరకాల,నేటిధాత్రి

కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఏర్పాటును ఇండియా పాకిస్తాన్,విభజనతో పోల్చిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)నాయకుడు ఒంటేరు చక్రి తీవ్ర ఆక్షేపం తెలిపారు.తేజస్వి సూర్య తన అవివేకపూరిత మాటలను తక్షణమే వెనక్కి తీసుకుని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు.సుదీర్ఘ తెలంగాణ పోరాటాలు, అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన రాష్ట్రాన్ని దేశ విభజనతో పోల్చడం అతి దారుణమని ఆరోపించారు. తెలంగాణ సాధన అంటే దేశానికి స్ఫూర్తి.ఆ పోరాట స్పూర్తిని చిన్నతం చేసేలా మాట్లాడటం తేజస్వి సూర్య అవివేకానికి నిదర్శనమని పోరాట ఉద్యమాలు లేని బీజేపీ నాయకులకు తెలంగాణ ప్రజల మనోభావాలు ఏమీ తెలియవని ఆయన స్పష్టం చేశారు.తెలంగాణ ప్రజల మనసులను దెబ్బతీసిన ఈ వ్యాఖ్యలకు తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.a

చారి పై విమర్శలు సరికా దు…అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం…

చారి పై విమర్శలు సరికా దు…అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం

శాయంపేట నేటిధాత్రి;

కాంగ్రెస్ అంటేనే మోసమని అబద్ధపు హామీలతో గద్దెనెక్కి అందర్నీ గోసపెడుతున్నదని టిఆర్ఎస్ పార్టీ ధ్వజమెత్తారు మాజీ స్పీకర్ మధుసూదనా చారి పై విమర్శలు సరికాదని సూచించారు. మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పథకాలతో అబద్దాలు ఏర చూపి
ప్రజల ఓట్లతో గెలిచి రైతులను మభ్యపెట్టి ఇచ్చిన హమీలు అమలు చేయక రైతాంగాన్ని నిట్ట నిలువునా దోపిడీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.700 మంది రైతుల ఆత్మ హత్యలకు, 400 మంది ఆటో కార్మికుల ఆత్మహ త్యలకు, గురుకుల విద్యార్థుల మరణాలకు కారణం, మేధా తుఫాన్ వల్ల వేలాదిఎకరాలలో వరిధాన్యం పత్తి మిర్చి పంటలకు జరిగిన నష్టాన్ని చూసి చలించి పరామర్శిం చడానికి వచ్చిన శాసనమం డలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూధనచారిని నిత్యం పార్టీలు మార్చే వంగి మాధులు విమర్శిచడం సిగ్గుచేటు అన్నారుబీఆర్ఎస్ మాజీ మండల పార్టీ అధ్యక్షులు గుర్రం రవీందర్ అన్నారు
ప్రతిపక్ష నేత ఆకాల వర్షానికి పంట నష్టాపోయిన రైతుల వ్యవసాయ వరిపోలాలను ఇప్పటివరకు ఏ నాయకుడు మరియు అధికారులు పర్యావే క్షించిన దాఖలాలులేవు పంట నష్టాన్ని క్షేత్రస్ధాయిలో అధికా రులు తిరిగి నష్టపోయిన రైతాంగాన్ని అదుకోని ఏకరానికి 25000 ల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది గ్రామ పంచాయతీ కానీ భూపాలపల్లి ని జిల్లా స్ధాయికి తీసుకవచ్చి 3000 ల కోట్లాతో అభివృద్ధి చేసిన ఘనత మధుసూధ నచారి.కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే చిల్లర మాటలు మానుకొని ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో చర్చకు కాంగ్రెస్ పార్టీ లో గతంలో పోటిచేసిన నాయకులు డిపాజిట్ రాని వారు కుడా ఉన్నారు అది మరిచి స్ధానాల గురించి మాట్లడటం వారి విజ్నతకే వదిలేస్తున్నాం.
ఈ కార్యక్రమంలో మాజీ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గుర్రం రవీందర్ పల్లేబోయిన సారయ్య. మార్క సుదర్శన్. గజ్జి శంకర్
యువనాయకులు కొత్తగట్టు సాయిక్రిష్ణ అరికిళ్ల విజయ్ బూర విజయ్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version