జాతీయ మెగా లోక్-అదాలత్ లో 353 కేసుల రాజీ
జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
భూపాలపల్లి నేటిధాత్రి
జాతీయ మెగా లోక్-అదాలత్ కార్యక్రమంలో భాగంగా, భూపాలపల్లి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన రాజీ పడదగిన కేసులను పరిష్కరించడం జరిగిందని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, తెలిపారు
ఐపీసీ బిఎన్ ఎస్ కేసులు 232
సైబర్ క్రైమ్ కేసులు – 24
డీడీ & ఎంవీ యాక్ట్ కేసులు 96 ఈ-పెట్టి కేసులు – 01
మొత్తం – 353 కేసులు
ఈ కేసుల్లో ఇరు వర్గాలను సమన్వయం చేసి రాజీ కుదిర్చి సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం జరిగింది. ముఖ్యంగా, సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులకు న్యాయం చేయడం లోక్-అదాలత్ ముఖ్య ఫలితంగా నిలిచింది. 24 సైబర్ క్రైమ్ కేసుల్లో రూ. 1,61,441/- మొత్తాన్ని బాధితుల ఖాతాల్లో జమ చేయుటకు సంబంధిత బ్యాంక్ నోడల్ అధికారులకు ఆర్డర్ కాపీలు పంపడం జరిగింది. ఇది బాధితులకు గొప్ప ఉపశమనంగా మారింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, మాట్లాడుతూ,
లోక్-అదాలత్ అనేది క్షణికావేశంలో జరిగిన తప్పులను సరిదిద్దుకునే అద్భుతమైన వేదిక అని పేర్కొన్నారు. చిన్న చిన్న గొడవలు, వివాదాలు కోర్టుల్లో సంవత్సరాల పాటు కొనసాగకుండా, ఇరు వర్గాలు రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవడం సమాజానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. “రాజీ మార్గమే రాజమార్గం” అనే భావన ప్రతి ఒక్కరికి ఉండాలని సూచించారు.
ఈ లోక్-అదాలత్ విజయవంతం కావడానికి కృషి చేసిన పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది, సైబర్ క్రైమ్ యూనిట్ ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
లోక్-అదాలత్ వంటి వేదికలు సమాజంలో శాంతి, సామరస్యాలను నెలకొల్పడంలో కీలకపాత్ర పోషిస్తాయని, ప్రజలు ఈ అవకాశాలను వినియోగించుకోవాలని ఎస్పీ గారు పిలుపునిచ్చారు.
