
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మంత్రి వివేక్ వెంకటస్వామి .
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మంత్రి వివేక్ వెంకటస్వామి జైపూర్,నేటి ధాత్రి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని తమ నివాసంలో కలిసిన తెలంగాణ కార్మిక,మైనింగ్ శాఖ మంత్రి అయినటువంటి గడ్డ వివేక్ వెంకటస్వామి,పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా మంగళవారం కలవడం జరిగింది.తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి,రైతుల సంక్షేమ, కార్మికుల హితానికి సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రితో మంత్రి వివేక్ వెంకటస్వామి సుదీర్ఘంగా చర్చించారు.