నయాబ్ తహశీల్దార్గా కరుణాకర్ రావు…

నయాబ్ తహశీల్దార్గా కరుణాకర్ రావు…

జహీరాబాద్. నేటి ధాత్రి:

ఝరాసంగం నూతన నయాబ్ తహశీల్దార్ గా జి.కరుణాకర్ రావు గా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఝరాసం గంలో ఇప్పటివరకు విధులు నిర్వహించిన నయాబ్ తహశీల్దార్ యాసిన్ ఖాన్ నిజాంపేట్ మండలానికి బదిలీపై వెళ్లడంతో గుమ్మడిదల తహశీల్దార్ కార్యాల యంలో నయాబ్ తహశీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న జి.కరుణాకర్ రావు నూతన నయా తహశీల్దారుగా నియమితులయ్యారు. బుధవారం మండల కేం ద్రంలోని సంగమేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. తహశీల్దార్ తిరుమలరావు,ఆర్.ఐ రామారావు కార్యాలయ ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. మండల ప్రజ లకు మెరుగైన సేవలు అందేలా తన వంతు సహకారం అందిస్తానని నయాబ్ తహశీల్దార్ పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version