ప్రజలు ఆశీర్వదిస్తే సుభాష్ కాలనీ అభివృద్ధి చేస్తా
బిజెపి పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఆపిల్ బాల్
భూపాలపల్లి నేటిధాత్రి
ప్రజలు నన్ను ఆశీర్వదించి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే సుభాష్ కాలనీ 29 వార్డు అభివృద్ధి చేస్తానని ఆపిల్ బాలు అన్నారు
మున్సిపాలిటీ సాధారణ ఎన్నికల్లో భాగంగా 29వార్డు బిజెపి పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి యాపిల్ బాల్ కార్యకర్తలతో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుభాష్ కాలనీ 29వ వార్డు ప్రజలు ఒక్కసారి నేను గతంలో ఓడిపోయాను రెండోసారి బిజెపి పార్టీ నుండి కమలం పువ్వు గుర్తుపై పోటీ చేస్తున్నాను కావున ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి మున్సిపాలిటీ కౌన్సిలర్ గా కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించగలరని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నేను గెలిచిన వెంటనే సుభాష్ కాలనీ సైడ్ డ్రైనేజీలు సిసి రోడ్లు వాటర్ సమస్య లేకుండా చేస్తాను అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
