3వ వార్డు అభ్యర్థి పంచగిరి సృజనకు ప్రజల ఆదరణ

ప్రజలనుండి విశేష ఆదరణ

3వ వార్డు అభ్యర్థి పంచగిరి సృజన

పరకాల,నేటిధాత్రి

మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని 3వ వార్డులో బిఆర్ఎస్ ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది. నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ,వార్డు సమస్యలపై నేరుగా స్పందిస్తున్న బిఆర్ఎస్ అభ్యర్థి సృజన కు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.మంగళవారం పరకాల పట్టణంలోని పద్మశాలి వాడ,గడ్డం వాడ, ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా అభ్యర్థి మాట్లాడుతూ కాలనీలోని తాగునీరు,డ్రైనేజీ,రోడ్లు, పారిశుధ్యం వంటి మౌలిక సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు.మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆశీస్సులతో,ప్రజల ఆశీర్వాదం కోరుకుంటూ మీ ముందుకు వచ్చానని తెలిపారు.మీరు ఆశీర్వదిస్తే 3వ వార్డును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు పంచగిరి సుధాకర్,ఆలేటి మహేందర్, వార్డు ఇంచార్జి రవీందర్, నాయకులు విష్ణు,అనిల్, ఉమర్,అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version