
ప్రశాంతతకు దైవచింతన మార్గం.
ప్రశాంతతకు దైవచింతన మార్గం… జహీరాబాద్ నేటి ధాత్రి: సంగారెడ్డి: ప్రశాంతతకు దైవచింతన మార్గం అని సిద్దేశ్వరానందగిరి మహారాజ్ అన్నారు. ఝరాసంగంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన భక్తులకు ప్రవచనామృతం అందించారు. మహిళలు సీరియల్స్కు బదులు పిల్లల చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. వంటలు చేస్తూ దేవుడి నామస్మరణ చేయడం మంచిదని తెలిపారు. ధనవంతులు పేదలకు దానం చేయాలని సూచించారు. కార్యక్రమంలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు.