నాలుగు లేబర్ కోడ్ లను రాష్ట్రంలో అమలు చేయకూడదు
ఏఐఎఫ్ టి యు రాష్ట్ర నాయకుడు చంద్రగిరి శంకర్ డిమాండ్
భూపాలపల్లి నేటిధాత్రి
ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ, సింగరేణిలో పెరిగిపోతున్న నేపథ్యంలో
సింగరేణి పరిరక్షణ పట్ల చిత్తశుద్ధి ఏ పాటిదో కార్మిక వర్గం అర్థం చేసుకోవచ్చు, అని ఏఐఎఫ్ టియు రాష్ట్ర నాయకుడు కామ్రేడ్ చంద్రగిరి శంకర్ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి బొగ్గు బ్లాక్ ల వేలం పాటలను వ్యతిరేకిస్తూ చిన్న సంఘాల ఆందోళన కార్యక్రమాలు చేస్తుండగా సి ఎం డి పిలుపునందుకొని సింగరేణి భవన్ కు చేరిన ఈ నాయకులు సింగరేణి భవిష్యత్తు, కొత్త గనులు పాత గనుల మూత లాంటి విషయాలతో స్టేటస్ రిపోర్టు చేతిలో పెడితే బసవన్న తలలూపి వచ్చిన ఈ జాతీయ సంఘాల నేతలు, తెలంగాణ డిప్యూటీ సీఎం కి సింగరేణి బొగ్గు గనుల వేలం పాటలకు వ్యతిరేకం కాదు అని ప్రత్యుత్తరాలు నడిపించుకున్న మహానటులు ఏఐటీయూసీ తో పాటు మిగతా కార్మిక సంఘం నాయకులు
ఈరోజు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక వర్గంపై చేస్తున్న దాడిని ఎదుర్కోవడానికి బలమైన కార్మిక ఉద్యమం అవసరమై ఉన్నది. చిన్న పెద్ద అనే ఈ గోలకు పోకుండా మిలిటెంట్ కార్మిక వర్గ పోరాటాలను నిర్మించాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా ఎన్ని పాలకవర్గ పార్టీలతో ఓట్లు సీట్లు పంచుకున్న పొత్తులు పెట్టుకున్న దేశవ్యాప్తంగా వస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలను విధానాలను మార్పులను ఏఐటియుసి తోపాటు జాతీయ సంఘాలు ఇవి కూడా అడ్డుకోలేకపోయాయి అనేది వాస్తవ సత్యం.
రాష్ట్ర ప్రభుత్వం కూడా బేషరతుగా కేంద్ర ప్రభుత్వ బొగ్గు గనుల వేలం పాటలను రాష్ట్రంలో రద్దు చేయాలని, సింగరేణి ఎక్స్ప్లోరిషన్ చేసిన బొగ్గు నిక్షేపాలున్న అన్ని బ్లాక్ లను సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నది. మరి ముఖ్యంగా రిజిస్టర్ కార్మిక సంఘాలను విడదీసి ఐక్య సంఘటన కు ప్రత్యక్షంగా జాతీయ కార్మిక సంఘాలు విభజించి పాలించు అనే చందంగా దోహద పడుతున్నాయి, కాబట్టి ఇప్పటికైనా రిజిస్టర్ కార్మిక సంఘాలు వారు భ్రమలకు లోను కాకుండా ఐక్యంగా కార్మికుల సమస్యల, పరిష్కారం కోసం పోరాటాలు చేయాల్సిన అవసరం ఆసన్నమైనది. కావున రిజిస్టర్ విప్లవ కార్మిక సంఘాలు ఒక తాటిపై ఉండి ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చిన చంద్రగిరి శంకర్ రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.
