శ్రీవాసవి వాసవి కన్యకపరమేశ్వరి అమ్మవారికి అలంకరణ

వనపర్తి లో శ్రీవాసవి వాసవి కన్యకపరమేశ్వరి అమ్మవారికి మామిడి పండ్లతో అలంకరణ

వనపర్తి నేటిధాత్రి :

 

వాసవికన్యకాపరమేశ్వరి అమ్మవారికిమామిడి పండ్లతో నేడు అలంకరణ ఉంటుందని పట్టణ ఆర్యవైశ్య సంగం అధ్యక్షులు బచ్చురాం యూవజన సంగం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ ప్రచారకార్యదర్శి కల్వ భూపేష్ కుమార్ శెట్టి ఒక ప్రకటన లో తెలిపారు భక్తులు అమ్మవారికి తే చ్చే మామిడి పండ్లు మధ్యాహ్నం 12 గంటల లోపు అమ్మవారి గుడి లో ఇవ్వాలని వారు కోరారు.
శుక్రవారం సాయంత్రం మామిడిపళ్ళతో అలంకరణ అంతతరం అర్చన
7 గంటలకు కుంకుమార్చన
మంగళహారతి తీర్థ ప్రసాదలు అల్పాహారం ఉంటుందని వారు తెలిపారు
ఈ పూజలకు భక్తలు అధిక సంఖ్యలో పాల్గొని వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి కృపకు పాత్రలు కావాలని వారు కోరారు

నేడు వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి శోభాయాత్ర.!

నేడు వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి శోభాయాత్ర

వరంగల్ నేటిధాత్రి :

జగత్ జనని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వైశాఖ శుద్ధ దశమి మే 7న బుధవారం వరంగల్ నగరంలో శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు శోభాయాత్ర కన్వీనర్లు పొట్టి శ్రీనివాస్, దుబ్బ శ్రీనివాస్, దాచేపల్లి సీతారాం తెలిపారు.
సాయంత్రం 5 గంటలకు వరంగల్ స్టేషన్ రోడ్డులోని పోచమ్మ గుడి నుండి శోభాయాత్ర ప్రారంభం అవుతుందన్నారు. అమ్మవారి శోభాయాత్ర మేళతాళాలు మరియు ఆడపడుచుల దాండియా ఆటలతో ముందుకు సాగుతుందన్నారు. ఈ శోభాయాత్ర పోచమ్మ గుడి నుండి పోస్ట్ ఆఫీస్, వరంగల్ చౌరస్తా, జేపీఎన్ రోడ్, దుర్గేశ్వర స్వామి విది, పిన్నవారి వీధి, ఇంతేజర్ గంజ్ పోలీస్ స్టేషన్, మీదుగా బట్టల బజార్ లోని రామలింగేశ్వర స్వామి దేవాలయం ప్రక్కన గల వాసవి మాత దేవాలయం చేరుకుంటుంది. అనంతరం భక్తులందరికీ ప్రసాద వితరణ జరుగుతుంది.
ఆర్యవైశ్య బంధుమిత్రులందరు శోభాయాత్రలో పాల్గొని దిగ్విజయం చేయాలని శోభాయాత్ర కన్వీనర్లు కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version