పోలీసుల సేవలకు సలామ్..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-30T122317.302.wav?_=1

పోలీసుల సేవలకు సలామ్..!!

◆:- ప్రజల క్షేమమే ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ లక్ష్యం

◆:- వరుణుడి బీభత్సం.. సహాయ కార్యక్రమాలలో పోలీసుల కృషి

◆:- మండలంలో సుడిగాలి పర్యటన, ప్రజలకు సలహాలు తగు సూచనలు

◆:- ముందస్తు చర్యల్లో ఎస్ఐ సేవలు అభినందనీయం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఒక్కసారిగా వరుణుడు బీభత్సం సృష్టించడంతో ప్రజలు, రైతులు అతలాకు తలమయ్యారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఇటు వరద నీటిలో మునిగిపోయిన పంట పొలాలు, అటు వర్షానికి కూలిన ఇండ్లు దీంతో భారీ నష్టానికి గురైన ప్రజలు, రైతులు.

 

అదేవిధంగా చెరువు కుంటలు నిండి రోడ్లపై ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ క్రమంలో ఝరాసంగం ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ తన సిబ్బందితో కలిసి మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను కాపాడటమే కాకుండా భారీ వర్షానికి ఇండ్లలోకి ప్రవహిస్తున్న నీటిని చూసి భయాందోళన చెందుతున్న ప్రజలకు ధైర్యాన్ని కల్పిస్తూ..

 

 

వారిని కూడా కాపాడి ముందస్తు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా చెరువు, కుంటలు నిండి రోడ్లపై భారీగా నీరు వరదల ప్రవహించడంతో విషయం తెలుసుకున్న ఎస్ఐ సంఘటన స్థలానికి చేరుకొని ప్రజలకు, రైతులకు తగు సూచనలు,సలహాలు ఇస్తూ రాకపోకలను నిలిపివేశారు. ప్రజల క్షేమమే తన బాధ్యతగా తీసుకొని ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ ఝరాసంగం మండల జిర్లాపల్లి ప్యాలారం దేవరంపల్లి ఎల్గోయి కృష్ణాపూర్ పోటీపల్లి గ్రామాలలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పర్య టించారు. ప్రజలు భారీ వర్షాలు ఉండడంవల్ల అప్ర మత్తంగా ఉండాలని తగు జాగ్రత్తలు పాటించాలని ఇటు రైతులను అటు ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్య పరుస్తూ ఎలాంటి భయాందోళన చెందవద్దని పోలీసుల కృషి, అండ ఉంటుందని ధైర్యాన్ని ఇస్తూ ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ చేస్తున్న సేవలకు హాట్సాఫ్ అంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. మహిళా అని లెక్కచేయకుండా తన విధి నిర్వహణ బాధ్యతగా నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలిచిన ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ సలాం కొడుతున్నారు.

 

 

ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు : ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ అన్నారు.ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు చెరువు కుంటలు నిండి రోడ్లపై ప్రవహిస్తున్న వరదనీటి ప్రమాదం ఉన్నందున రాకపోకలు నిలిపివేశామని అదేవిధంగా అత్యవసర సమయాల్లో ప్రజలు బయటకు వెళ్లాలని ప్రజలకు ఎప్పటికప్పుడు తగు సూచనలు సలహాలు ఇస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండేల చర్యలు చేపడుతున్నా మని అన్నారు.

నిజాంపేటలో సుమారు వెయ్యి…

నిజాంపేటలో సుమారు వెయ్యి
ఎకరాలు పంట నష్టం..
• మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి

నిజాంపేట: నేటి ధాత్రి

గత రెండు రోజుల కురిసిన భారీ వర్షాలకు నిజాంపేట మండల వ్యాప్తంగా సుమారు 1000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని బచ్చురాజుపల్లి, రజక్ పల్లి, నందిగామ, జడ్చర్ల తాండ గ్రామాల్లో పంటను పరిశీలించడం జరిగిందన్నారు. మౌనిక శ్రీలత, రమ్య ఉన్నారు.

రోడ్డు మరమ్మత్తులు చేపట్టిన బిజెపి నాయకులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T150239.383.wav?_=2

 

రోడ్డు మరమ్మత్తులు చేపట్టిన బిజెపి నాయకులు

బీజేపీ మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల లో ఊర నవీన్ రావు అధ్యక్షుడి ఆధ్వర్యంలో రోడ్డు పైనా గుంతలు పుడ్చడం కార్యక్రమం
బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షం కు ఓసి-3బాధిత గ్రామాలు నగరంపల్లి గ్రామం లోని ముసళ్ల కుంట గండి పడి నగరంపల్లి అప్పయ్యపల్లి గ్రామాల మధ్య రాకపోకలకు ఇబ్బంది కలిగి సీతారాంపూర్, బంగ్లాపల్లి, అప్పయ్య పల్లి నుండీ మండల కేంద్రం లోని పాఠశాలల కు వెళ్లే విద్యార్థులు మరియు వ్యవసాయా పనులకు వెళ్లే రైతులు ఇబ్బందులకు గురి అవుతున్న కారణం గా బీజేపీ కార్యకర్తలు స్వచ్చ భారత్ కార్యక్రమం లో భాగంగా రోడ్డు పై ఏర్పడ్డ గుంతలను పుడ్చారు అనంతరం నవీన్ రావు మాట్లాడుతు సింగరేణి యాజమాన్యం యుద్ధ ప్రతిపదికన రోడ్డు మరమ్మత్తు చర్యలు చేపట్టి ఆయా గ్రామాల మధ్య రాకపోకలు ఇబ్బంది లేకుండా చూడాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమం లో బూత్ అధ్యక్షులు భూక్యా హరిలాల్, ఇనుగాలా మొగిలి నాయకులుమామిడిపల్లి మల్లన్న, మైదాం శంకర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు

అధికారుల నిర్లక్ష్యంతో జలమయం అయిన రోడ్లు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T122912.268.wav?_=3

అధికారుల నిర్లక్ష్యం/ జలమయం అయిన నివాస ప్రాంతాలు రోడ్లు — ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం

◆:- విచ్చల విడిగా వ్యర్థాలను వదులుతున్న అల్లనా

◆:- దుర్గంధం వాసన వదిలిన అల్లనా

◆:- చెరువులను తలపిస్తున్న వెంచర్లు,రోడ్లు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జాహిరాబాద్ నియోజకవరగంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం తిరిగి పరిశీలించడం జరిగింది ,బారి వర్షాలకు రోడ్లు,వెంచర్ లు అన్ని జలమయం అయ్యాయి వాగులు వంకలు బోర్లి పోతున్నాయి ప్రతిసారి వర్షాలు కురుస్తున్న సమయంలో ఇదే అదనుగా భావించి అల్లనా పశువదశాల వ్యర్థాలను నాళాలో ప్రవహిస్తున్న నీటిలో వదులుతున్నాడు దింతో చుట్టూ ప్రక్కల దుర్గంధంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు ప్రజలు అనారోగ్యానికి గురి అయ్యే అవకాశాలున్నాయి అల్లనా వ్యర్టాలను వదులుతున్న ప్రదేశాన్ని స్వయంగా పరిశీలించడం జరిగింది

Negligence Leads to Flooded Roads

ఈ వ్యర్థాలు మొత్తం నారింజలో కలిసి నారింజ నీరు మొత్తం కలుషితమవుతున్నది ఈ విషయమై గత జూన్ మాసంలో పొల్యూస్యన్ కంట్రోల్ బోర్డ్ అధికారులకు, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసిన నాటి నుండి నేటి వరకు చర్యలు తీసుకున్నది లేదు,అధికారులు అల్లనా యాజమాన్యంతో కుమ్ముక్కై ఏ చర్యలు తీసుకోవడం లేదు,మరియు నాళాలు కాలువలు మళ్లించి,చిన్నవిగా చేసి అధికార పార్టీ నాయకులు వ్యాపారులు అక్రమంగా వెంచర్ లు ఏర్పాటు చేయడం జరిగింది ఆ అక్రమ వెంచర్ ల లో మొత్తం నీరు నిలబడి చేరువులను తలపిస్తున్నాయి గతంలోనే అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది వారు స్పందిస్తే ఇలా జరిగేదికాదు ప్లాట్లు కొనే వారు క్షుణ్ణంగా పరిశీలించి కొనుగోలు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి దీనికి కారణం ఇరిగేషన్ అధికారుల అసమర్థతే, మరియు

Negligence Leads to Flooded Roads

ఈ బారి వర్షాలకు రోడ్లపై బారి లోతుగా నీరు నిలబడి అల్గోల్,మరియు రాయిపల్లి డి గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి,నారింజ పూర్తిగా నిండుకొని గేట్లు చేడిపోయి సరిగ్గా తెరుచుకోనందున నీరు వెనక భాగాన నిలబడి పంటపొలాల్లో నీరు నిలబడి పంట నష్టం జరుగుతున్నది గేట్లపై నుండి నిరంత వృధాగా కర్ణాటకకు తరలిపోతున్నది అధికారులు,ప్రభుత్వం చర్యలు తీసుకొని ఉంటే నీటిని కపడుకోనేవారం,ఇప్పటి కైనా అధికారులు,ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్,ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకర్,శికారి గోపాల్,చల్లా శ్రీనివాస్ రెడ్డి,సి.యం. విష్ణువర్ధన్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు,

వరద బాధిత కుటుంబానికి ఆర్ఐ సాయం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T122050.539-1.wav?_=4

వరద బాధిత కుటుంబానికి ఆర్ఐ సాయం

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T122050.539.wav?_=5

ఈ విషయాన్ని తెలుసుకున్న న్యాల్కల్ తహశీల్దార్ ప్రభు ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్యామ్ రావు బాధిత కుటుంబాన్ని పరిశీలించారు. వారిని తాత్కాలికంగా గ్రామ పంచాయతీ కార్యాలయానికి తరలించారు. అంతేకాకుండా, ఆహారం, కొంత నగదు సహాయం అందజేసి ఆదుకున్నారు

బిజెపి ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్…

బిజెపి ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్

బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు ఊర నవీన్ రావు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలోని భూలక్ష్మి వద్ద బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు ఊర నవీన్ రావ్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహిచి దారి వెంట ఉన్న పిచ్చి మొక్కలను తొలగించడం జరిగింది
అలాగే నిన్న విపరీతంగా కురిసిన భారీ వర్షానికి గణపురం మండల కేంద్రంలోని గుడివాడ ప్రాంతాల్లో చాలా ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుకోవడం జరిగింది ఇది కేవలం ఊర కాలువను శుభ్రం చేయకుండా చెత్తాచెదారం పిచ్చి మొక్కలు పేరుకోవడం వల్ల వచ్చిన వరద నీరు కిందకు పోకపోవడం వలన ఇళ్లలోకి చొరబడడం జరిగింది అది తెలుసుకున్న బిజెపి పార్టీ బృందం ఆ ప్రాంతాన్ని సందర్శించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారితో ఫోన్లో మాట్లాడి సమస్యను మళ్ళీ పునరావృతం కాకుండా త్వరితగతిన పరిష్కరించాలని కోరడం జరిగింది లేనిపక్షంలో నిరసన కార్యక్రమం చేస్తామని చెప్పడం జరిగిందిఈ కార్యక్రమంలో బీజేవైఎం కలాశాలాల విభాగం రాష్ట్ర కన్వీనర్ మంద మహేష్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి చెలుమల్ల ప్రవీణ్ కుమార్, బిజెపి మండల ఉపాధ్యక్షులు మధాసు మొగిలి, డాకురి కృష్ణ రెడ్డి,బిజెపి జిల్లా నాయకులు,దుగ్గుషెట్టి.పూర్ణ చందర్ , మండల మహిళా నాయకురాలు బొల్లం అరుణ,బిజెపి మండల నాయకులు మంధల రాజు తదితరులు పాల్గొన్నారు.

భారీ వర్షానికి పలువురు ఇండ్లలోకి నీరు…

భారీ వర్షానికి పలువురు ఇండ్లలోకి నీరు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలోని గుడివాడ ప్రాంతంలో నిన్న కురిసిన అతి భారీ వర్షాలకు పలువురి ఇండ్లలోకి వర్షపు నీరు వచ్చిందని తెలుసుకొని ఆ ప్రాంతాన్ని సందర్శించిన భారతీయ జనతా పార్టీ బృందానికి పక్కనే ఉన్న కాలువ లో పిచ్చి మొక్కలు చెత్తాచెదారం పేరుకుపోవడంతో నీరు ముందుకు వెళ్లకుండా కాలనీలోకి రావడం జరిగిందని గమనించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి ఫోన్లో సంప్రదించడం జరిగింది వెంటనే స్పందించిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిఇ ఏఈ ప్రాంతాన్ని సందర్శించి త్వరలోనే తగు చర్యలు తీసుకొని మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమంలో రైతులు సిరిగనేని బాబురావు మోటపోతుల చందర్ గౌడ్ బీజేవైఎం కళాశాల విభాగం రాష్ట్ర కన్వీనర్ మంద మహేష్, బిజెపి బూత్ అధ్యక్షులు పెండ్యాల శ్రీకాంత్ కాలనీవాసులు ఉన్నారు

ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి ఎమ్మెల్యే మాణిక్ రావు…

ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు స్థానిక బిఆర్ఎస్ నాయకులతో కలిసి కొత్తూర్ శివారులో గల నారింజ బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇరిగేషన్ శాఖ అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటూ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు ముఖ్యంగా వరద నీటి ఉద్రితిని నిరంతరం పర్వేక్షించాలని అధికారులను అదేశంచారు ఈ సంధర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల లో నివాసముండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో నివాసం ఉండరాదని నీళ్లలో ఉన్న కరెంటు పోల్స్ ను తాకడం మరియు దగ్గర నుండి వెళ్లడం చేయరాదని పొంగి పొర్లే వాగులు వంకలను చూడటానికి వెళ్లకూడదని జలాశయాలు నిండుకుండల మారి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని పొంగిపోరిలే వాగులను దాటడానికి

 

 

ప్రయత్నించకూడదని అన్నారు గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు సైతం లెక్క చేయకుండా నియోజవర్గం లో పర్యటిస్తూ వివిధ శాఖల అధికారులను తగిన సూచనలను చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవాలని పలు శాఖల అధికారులను ఆదేశించడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే గారితో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరాసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,పాక్స్ చైర్మన్ మచ్చెందర్ సీనియర్ నాయకులు నామ రవికిరణ్ మాజి పట్టణ అధ్యక్షులు మోహియోద్దీన్ మండల బీసీ సెల్ అధ్యక్షులు అమిత్ కుమార్ ఎస్టీ సెల్ అధ్యక్షులు హిరు రాథోడ్ మాజి సర్పంచ్ లు కరణ్ రాజ్ జగదీష్ శంకర్ కొత్తూర్ గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమేష్ రెడ్డి నాయకులు శ్రీకాంత్ అరుణ్ పాప్ నాథ్ భీమ్ రావు రాథోడ్ నవీన్ తేజ శశి వర్ధన్ రెడ్డి బి ఆర్ ఎస్వీ నాయకులు ఫయాజ్ గ్రామ నాయకులు యేసు అతీఫ్ రౌఫ్ రాజు శివరాజ్ తదితరులు ఉన్నారు ..

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-28T153306.328-1.wav?_=6

 

 

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు…

– మరో మూడు రోజులు ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి…..

– జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్…

కొల్చారం,( మెదక్)నేటి ధాత్రి:-

 

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల. ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్ కోరారు. పాత ఇళ్లలో ఉన్నవారు కూలిపోయే దశలో ఉన్న ఇళ్ల నుండి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అన్నారు. నదులు,చెరువులు,వాగులు లోతట్టు ప్రాంతాలు,కల్వర్టులు వంటి ప్రాంతాలకు వెళ్ళకూడదు అని సూచించారు.
అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుండి బయటికి రాకూడదు, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరారు. ఇంకా మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ సూచించింది. కావున రైతులు పొలాలో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తలు వహించాలి. విద్యుత్ స్తంభాలను గాని, వైర్లను కానీ తడిచిన చేతులతో తాకకకూడదు. నీరు నిలువ ఉన్న విద్యుత్ స్తంభాల దగ్గర నుండి వెళ్లారాదు అని భాగ్యరాజ్ తెలిపారు.

అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-28T131444.482.wav?_=7

అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు

పరకాల ఏసీపీ సతీష్ బాబు

పరకాల నేటిధాత్రి

 

గత రెండు రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్నతరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల ఏసీపీ సతీష్ బాబు డివిజన్ ప్రజలను కోరారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ఎలక్ట్రికల్ పోల్స్,ట్రాన్స్ఫర్మర్స్ లను ఎవరు తాకరాధని,శిథిలావస్థలో ఉన్న ఇండ్ల లోనివారు అప్రమత్తంగా ఉండాలి,వర్షాలు తగ్గే వరకు తాత్కాలికంగా వేరే చోట ఉండాలని కోరారు.చెరువులు నిండి ప్రమాదస్థాయిలో ఉన్నందున,చేపలు పట్టడానికి చెరువుల వద్దకు ఎవరు వెల్లవద్దని రోడ్లపై వరద వచ్చినపుడు వాహనధారులు అట్టి వాహనాలను రోడ్లపై దాటుటకు ప్రయత్నించకూడదని,అత్యవసరం ఉంటే తప్ప ఇంట్లో నుండి ఎవరు బయటికి రాకుడదని ఎటువంటి ఇబ్బందీ కలిగిన పోలీస్ వారికి డయల్100 ద్వారా సమాచారం ఇవ్వాలని పోలీసులు ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటారని తెలిపారు.

ఝరాసంగం ఆలయంలో అమృతగుండం పొంగిపొర్లుతోంది..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-28T130818.367-1.wav?_=8

 

ఝరాసంగం ఆలయంలో అమృతగుండం పొంగిపొర్లుతోంది

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఝరాసంగం మండల కేంద్రంలో ఉన్న శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా అమృతగుండం నిండుకుండలా మారింది. ఆలయ సిబ్బంది భక్తులను ఆలయంలోకి అనుమతించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సబ్ -ఇన్స్పెక్టర్ ఝరాసంగం..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-28T124209.857.wav?_=9

 

భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా

ఉండాలి సబ్ -ఇన్స్పెక్టర్ ఝరాసంగం

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల్ సబ్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ పటేల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలలో నివాసం ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, శితిలావస్తాలో ఉన్న ఇండ్లలో నివాసం ఉండరాదని అన్నారు. నీళ్ళలో ఉన్న కరెంట్ పోల్స్ దగ్గర నుండి వెళ్లారాదని పొంగిపోర్లే వాగులు, వంకలను చూడటానికి వెళ్లకూడదని, జలాశయాలు నిండు కుండలా మారి ప్రమాదాలు జరగటానికి అవకాశం ఉంటుందని పొంగిపోర్లే వాగులను దాటడానికి ప్రయత్నించకూడదని అన్నారు. అత్యవసర సమయాలలో డైల్ 100 లేదా సమీప పోలీసు స్టేషన్ కు సమాచారం అందించాలని ఝరాసంగం మండలం పరిసర ప్రజలకు సబ్ ఇన్స్పెక్టర్ తెలిపారు.

భారీ వర్షాలు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – బిఆర్ఎస్ నాయకుడు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-28T121259.569.wav?_=10

 

భారీ వర్షాలు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – బిఆర్ఎస్ నాయకుడు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం బిఆర్ఎస్ పార్టీ మెదపల్లి మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పటేల్,ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు.

వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నందున ఇళ్ల నుండి బయటకు వెళ్లవద్దని, రైతులు వ్యవసాయ బోర్ల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరెంటు స్తంభాలను తాకరాదని, ముఖ్యంగా చిన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, గణేష్ మంటపాల వద్ద కూడా తగు జాగ్రత్తలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

నీట మునిగిన కాలనీ, స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే మాణిక్ రావు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-28T120501.725.wav?_=11

 

నీట మునిగిన కాలనీ, స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే మాణిక్ రావు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కుండ పోత వర్షానికి పట్టణ పరిధిలోని డ్రీమ్ ఇండియా కాలనీ, ఇతర ప్రాంతాలు నీట మునిగాయి ,ఇళ్లల్లోకి నీరు చేరింది. విషయం తెలుసుకున్న జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు కాలనీలలో స్వయంగా వరద నీటిలోనికి దిగి నీట మునిగిన ఇళ్లను, ప్రవాహాన్ని స్వయంగా తమ ఫోన్ లో ఫోటోలు తీసి ఉన్నత అధికారులకు పంపించారు. అధికారులతో స్వయంగా చరవాణి ద్వారా మాట్లాడారు. కాలనీ వాసులతో మాట్లాడి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. నీట మునిగిన ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ఆధైర్య పడకండి అండగా ఉంటానని వారికి ధైర్యాన్ని ఇచ్చారు. వర్షపు నీటిని బయటకు పంపించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని అక్కడికి వచ్చిన అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వర్షం కురుస్తున్నందున అధికారులు పర్యవేక్షిస్తూనే ఉండాలని తెలిపారు.ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారులకు తెలియజేయాలని ప్రజలకు తెలియజేశారు.
ఎమ్మెల్యే గారితో పాటు గా మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు .

భూపాలపల్లిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-28T111949.266.wav?_=12

భూపాలపల్లిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్

భారీ వర్షాలు కురుస్తున్నాయి ప్రజలు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి

వంతెనల పై నుండి ప్రజలు వాహనదారులు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి

అత్యవసర పరిస్థితిలో ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయగలరు 9030632608

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉధృతంగా పొంగిపొర్లుతున్నాయి. రహదారులపై నీరు చేరిన చోట్ల, కాజ్‌వేల వద్ద ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు, వాహనదారులు వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు.

కలెక్టర్ మాట్లాడుతూ మొరంచపల్లి వాగు ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి ప్రవహిస్తోందని, ఎగువ ప్రాంతాల నుండి వచ్చే వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి అవసరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా చేపట్టాలని స్పష్టం చేశారు. రహదారులపై నీరు ప్రవహిస్తున్న మార్గాల్లో ప్రయాణాలు జరగకుండా తగిన నియంత్రణ చర్యలలో భాగంగా ట్రాక్టర్లు లేదా ఇతర వాహనాలను అడ్డు పెట్టాలని ఆదేశించారు.

ప్రజలు, వాహనదారులు ప్రభుత్వం అధికార యంత్రాంగం ఇచ్చే సలహాలు, సూచనలు కచ్చితంగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో 9030632608 కంట్రోల్ రూముకు కాల్ చేయాలని సూచించారు. జాలర్లు చేపల వేటకు వెళ్లకుండా ఉండాలని కలెక్టర్ హెచ్చరించారు. అలాగే వర్షాల కారణంగా పశువులు ప్రమాదానికి గురికాకుండా చూడాలని, వాటిని మేత కోసం బయటకు వదలకుండా యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
కలెక్టర్ రాహుల్ శర్మ ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని, చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణ నష్టానికి దారితీయొచ్చనని హెచ్చరించారు. గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు. వరద ప్రవాహాన్ని తాసిల్దార్ శ్రీనివాస్ ఆర్ ఐ భాస్కర్ కలిసి పరిశీలించారు

ప్రజా సమస్యలపై పోరాడుదాం…

ప్రజా సమస్యలపై పోరాడుదాం…

బి జె పి జిల్లా ప్రధాన కార్యదర్శి,మాజీ ఎంపిటిసి మదన్ నాయక్

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

కేసముద్రం మండలంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు ఉప్పు నూతల రమేష్, అధ్యక్షతన లక్ష్మి సాయి గార్డెన్స్ లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి బీజేపీ మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి,మాజీ ఎంపీటీసీ మదన్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ, నీళ్లు నిధులు నియామకాల పేరిట ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని గత పది సంవత్సరాలు ( బి.ఆర్.ఎస్ ) పార్టీ నాయకులు రాబందుల్లా దోసుకుంటే దాదాపు 18 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న దున్నపోతు మీద వర్షం పడినట్టు వ్యవహరిస్తుందని అన్నారు. ప్రజా సమస్యల మీద బిజెపి రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేపట్టి, కెసిఆర్ ను గద్దె దించడంలో ప్రధాన పాత్ర పోషించిందని గుర్తు చేసారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కేసముద్రం మండలంలో ఉన్నటువంటి గ్రామాలు ఎటువంటి అభివృద్ధి చెందలేదని,  రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అన్ని స్తానిక సంస్థలకు సరైన సమయంలో ఎన్నికలు నిర్వహించక పొవట వలన గ్రామా పంచాయతిలకు  రావలిసిన  కోట్లాది రూపాయల కేంద్ర నిధులు మురిగి పోయి గ్రామిణా అభివృద్ది కుంటుపడుతున్నది,
గ్రామపంచయతిల లో పంచాయతి అధికరులకు   పరిపాలన భారంవుతన్నది. కావున వెంటనే అన్ని స్తానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసారు.ప్రజా సమస్యల పరిష్కారానికి బిజెపి కార్యకర్తలు పోరాడాలని అన్నారు.

ఈ కార్యక్రమం అనంతరం కేసముద్రం తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలిగా వెళ్లి కేసముద్రం మండలం లోని వివిధ గ్రామల ప్రజలు ఎదుర్కుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం అందజేసారు.
ఈ సందర్భముగ బిజెపి మండల అద్యక్షుడు ఉప్పునూతల రమేష్ మాట్లాడుతూ గత వారం పది రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా మండలంలోని ఉప్పరపల్లి , ఇంటికన్నె , వేంకటగిరి, కాట్రపల్లె, అర్పనపల్లె, మహమూద్పట్నం, తాళ్ళపుసపల్లి, నారయణపురం,అన్నారం, గాంధీ నగరం, సప్పిడిగుట్ట తండ, కోరుకొండపల్లె , మేగ్య తండ,అనేక తండా గ్రామాల్లో పారిశుధ్య సమస్యలు, రోడ్లపై నీళ్లు నిలవడం, బురద ఏర్పడటం, సీజనల్ వ్యాధుల వ్యాప్తి, డ్రైనేజీ వ్యవస్థలు మూసుకుపోవడం, మురుగునీటి నిల్వతో సీజనల్‌ వ్యాధులు ప్రబలి  గ్రామాల్లో ప్రజలు  తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని,కేసముద్రం మండలం లోని అన్ని గ్రామాలలో  పారిశుద్ధ్యం, నీటి సరఫరా  సరైన  రోడ్డు, రవాణ, విద్యుత్ , మంచినీరు వంటి సౌకర్యాలు కల్పించాలని. భారీ వర్షాల కారణంగా ప్రజలు అనారోగ్యం పాలు కాకుండా గ్రామాలలో పేరుకు పోయిన మురుగు  నీరును తొలగించి , బ్లీచింగ్ పౌడరు చల్లి మరియు అంటువ్యాధులు ప్రబలకుండా నివారించాలని ,మురుగు నీటి కాలువలను శుభ్రపరచాలని, పైప్‌లైన్ వ్యవస్థలను మెరుగుపరచి, గ్రామాలలో  పరిశుభ్రమైన వాతావరణాన్ని నెలకొల్పి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని.  కేసముద్రం మండలం లోని గ్రామాలలో అంటు వ్యాధుల నివారణ కు  మండల వైద్య శాఖా  అధికారులచే తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు .
 కల్వల  గ్రామంలో మురుగు నీరు బయటకు  పోయే కనీస వసతులు లేక పోవడంతో గ్రామస్థులు, ప్రజలు  ఇబ్బందులకు గురవుతున్నారని. మెయిన్ రోడ్డు మరియు  కాలనీల్లో  డ్రైనేజీ లేకకపోవడంతో రోడ్లపైనే మురుగు నీరు, వరద నిరు  ప్రవహిస్తోంది. దీంతో ఈగలు, దోమలు ఇళ్లలోకి వస్తుండడంతో  అనారోగ్యానికి గురవుతున్నారని. గతంలో సెల్యులైటిస్, బోదకాలు , డెంగ్యూ జ్వరాలతో కల్వల గ్రామంలో బాధపడ్డారని.కావున ఆ గ్రామంలో మెయిన్ రోడ్డు మరియు  కాలనీల్లో  డ్రైనేజీ నిర్మించి ప్రజల  ఆరోగ్యాన్ని కాపాడాల డిమాండ్ చేసారు.

 

  దీనికి తోడు ఇప్పుడు ఈ గ్రామంలో మనుషుల జనాభా కంటే కోతుల, కుక్కల  సంఖ్యనే ఎక్కువగా‌ ఉందని. భయటికి వెళ్ళాలంటేనే జనం భయపడుతున్నారని , గ్రామాల్లో ప్రజల పై కోతులు, కుక్కల  దాడులు పెరిగి అనేక మంది ప్రజలు  తీవ్ర గాయాల పాలైన సంఘటనలు జరిగాయని,అంతే కాకుండా  ఇక్కడ ప్రజలు ఆరుతడి పంటలు సాగు చేయడం వదిలిపెట్టారని. ఇప్పటికే ఇంటి పై కప్పులను ద్వసం చేస్తున్నాయని . గతంలో‌ మనుషులని చూస్తే కోతులు భయపడి పరుగులు తీసేవి. కాని ఇప్పుడు కోతులను, కుక్కలను  చూసి మనుషులు భయపడే పరిస్థితి నెలకొంటుందని కావున కేసముద్రం మండలం లోని అన్ని  గ్రామాలలో ఉన్న కోతుల, కుక్కల బెడద నుండి ప్రజలను కాపాడాటానికి తగు చర్యలు తీసుకోవాలని బిజేపి మండల శాఖ తరుపున డిమాండ్ చేసారు .
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు నరసింహ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శిలు బోగోజు నాగేశ్వర చారి,ఉపేందర్ , మండల ఉపాద్యక్షులు కొండపల్లి మహేందర్ రెడ్డి ,నాగరాబోయిన చంద్రకళ, కార్యదర్శి జాటోత్ నరేష్ ,మాల్యాల రాములు, పూర్ణకంటి భాస్కర్ , బండి వెంకన్న ,శ్రీను ,రమేష్ నాయక్ ,సురేష్ నాయక్ ,మంగా వెంకన్న, భుక్య విజయ్ , జంగిటి అనిల్ ,సింగంశెట్టి మధుకర్ , పరకాల మురళీ మైనారిటీ మోర్చా నాయకుడు ఖాసిం తదితరులు పాల్గొన్నారు.

పురాతన భవనం కూల్చివేత…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-21T141822.488-1.wav?_=13

పురాతన భవనం కూల్చివేత

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం(జహీరాబాద్): మండల కేంద్రంలో సుమారు 150 సంవత్సరాల క్రితం ఝరాసంగం శ్రీ కేతకీ సంగమేశ్వర ఆలయ ఆవరణలో నిర్మించిన పురాతన భవనం శిథిలావస్థకు చేరడంతో కూల్చివే శారు. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భవనం ఓ పక్క కూలిపోవడంతో ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామపంచాయతీ అధికారుల ఆదేశాలతో భవన యజమాని కూల్చివేత పనులు ప్రారంభించారు. కొన్ని ఏళ్ల పాటు ఓ వైపు కుటుం బం నివాసం ఉండటంతో పాటు అప్పట్లో పోలీస్
స్టేషన్, ఆ తర్వాత బీసీ సంక్షేమ వసతి గృహం కొనసాగింది. అనంతరం సినిమా ప్రదర్శనల తోపాటు ప్రైవేటు కార్యాలయం ఏర్పాటు చేశారు.

భారీ వర్షానికి కూలిన ఈద్గా ప్రహరీ గోడ,…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-20T111520.570.wav?_=14

 

భారీ వర్షానికి కూలిన ఈద్గా ప్రహరీ గోడ,

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండల మాద్రి గ్రామంలో కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోతగా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే భారీ వర్షాలకు కురుస్తున్న భారీ వర్షాలతో 15 ఏళ్ల క్రితం కట్టిన ఈద్గా ప్రహరీ గోడ కూలిపోయింది.గోడ కూలిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణహానీ జరగలేదు. అయితే ఈద్గా పరిసర ప్రాంతాలకు తీవ్రంగా నష్టం ఏర్పడినట్లు స్థానికులు తెలిపారు.తక్షణమే స్పందించి పునర్నిర్మానం చేపట్టాలని స్థానికులు కోరారు.

గిరిజన బాలికల హాస్టల్‌కు కొత్త భవనం డిమాండ్.

చర్ల ట్రైబల్ వెల్ఫర్ గర్ల్స్ ఎస్టీ హాస్టల్ కు నూతన భవనం మంజూరు చేయాలి

పివైఎల్ భద్రాద్రి జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ ముసలి సతీష్

నేటిదాత్రి చర్ల

చర్ల మండల కేంద్రంలో ఉన్న బాలికల గిరిజన హాస్టల్ శిథిలవస్థలో ఉన్నదని ఈ భవనాన్ని తక్షణమే కూల్చివేయాలి ప్రస్తుతం అద్దేభవనం ఏర్పాటుచేసి కొత్త భవనం నిర్మించాలని కోరుతూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు పి వై ఎల్ ప్రగతిల యువజన సంఘం ఆద్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించడం జరిగింది
అనంతరం పిడిఎస్ యు మండల నాయకురాలు శిరీష అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో పివైఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు కామ్రేడ్ ముసలి సతీష్ మాట్లాడుతూ 130 మంది విద్యార్థులు ఈ భవనంలో ఉంటున్నారని ఈ భవనం నుంచే స్కూలు కు వెళ్లి చదువుకుంటున్నారని అలాంటి భవనం శిథిలవస్తులో ఉన్నదని వర్షాలు తీవ్రతరం కావడంతోటి గోడలు మొత్తం నాని కురుస్తున్నాయని పెచ్చలు ఊడిపోయి మీద పడుతున్నాయని ఆయన అన్నారు బిల్డింగ్ కూడా కూలిపోయే పరిస్థితిలో ఉందని విద్యార్థినిలు భయాందోళనలో ఉన్నారని ఈ బిల్డింగు శిథిలావస్థకు వచ్చిందని అధికారులకు తెలిపీనా పట్టించుకోని పరిస్థితుల్లో వాళ్ళు లేరని బాత్రూములు కూడా సరిపోను లేవని తక్షణమే నూతన బిల్డింగును ఏర్పాటు చేయాలని కోరారు ఈ బిల్డింగ్లో విద్యార్థినిలకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని ముందే ఆ ప్రమాదాన్ని గమనించి ప్రభుత్వ అధికారులు అప్పటివరకు తాత్కాలిక హాస్టల్ నీ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు

భారీ వర్షాలకు అప్రమత్తంగా…

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,ఝరాసంగం పంచాయతీ కార్యదర్శి వీరన్న ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంగళవారం అయన మాట్లాడుతూ. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటకు రావద్దని, పిల్లలను బయటికి పంపవద్దని, విద్యుత్ స్తంభాల వద్ద జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version