ఈ నెల 7 న జరిగే సీఐటీయూ మహాసభలను జయప్రదం చెయ్యండి..

ఈ నెల 7 న జరిగే సీఐటీయూ మహాసభలను జయప్రదం చెయ్యండి

◆:- మహాసభల వాల్ పోస్టర్ ను విడుదల చేసిన కార్మిక నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్. సెంటర్ ఆఫ్ ఇండియాన్ ట్రేడ్ యూనియన్స్ (సిఐటియు) రాష్ట్ర ఐదవ మహాసభలను జయప్రదం చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలపై భవిష్యత్తు ప్రణాళిక రూపొందించేందుకు ఈ మహాసభలు జరుగుతున్నాయనీ మహాసభల బహిరంగ సభలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని కార్మిక వర్గం జయప్రదం చేయాలని సిఐటియు జహీరాబాద్ పారిశ్రామిక క్లస్టర్ కన్వీనర్ ఎస్.మహిపాల్ పిలుపునిచ్చారు. మంగళవారం నాడు శ్రామిక భవన్లో జరిగిన సీఐటీయూ పారిశ్రామి క్లస్టర్ కమిటీ సమావేశంలో పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మహిపాల్ మాట్లాడుతూ కార్మిక ప్రజా పోరాటాల సారధి సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్(సిఐటియు) తెలంగాణ రాష్ట్ర ఐదో మహాసభలు ఈనెల 7 నుంచి 9 వరకు మెదక్ లో జరగనున్నాయని గత కార్యక్రమాలు చర్చించి భవిష్యత్తు ఉద్యమాలు పోరాటాలను రూపొందించేందుకు ఈ మహాసభలు జరుగుతున్నాయనీ, భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు పోరాటాలు కార్మికుల హక్కుల పరిరక్షణకు జరుగుతాయని అందుకోసం నిర్వహించే ఈ మహాసభల బహిరంగ సభలో కార్మిక వర్గం ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ పరిశ్రమల సీఐటీయూ యూనియన్ల నాయకులు రాజిరెడ్డి నరేష్ మహేశ్వర్ గణేష్ నారాయణ సందీప్ రెడ్డి కిరణ్ పాషా శివరామరావు బాబు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version