చత్రపతి శివాజీ ని ఆదర్శంగా తీసుకోవాలి…

చత్రపతి శివాజీ ని ఆదర్శంగా తీసుకోవాలి

* విగ్రహ ఆవిష్కరణలో మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

 

యువత చత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలని మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్బంగా తుంకుంట మున్సిపాలిటీ మందయిపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు ఉమా ఆంజనేయులు, రాజ్ కుమార్ యాదవ్, బిఆర్ఎస్ అధ్యక్షుడు పాముల శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ నాలుక యాదగిరి, కృష్ణారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మందాయపల్లి వాసులు, యువకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version