దుబాయ్, కువైట్ ఎయిర్ పోర్టులపై ఇరాన్ డ్రోన్ల దాడి…

దుబాయ్, కువైట్ ఎయిర్ పోర్టులపై ఇరాన్ డ్రోన్ల దాడి

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం రోజురోజుకు ముదురుతుంది. ఈ దేశాల మధ్య ఘర్షణ కారణంగా గల్ఫ్ ప్రాంతాలు విలవిల్లాడుతున్నాయి. తాజాగా దుబాయ్, కువైట్ ఎయిర్ పోర్టులపై ఇరాన్ డ్రోన్లతో దాడులు చేసింది.

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం రోజురోజుకు ముదురుతుంది. ఈ దేశాల మధ్య ఘర్షణ కారణంగా గల్ఫ్ ప్రాంతాలు విలవిల్లాడుతున్నాయి. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ పశ్చిమాసియా దేశాలపై డ్రోన్లతో దాడులు చేస్తోంది. ఇప్పటికే యూఏఈ, బహ్రెయిన్ వంటి పలు దేశాలపై ఇరాన్ దాడులు చేసింది. ఈ క్రమంలో తాజాగా కువైట్, దుబాయ్ విమానాశ్రాయలపై కూడా ఇరాన్ దాడులు చేయడంతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.
కువైట్, దుబాయ్ ఎయిర్ పోర్టులపై ఇరాన్ చేసిన డ్రోన్ దాడుల్లో ఎవరికి గాయాలు కాలేదని సమాచారం. అయితే ఈ రెండు విమానాశ్రయాల నుంచి భారీ స్థాయిలో దట్టమైన పొగలు వచ్చాయని, అక్కడి అధికారులు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ దాడుల్లో జోర్డాన్ పౌరుడు గాయపడినట్లు పేర్కొంది. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇరాన్ నుంచి వస్తున్న డ్రోన్లను, క్షిపణులను వైమానిక రక్షణ వ్యవస్థ అడ్డుకుంటుందని దుబాయ్ మీడియా పేర్కొంది. అయితే ఈ వ్యవస్థ నుంచి తప్పించుకున్న డ్రోన్ల కారణంగా తాజాగా ఎయిర్ పోర్టుల్లో పేలుళ్లు జరిగాయని దుబాయ్ మీడియా పేర్కొంది. ఇరాన్‌లోని 90 శాతం చమురును అందించే కీలకమైన ఖార్గ్ దీవిపై అమెరికా దాడి చేయడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ క్రమంలోనే ఇవాళ( ఆదివారం) దుబాయ్, కువైట్ ఎయిర్ పోర్టులపై దాడులు జరిగాయి .

యూఏఈపై 1,800 కి పైగా క్షిపణులు, డ్రోన్లను ఇరాన్ ప్రయోగించింది. టెహ్రాన్ గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకున్న దాడుల్లో యూఏఈపై జరిగినవే ఎక్కువ. ఇందులో1,600 డ్రోన్లు, 294 బాలిస్టిక్ క్షిపణులు , 15 క్రూయిజ్ క్షిపణులు ఉన్నాయి. ఈ దాడులలో ఆరుగురు మరణించారు. 141 మంది గాయపడ్డారు. శనివారం ఒక్క రోజే, తొమ్మిది బాలిస్టిక్ క్షిపణులు, 33 డ్రోన్లు యూఏఈపై ఇరాన్ ప్రయోగించింది.

రెండు రోజులు నీటి సరఫరా బంద్‌…

రెండు రోజులు నీటి సరఫరా బంద్‌

వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని తాగునీటి సమస్య పరిష్కారానికి సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ తయారీకి చర్యలు తీసుకున్నట్లు మిషన్‌ భగీరథ ఏఈ నాగభూషణం ప్రకటనలో తెలిపారు.

మెదక్‌: వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని తాగునీటి సమస్య పరిష్కారానికి సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ తయారీకి చర్యలు తీసుకున్నట్లు మిషన్‌ భగీరథ ఏఈ నాగభూషణం ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా పెద్దరెడ్డిపేట వద్ద పైప్‌లైన్‌ లీకేజీ మరమ్మతులు, రాయిపహాడ్‌ వద్ద స్లూయి్‌సవాల్స్‌ రిపేర్లు, సివిల్‌ పనులు, సంపులు శుభ్రపరచడం తదితర నిర్వహణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పనులు పూర్తిచేయడం కోసం సింగూరు(Singoor) నుంచి జిల్లాలకు నీటి సరఫరా నిలిపివేస్తున్నామని తెలిపారు.

ఇరాన్‌పై అమెరికా దాడులు.. ఆ వ్యాఖ్యలను ఖండించిన భారత్…

ఇరాన్‌పై అమెరికా దాడులు.. ఆ వ్యాఖ్యలను ఖండించిన భారత్

 

ఇరాన్‌పై దాడుల కోసం అమెరికా నౌకాదళం భారత పోర్టులను వినియోగిస్తున్నదన్న వార్తలను కేంద్రం ఖండించింది. ఇలాంటి ఆరోపణలు నిరాధారం, కల్పితమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రాచ్యంలో కొన్ని రోజులుగా భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై దాడుల కోసం అమెరికా నావికాదళం భారత నౌకలను ఉపయోగిస్తోందంటూ విస్తృతంగా జరుగుతున్న ప్రచారాలను కేంద్రం ఖండించింది. ఆ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, నిరాధారమని కేంద్ర విదేశాంగ శాఖ(MEA) స్పష్టం చేసింది.

అమెరికా మాజీ ఆర్మీ కల్నల్ డగ్లస్ మాక్‌గ్రెగర్ ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ.. ‘గల్ఫ్ ప్రాంతంలో అమెరికా సైనిక స్థావరాలపై ఒత్తిడి పెరగడంతో మా నావల్ బేస్‌లు ధ్వంసమయ్యాయి. మా నౌకాశ్రయ సదుపాయాలూ ధ్వంసమయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము భారత్, ఆ దేశానికి చెందిన నౌకాశ్రయాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇది సరైన మార్గం కాదు. అయినప్పటికీ పరిస్థితుల ప్రభావం కారణంగా అలా చేయక తప్పడం లేదు’ అని మాక్‌గ్రెగర్ అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో ఈ వివాదం చెలరేగింది. దీనిపై స్పందించిన కేంద్ర విదేశాంగ శాఖ ఫ్యాక్ట్‌చెక్ విభాగం.. ఆ వ్యాఖ్యలను పూర్తిగా ఖండించింది. ‘భారత పోర్టులు అమెరికా దాడులకు ఉపయోగిస్తున్నాయన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు’ అని ‘ఎక్స్’ వేదికగా ప్రకటించింది. నిర్ధారణ లేని సమాచారం సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దని హెచ్చరించింది.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version