అవ్వ, తాతల ముఖాల్లో ఆనందం చూడటమే కూటమి ప్రభుత్వం లక్ష్యం…
ఇంటి ఇంటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేసిన టిడిపి నేత జేబీ శ్రీనివాస్
తిరుపతి(నేటి ధాత్రి:
అవ్వ తాతల ముఖాలలో చిరునవ్వు చూడటమే టిడిపి కూటమి ప్రభుత్వం లక్ష్యమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జేబీ శ్రీనివాస్ అన్నారు. శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను నగరంలోని 5, 6, 7, 8, 9 డివిజన్లలో ఉదయం 6 గంటల నుండి రెండవ క్లస్టర్ ఇంచార్జ్ జేబీ శ్రీనివాస్ పర్యటించి అర్హులైన వృద్దులు, వికలాంగులు, వితంతువులకు వారి ఇళ్ళకు వెళ్లి జేబీ శ్రీనివాస్ పెన్షన్లను అందజేశారు. ఆయా డివిజన్ ల
లో ఏవైనా సమస్యలు ఉన్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పలువురు తమ సమస్యలను జేబీ శ్రీనివాస్ దృష్టికి తేవడంతో వాటిని పరిష్కరించే దిశగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మీడియాతో జేబీ శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రతినెల 1వ తేదీ ఇవ్వాల్సిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ ఒక రోజు ముందుగానే పంపిణీ చేయడం జరిగిందన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఇప్పటికే 90% హామీలను నెరవేర్చడం జరిగిందని పేర్కొన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు మూడు సిలిండర్ల గ్యాసు అందించడం జరిగిందన్నారు. రాబోయే రోజులలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ స్థానంలో అభివృద్ధి చెందడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రఘురాం, ఆయా డివిజన్ల అధ్యక్షులు, కార్యదర్శులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
