కోహీర్ నుండి పైడిగుమ్మల్ కు రోడ్డు వేయండి. ఆటో డ్రైవర్లు ఆవేదన
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జహీరాబాద్ నియోజకవర్గo కోహీర్ నుండి పైడిగుమ్మల్ కు వెళ్లే రోడ్డు పూర్తిగా గుంతల మయంగా మారిపోయింది కోహీర్ నుండి పైడిగుమ్మల్ కు రెండు కిలోమీటర్లు మాత్రమే కానీ ఆ రోడ్డులో ప్రయాణం చేయడానికి కనీసం ముప్పై నిముషాలు పడుతుంది మరి ముఖ్యంగ ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆటో డ్రైవర్లు అంత బుధవారం నాడు ఆటో బందుకు పిలుపు నిచ్చారు రోడ్డు పై దర్న నిర్వహించరు ఆ గ్రామ మాజీ ఏం పి టి సి . బి. జ్ఞానారత్నం కల్పించుకొని. కోహీర్ నుండి పైడిగుమ్మల్ కు రోడ్డు గత సంవత్సరం ప్రభుత్వం సుమారు ఒక కోటి ఇరవై లక్షలు మంజురు చేసిందన్నారు అందుకు టెండర్లు వేయడం జరిగింది అన్నారు కానీ కంటాక్టర్లు ముందుకు రావడం లేదన్నారు త్వరలో నే కంటాక్టర్ లతో మాట్లాడి సమస్య తీరుస్తాం అన్నారు అప్పటి వరకు తాత్కాలికంగా రోడ్డు చేయిస్తాం అన్నారు దాంతో ఆటో డ్రైవర్లు అతనికి కృతజ్ఞతలు తెలియజేసారు,
