యూరియా అక్రమ రవాణా పై పటిష్ట నిఘా..

యూరియా అక్రమ రవాణా పై పటిష్ట నిఘా

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వ్యవసాయ అధికారులను ఆదేశించారు.

భూపాలపల్లి నేటిధాత్రి

 

బుధ వారం ఐడిఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో యూరియా సరఫరా, క్రాప్ బుకింగ్, ఉద్యాన పంటలు సాగు తదితర అంశాలపై వ్యవసాయ, ఉద్యాన వన శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
జిల్లాలో యూరియా సరఫరాపై టాస్క్ ఫోర్స్ టీములు పటిష్టమైన నిఘా పెంచాలని సూచించారు. మండలాల వారిగా యూరియా ఎక్కువగా విక్రయాలు జరుగుతున్న మండలాల నివేదిక అందించాలని ఆదేశించారు.
పి.ఏ.సి.ఎస్ కేంద్రాల వద్ద రైతులకు సరిపడేంత యూరియా నిల్వలు ఉంచాలని స్పష్టం చేశారు. యూరియా అక్రమ రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
జిల్లాలో టాస్క్ ఫోర్స్ టీం లను ఏర్పాటు చేయడం జరిగిందని
టాస్క్ ఫోర్స్ టీంలు ఆకస్మికంగా రిటైల్ షాపుల లో తనికీలు చేపట్టాలని,
ప్రైవేటు డీలర్లు కొన్ని చోట్ల బ్లాక్ చేసే అవకాశం ఉందని పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలని, అలాంటి వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
యూరియా కు కొరత లేదని, రాబోయే 15 రోజులు చాలా కీలకమని పర్యవేక్షణ పెంచాలని సూచించారు. వ్యవసాయ, ఉద్యాన పంటలు క్రాప్ బుకింగ్ వేగవంతం చేయాలని ఆదేశించారు. మొగుళ్ళ పల్లి మండలంలోని కొన్ని గ్రామాలలో గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణానికి భూ సేకరణ చేయడం జరిగిందని భూసేకరణ చేపట్టిన భూమిలో పంటలు సాగు చేపట్టకుండా అలాగే సాగులో ఉన్న పంటలు త్వరితగతిన పూర్తి చేసేందుకు రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. యూరియా నిల్వలు, విక్రయాలపై నివేదికలు
ఏ రోజుకారోజు అందచేయాలని ఆదేశించారు. రైతు బీమా క్లెయిమ్స్ లో జాప్యం జరుగకుండా సత్వరమే విచారణ చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో అవసరమైన యూరియా కొరకు నివేదికలు అందజేయాలని ఆయన స్పష్టం చేశారు. అదనపు సేల్స్ పాయింట్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, ఉద్యానవన అధికారి సునీల్ కుమార్, వ్యవసాయ శాఖ ఏడిఏలు, హార్టికల్చర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

యూరియా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి…

యూరియా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

రాయపర్తి మండలంలో జిల్లా కలెక్టర్ పర్యటన..తనిఖీలు

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట, నేటిధాత్రి:

 

 

యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు.వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సంఘాల, ప్రైవేట్ ఫర్టిలైజర్ షాపులను మంగళవారం
కలెక్టర్ డాక్టర్ సత్య శారద వ్యవసాయ అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.దుకాణాల్లోని యూరియా, ఇతర ఎరువులు నిల్వలను పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేట్ ప్రాథమిక వ్యవసాయ సంఘాల ద్వారా యూరియా సరఫరా సక్రమంగా జగేటట్లు చూడాలన్నారు.

 

 

వ్యవసాయ సంఘం వారు వారి సొసైటీల ఎదుట ఎక్కువ జనం ఉండకుండా ఒక ఊరికి ఏ రోజు ఇస్తారో ముందుగానే ప్రకటిస్తూ టోకెన్లు అందజేసి యూరియా పంపిణీ మేనేజ్మెంట్ చేయాలన్నారు.ఈ సందర్భంగా రైతులకు స్వయంగా కలెక్టర్ సత్య శారద యూరియా బస్తాలను అందజేశారు.మన జిల్లా రైతులకు మాత్రమే యూరియా అందేటట్లు,పక్క జిల్లాకు వెళ్లకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.రైతు పాస్ పుస్తకం చూసి ఎవరికి ఎంత యూరియా కావాలో అంత తగు మోతాదులోనే ఇవ్వాలన్నారు.యూరియా బస్తాలను పక్కదారి పట్టించి కృత్తిమ కొరత సృష్టిస్తూ వ్యక్తులచే అమ్మిస్తున్నారని పలువురు రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వ్యవసాయ అధికారులు అనునిత్యం పర్యవేక్షింస్తూ, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.జిల్లాలో యూరియా కొరత లేదని తగినంతగా అందుబాటులో ఉందని, అవసరం మేరకు ప్రతి రైతుకు యూరియా అందిస్తామని కలెక్టర్ తెలిపారు.ప్రైవేట్ షాపుల వద్ద అధికారుల ఉండి యూరియా పంపిణీ పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. సబ్సిడీ యూరియా ఎక్కడ పక్కదోవ పట్టకుండా నిత్యం పర్యవేక్షించాలని అన్నారు.యూరియాకు ప్రత్యామ్నాయంగా రైతులకు నానో యూరియా ఎలా ఉపయోగకరంగా ఉంటుందని, నానో యూరియా ధర తక్కువ ఉండడంతో పాటు 45 కిలోల యూరియా బస్తాకు సమానంగా 500 మిల్లీలీటర్ల నానో యూరియా సరిపోతుందని అన్నారు.

 

 

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వెరిఫికేషన్ చేసిన కలెక్టర్

రాయపర్తి మండల కేంద్రం, పిరికెడు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వెరిఫికేషన్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద స్వయంగా నిర్వహించారు.ఎంపీడీవో ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాలో నుండి కొందరి లబ్ధిదారుల వద్దకు కలెక్టర్ నేరుగా వెళ్లి లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించి అద్దె ఇంట్లో ఉంటున్నారా,తదితర అర్హత వివరాలను పరిశీలించారు.

 

 


అనంతరం లబ్ధిదారులు నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి వేగవంతంగా పూర్తి చేసుకోవాలని సూచించారు.

సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆరోగ్య శిబిరాన్ని పరిశీలించిన కలెక్టర్

రాయపర్తి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ రెసిడెన్షియల్ పాఠశాలలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కిశోర రక్ష ఆరోగ్య శిబిరాన్ని కలెక్టర్ పరిశీలించారు. వసతి గృహంలో ఇంటర్మీడియట్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చేస్తున్న విద్యార్థులచే కలెక్టర్ రక్త పరీక్షలు చేయించారు.రెసిడెన్షియల్ పాఠశాలలో పరిసరాలు, వంట గదులు, నిలువ చేసే ఆహార పదార్థాలు, కూరగాయలు పళ్ళను పరిశీలించారు. తాజా నాణ్యమైన
కూరగాయలు పళ్లు నిత్యము అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు.మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహార పదార్థాలు వడ్డించాలని సూచించారు. హాస్టల్ ఆవరణతో పాటు వంట గదులు కచ్చితంగా శుభ్రంగా ఉంచాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రతిరోజు అందిస్తున్న భోజనం పై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.భోజన నాణ్యతను పరిశీలించి,విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు.ఈ కార్యక్రమాల్లో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, డిఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, గృహ నిర్మాణాల శాఖ పిడి గణపతి శ్రీనివాస్,ఎంపీడీవో కిషన్,మండల తాసిల్దార్ మండల వ్యవసాయ అధికారి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version