మహోదయ పాఠశాలలో బోనాల పండుగ సంబరాలు
చందుర్తి, నేటిధాత్రి:
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలలో గొప్పదైన ఆషాడ మాస బోనాల సందర్భంగా మండలంలోని లింగంపేట గ్రామంలో గల మహోదయ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు గురువారం పోచమ్మ బోనాల కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఏనుగుల కృష్ణ మాట్లాడుతూ పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థినీ విద్యార్థులకు చిన్ననాటి నుండే మన సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన కలుగుతుందని అన్నారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులు బోనం నెత్తిన పెట్టుకొని, పోతరాజుల వేషధారణలో గ్రామ విధుల వెంట ఆటలాడుతూ పాటలు పాడుతూ పోచమ్మ ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఏనుగుల రేణుక, మింగలి కవిత, ఇందూరి సౌమ్య, కముటం స్వప్న, పహిమ, మున్నిర విద్యార్థులు పాల్గొన్నారు.