
అభాగ్యులను ఆదుకునేదేవరు.?
అభాగ్యులను ఆదుకునేదేవరు.? పగలు చెట్ల కింద.. రాత్రిదుకానాలవద్ద. మెదక్ జిల్లాలో 200కు పైగా నిరాశ్రయులు. పట్టించుకోని మున్సిపల్ అధికారులు. రామాయంపేట డిసెంబర్ 31 నేటిధాత్రి (మెదక్) వారు ఎవరికి పట్టని అభాగ్యులు.. అనారోగ్యంతో కొందరు, మతిస్థిమతి లేక మరికొందరు ఏ ఆసర లేక నరకాన్ని అనుభవిస్తున్నారు. ఎవరైనా దయతలిస్తేనే వారి కడుపు నిండేది.. లేదంటే పస్తులు ఉండాల్సిందే. ఏ ఆశ్రయం లేక, ఎక్కడ తలదాచుకోవాలో తెలియక.. పగటిపూట చెట్ల కింద, రోడ్ల పైన.. రాత్రి అయితే దుకాణాల…