ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ దాడులు దుర్మార్గం…

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ దాడులు దుర్మార్గం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ఇరాన్‌పై అమెరికా మరియు ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బానీ వ్యతిరేకించారు. ఈ దాడిలో ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా ఖమేనీ మృతి పట్ల ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, అమెరికా మరియు ఇజ్రాయెల్ ఇస్లామిక్ దేశాలపై నిరంతర దాడులను, ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్నాయని ఆయన ఏకగ్రీవంగా ఖండించారు. అమెరికా మరియు ఇజ్రాయెల్ ఇతర దేశాలపై తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ, ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడాన్ని ఆయన ఖండించారు. ఐక్యరాజ్యసమితి వెంటనే అమెరికా మరియు ఇజ్రాయెల్‌పై చర్యలు తీసుకొని ప్రపంచ శాంతిని నెలకొల్పాలని ఆయన పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version