కొండా మురళిని కలిసిన కాశీబుగ్గ దసరా ఉత్సవ సమితి
నేటిధాత్రి, కాశీబుగ్గ.
కాశిబుగ్గ దసరా ఉత్సవ సమితి అధ్యక్షులు ధూపం సంపత్ ఆధ్వర్యంలో హనుమకొండ రాంనగర్లో వారి నివాసంలో, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావును కలిసి కాశిబుగ్గ దసరా ఉత్సవాలకు ఐదు డివిజన్ల ప్రజలు కాశీబుగ్గ దసరాఉత్సవాలకు హాజరవుతారని, గ్రామీణప్రాంత ప్రజలు కూడా హాజరవుతారని ఉత్సవాలకు కావలసిన సదుపాయాలపై మున్సిపల్ సిబ్బందితో మైదానం క్లీనింగ్ చేయుట, లైటింగ్, సౌండ్ సిస్టం, స్టేజ్, ఆర్అండ్ బితో బారిగేట్స్, వాటర్ సప్లై, పోలీసు బందోబస్తు, కరెంటు సిబ్బంది, ఫైర్ సిబ్బంది, డిపిఆర్ ఓతో పలు సంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని దసరా ఉత్సవాలకు ఇలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని కొండా మురళీధర్ రావుకు మెమోరండం ఇవ్వడం జరిగినది.
కొండా మురళీధర్ రావు మాట్లాడుతూ కాశిబుగ్గ దసరా ఉత్సవాలు కావలసిన సదుపాయాలన్నీ మంత్రి కొండా సురేఖ ఏర్పాట్లు చేస్తారని తెలియజేస్తూ మున్సిపల్ కమిషనర్ కు ఫోన్ ద్వారా కాశిబుగ్గ దసరా ఉత్సవ సమితికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కమిషనర్ ను అధికారులను కొండా మురళీధర్ రావు కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నవీన్ రాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గుల్లపల్లి రాజ్ కుమార్, కన్వీనర్ బయ్య స్వామి, ప్రధాన కార్యదర్శి సముద్రాల పరమేశ్వర్, మాజీ కార్పొరేటర్ ఓని భాస్కర్, గణిపాక సుధాకర్, సిలివేరు రాజు, గుజ్జుల రాకేష్ రెడ్డి, గణిపాక కిరణ్, గోరంట్ల మనోహర్, గుత్తికొండ నవీన్, గుర్రపు సత్యనారాయణ, మార్టిన్ లూథర్, సిద్ధోజు శ్రీనివాస్, రామ యాదగిరి, బిల్లాశివ, క్యాతం రంజిత్, బాలమోహన్, తొగరు వీరన్న, గణిపాక కిరణ్, దేవర ప్రసాద్, పెండ్యాలసోను, కోటసతీష్, చింతం రాజు, కాశీబుగ్గ దసరా ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.