
హిందూ ధర్మమే మనల్ని రక్షిస్తుంది.!
హిందూ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. జహీరాబాద్ నేటి ధాత్రి: వేద పాఠశాల విద్యార్థులు హిందూ ధర్మ రక్షణ కోసం కృషి చేయాలని, అదే మనల్ని రక్షిస్తుందని జహీరాబాద్ సివిల్ కోర్టు న్యాయమూర్తి కవితా దేవి అన్నారు. ఝరాసంగం మండలం మరిదిపూర్ లోని దత్తగిరి ఆశ్రమంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దత్తగిరి పీఠాధిపతి అవధూత గిరి మహరాజ్ తో కలిసి ఈనెల 29న జరిగే శనీశ్వర జయంతి కరపత్రాలను ఆవిష్కరించారు.