పేదోడి సొంత ఇంటి కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ .

పేదోడి సొంత ఇంటి కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం

1వ వార్డు మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్

పరకాల నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు పథకం పేదోడి సొంత ఇంటికల నెరవేరుస్తుందని మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ అన్నారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి సహకారంతో పరకాల మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డులో మద్దెల కళ్యాణి భద్రయ్య కి మంజూరైన ఇందిరమ్మ ఇల్లు ముగ్గు కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు.ఈ సందర్బంగా పేదకుటుంబాలలో సంతోషాలను చూస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్,స్థానిక మాజీ కౌన్సిలర్,సమన్వయ కమిటీ నాయకులు మడికొండ సంపత్ కుమార్,డాక్టర్. మడికొండ శ్రీను,మెరుగు శ్రీశైలం గౌడ్,చందుపట్ల రాఘవరెడ్డి,పట్టణ ఉపాధ్యక్షులు ఒంటెరు శ్రావణ్, నాయకులు మేకల వినయ్, బండారి రాజు,బొచ్చు జయాకర్ జాన్సన్,ఇందిరమ్మ కమిటీ సభ్యులు,వార్డ్ ఆఫీసర్, వార్డులోని పెద్దలు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version