జోరుగా ఎన్నికల ప్రచారం…!
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం గ్రామంలో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఝరాసంగం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గడ్డమీద లక్ష్మమ్మ చంద్రయ్య అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు వేయాలని అభ్యర్థించారు. ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హన్మంత్ రావు పాటిల్, సర్పంచ్ ల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు రుద్రప్ప పాటిల్, నాయకులు పాల్గొన్నారు.
