“జగిత్యాల జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అప్రమత్తం సూచనలు”…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T155921.826-1.wav?_=1

 

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మరి కొన్ని రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు లోతట్టు ప్రాంత నివాసితులు జాగ్రత్తలు తీసుకోవాలి-గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
అత్యవసర సమయంలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి- బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
మెట్పల్లి ఆగస్టు 18 నేటి ధాత్రి

 

 

జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సంబంధిత శాఖ అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, జిల్లాలో ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగడానికి వీలు లేకుండా అవసరమైన సహాయక చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కోరారు. మరి కొన్ని రోజులపాటు భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం పార్టీ కార్యాలయంలో పత్రిక ప్రకటనను విడుదల చేశారు.
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండలాలు, గ్రామాలు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో, వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చూసుకోవాలని కోరారు. ప్రజలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని తెలిపారు. గ్రామాల్లో ఉదృతంగా ప్రవహించే వాగులు, నీటి వనరుల సమాచారం తెలుసుకొని, వాటికి సమీపంలో ఉన్న రోడ్లు వంతెనలపై రాకపోకలను నిలిపివేయాలని, దీని కోసం స్థానిక అన్ని శాఖల అధికారుల సహకారం తీసుకోవాలని పేర్కొన్నారు.
అదే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా ఆస్పత్రి వరకు వైద్యులు సిబ్బంది సకాలంలో విధులకు హాజరయ్యేలా చూడాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్య సేవలను అందుబాటులో ఉంచాలని కోరారు. భారీ వరదల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరులు దెబ్బతినకుండా జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. భారీ వర్షాలు వచ్చిన తర్వాత పారిశుధ్య నిర్వహణ పట్ల ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.
కాగా రెవెన్యూ, పోలీస్ శాఖ, నీటిపారుదల శాఖ, మున్సిపల్ శాఖ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాలో ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఒకవేళ ఒకేసారి కుంభవృష్టి వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశం ఉందని, తక్కువ సమయంలో ఎక్కువ వరద రానున్న నేపథ్యంలో అలాంటి ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యంత్రాంగం సిద్ధం కావాలని సూచించారు.
అంతే కాకుండా భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రజలు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్పితే బయటకు వెళ్ళకూడదని కోరారు. వరద ప్రవాహం ఉన్న వంతెనలు, కల్వర్ట్, రహదారులపై నుండి ప్రజలు దాటవద్దని, శిధిల వ్యవస్థలో ఉన్న ఇండ్లలో నివాసం ఉండద్దని, తడిగా ఉన్న కరెంట్ పోల్స్, ట్రాన్సఫర్స్ తాకవద్దని, శివారు ప్రాంతాల్లో చేపల వేటకు ఎవరు వెళ్ళొద్దని సూచించారు. రైతులు కరెంటు బావుల దగ్గరికి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, వరద నీరు వెళ్లే నాలాలు, మ్యాన్ హోల్స్ సమీపంలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు. విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడే ప్రమాదాలు ఉంటాయని, కావున ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.
వర్షాలు, వరదల వల్ల సహాయక చర్యలు చేపట్టేందుకు స్థానిక అధికారులు సిద్ధంగా ఉన్నారని, కానీ అన్నిటి కన్నా ముఖ్యంగా ఎవరికివారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అత్యవసరమైతే, ఏదైనా సంఘటన జరిగితే స్థానిక అధికారులకు సమాచారం అందించి సహాయక చర్యలు పొందాలని కోరారు.
అదే విధంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న భారీ వరద నీటి కారణంగా ప్రాజెక్టు నిండి వరద గేట్లు ఎత్తి గోదావరి నదిలోకి వదిలి పెట్టారని జిల్లాలో గోదావరి నది పరిసర ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే పశువుల కాపర్లు, గొర్ల కాపరులు, చేపలు పట్టేవారు, రైతులు, సామాన్య ప్రజలు గోదావరి నదిని దాటే ప్రయత్నాలు చేయవద్దని కోరారు.

చింగేపల్లి-ఇబ్రహీంపుర్ రోడ్డులో వరద బీభత్సం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T144435.139.wav?_=2

 

చింగేపల్లి-ఇబ్రహీంపుర్ రోడ్డులో వరద బీభత్సం: రాకపోకలకు అంతరాయం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండలం చింగేపల్లి నుండి ఇబ్రహీంపుర్ వెళ్ళే రోడ్డు మార్గంలో భారీ వర్షాల కారణంగా వరద నీరు బ్రిడ్జి పైనుండి ప్రవహించడంతో రోడ్డు పక్కన మట్టి కొట్టుకుపోయింది. దీనివల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

“సంగారెడ్డి, మెదక్‌లో భారీ వర్షాలు”……

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-8-6.wav?_=3

సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాకపోకలు తీవ్రంగా అంతరాయానికి గురయ్యాయి.

మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్‌లో అత్యధికంగా 17.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కౌడిపల్లి 17.2, పెద్ద శంకరంపేట 16.4, దామరంచ 15.8, మాసాయిపేట 14.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లా కంగ్టిలో 17 సెంటీమీటర్లు, కల్హేర్ 11.9, కడ్పాల్ 10.6, అన్నసాగర్ 10.3 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది.

ఇక నిన్న సిద్దిపేట జిల్లాలోని గౌరారం అత్యధికంగా 23.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు చేసింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసి రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదైంది.

హైదరాబాద్‌లోనూ రాత్రి నుంచి ఉదయం వరకు వర్షం కురిసి పలు ప్రాంతాలు నీటమునిగాయి. హైదర్‌నగర్ 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు చేసింది. మల్కాజిగిరి, కూకట్‌పల్లి, కాప్రా, శేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, అల్వాల్ వంటి ప్రాంతాల్లో 4 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

వర్ష బీభత్సం తీవ్ర పంట నష్టం మహిళ రైతు ఆవేదన.

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T121410.690-1.wav?_=4

 

వర్ష బీభత్సం తీవ్ర పంట నష్టం మహిళ రైతు ఆవేదన.

చిట్యాల, నేటిధాత్రి : 

 

 

చిట్యాల మండలం ముచినిపర్తి గ్రామానికి చెందిన మూల లక్ష్మి అనే మహిళ రైతు మూడెకరాల్లో పత్తి చేను వేయగా గత నాలుగు రోజుల నుండి కురుస్తున్న వర్షానికి చేన్లోకి నీరు రావడంతో మూడు ఎకరాల పంట పూర్తిగా నీట మునిగింది
ప్రైవేట్ బ్యాంకుల్లో అప్పులు తీసుకొచ్చి పంట పెట్టుబడి పెడితే ప్రకృతి వైపరీత్యానికి రైతు పలవుతున్నాడని మహిళా రైతు ఆవేద వ్యక్తం చేసింది దీనికి తోడు చేను పక్కన ఉన్న మరో రైతు కట్టలాగా మట్టితో నింపడంతో చేనులో ఉన్న నీరు బయటకు పోకుండా అందులోనే నిలిచి పంట పూర్తిగా మాడిపోయింది ప్రకృతి చేసిన వైపరీత్యానికి రైతుకు ఆత్మహత్య శరణ్యంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో మహిళలకు ముందు వరుసలో ప్రాధాన్యమిస్తున్న వ్యవసాయ రంగంలో నష్టపోతున్న మహిళా రైతుకు సాయం అందించి ఆదుకోవాలని పలువురు వేడుతున్నారు.

మా గోడు పట్టించుకోండి

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T114900.451.wav?_=5

మా గోడు పట్టించుకోండి

3,17 వార్డులో రోడ్డు లేక ఇబ్బంది.

ప్రభుత్వాలు మారినా మా దుర్భరమైన పరిస్థితి మారలేదు.

మాకు రోడ్డు రాలేదని బాధని వ్యక్తం చేసిన బస్తివాసులు.

 

 

బెల్లంపల్లి నేటిధాత్రి :

బెల్లంపల్లి నియోజకవర్గం
బెల్లంపల్లి లో గల అంబేద్కర్ నగర్ వార్డ్ నెంబర్ 3,17 లో సీసీ రోడ్ లేక ఇబ్బంది పడుతున్న బస్తీ వాసులు ఎవరైనా మా బస్తీలోకి రావాలంటేనే ఎక్కడ గుంత ఉంటుందో అర్థం కాక భయపడుతున్నారు గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పెద్ద

 

 

పెద్ద గుంతలు పడి మరి అధ్వానంగా మారిన రోడ్డు ఇకనైనా ప్రజా ప్రతినిధులు రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు బెల్లంపల్లి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి మా యొక్క బస్తీలోని బురద నుండి మాకు విముక్తి కల్పించండి అని ప్రజలు వారి బాధను వ్యక్తం చేశారు.

వరదల దృష్యా నర్సంపేట డివిజన్ లో కలెక్టర్ పర్యటన.

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-16T165113.038.wav?_=6

వరదల దృష్యా నర్సంపేట డివిజన్ లో కలెక్టర్ పర్యటన.

అధికారులతో కలిసి వాగులు,లో లెవల్ కాజ్ వేలు,వరద ఉధృతిని పరిశీలన

భారీ వర్షాల దృష్ట్యా అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు,వరదల దృష్యా నర్సంపేట డివిజన్ లో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పర్యటించారు.
వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు.
శనివారం కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత శాఖల అధికారులతో కలసి నర్సంపేట డివిజన్లోని ఖానాపూర్ మండలంలోని అశోక్ నగర్ పాకాల చెరువు నుండి వచ్చే వరద నీటిలో లెవల్ కాజ్ వే ను,నల్లబెల్లి మండలంలోని లేంకాలపెల్లి నందిగామ గ్రామాల మధ్య కాజ్ వే,నర్సంపేట నుండి చెన్నారావుపేట వెళ్లే రహాదారిలో ముగ్దుంపుర వద్ద, నర్సంపేటలోని మాదన్నపేట వద్ద కాజ్ వేలను పరిశీలించారు. కాజ్ వే ల వద్ద ఏర్పాటుచేసిన బారికేడ్లను పరిశీలించి సమర్ధ నిర్వహణకు అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించి రెడ్ అలర్ట్ గా మారే సూచనలు ఉన్న నేపథ్యంలో అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.భారీ వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెరువులలో నీటిమట్టం ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన మేరకు చర్యలు తీసుకోవాలన్నారు.గ్రామాల్లో భారీ వర్షాలపై టామ్ టామ్ చేసి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులలో,లో లెవెల్ కాజ్ వేలపై వరదనీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలకు వెళ్లడానికి అనుమతించవద్దని పేర్కొన్నారు. చెరువులలో ప్రజలను చేపలు పట్టే వారిని రైతులను పశు కాపరులను సందర్శకులను అనుమతించవద్దని అన్నారు.ఇప్పటికే అన్ని శాఖల అధికారులు సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉన్నారని,విపత్కర పరిస్థితి ఎదురైతే ఎస్డిఆర్ఎఫ్, ఎన్డిఆర్ఎఫ్ బృందాలు జిల్లాల సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు కాలువల్ని దాటే ప్రయత్నం చేయకుండా ప్రజలకు సూచనలు చేయాలని కలెక్టర్ తెలిపారు.ఈ పర్యటనలో జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి, జిల్లా పరిషత్ సీఈఓ రామిరెడ్డి,ఆర్డిఓ ఉమారాణి డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు , జిల్లా పంచాయతీ అధికారి కల్పన, తాహసిల్దారులు రవిచంద్రారెడ్డి, ఎంపీడీవోలు,పోలీసు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న వాగులు వంకలు.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-29-5.wav?_=7

భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న వాగులు వంకలు.

పరవళ్ళు తొక్కుతున్న పాకాల సరస్సు,మాదన్నపేట చెరువు మత్తడి నీరు..

అశోక్ నగర్ వద్ద ఉగ్రరూపం దాల్చిన పాకాల వరదనీరు..

వట్టేవాగు వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న మాదన్నపేట చెరువు అలుగు వరద*

కాకతీయ నగర్ కాలనీ వాసుల్లో మొదలైన ఆందోళన.

నర్సంపేట నుండి మాదన్నపేట,,నర్సంపేట నుండి పాకాల కొత్తగూడ రాకపోకలు బంద్.

ప్రమాదాలు జరుగకుండా పోలీస్ శాఖ అధికారులు బందోబస్తు..రెవెన్యూ మున్సిపల్ ,పంచాయితీ రాజ్ అధికారుల చర్యలు.

వరి పంటను దెబ్బతీస్తున్న భారీ వర్షాలు..

17,18 తేదీల్లో కురిసే భారీ వర్షాలతో రైతుల్లో అలజడి.

నర్సంపేట,నేటిధాత్రి:

గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నర్సంపేట డివిజన్ పరిధిలోని సరస్సు,చెరువులు,కుంటులు మత్తల్లు పోస్తున్నాయి.ఆసియా ఖండంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు పాకాల గత రెండు రోజులుగా అలుగుపోస్తున్న ది.సరస్సులో 31 ఫీట్ల పైబడి వరదనీరు చేరడంతో ఓక ఫీట్ ఎత్తుగా మత్తడి పరవళ్ళు తొక్కుతున్నది.నర్సంపేట మాదన్నపేట చెరువు గత ఐదు రోజులుగా మత్తడి పోస్తూ నేడు వరద ఉదృతం పెరుగుతున్నది.శుక్రవారం అర్థరాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి డివిజన్ పరిధిలోని చెరువులు,కుంటలు,వాగులు,వంకలు వరద నీటితో పారుతున్నాయి.నర్సంపేట నుండి పాకాల మీదుగా కొత్తగూడ వెళ్లే ప్రధాన రహదారిపై అశోక్ నగర్ వద్ద ఉన్న పాకాల నీటి ప్రవాహం తీవ్రస్థాయిలో పరవళ్ళు తొక్కుతుంది.

అటువైపు రాకపోకలు పూర్తిస్థాయిలో బంద్ అయ్యాయి.వాగువద్ద ఎలాంటి ప్రాణనష్టం జరుగకుండా ఖానాపూర్ పోలీస్ అధికారులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.మాదన్నపేట రోడ్డు వాగు వద్ద వరద నీటి ప్రవాహం ఉదృతం కావడంతో మున్సిపల్,పోలీస్ ,రెవెన్యూ శాఖల అధికారులు బందోబస్తు చర్యలు చేపట్టారు.మాదన్నపేట చెరువు ఉగ్రరూపం దాల్చి మత్తడి పడితే చాలు..నర్సంపేట పట్టణంలో ఎన్టీఆర్ నగర్ కాలని వాసుల్లో గుబులు పుట్టిస్తోంది.నర్సంపేట నుండి నేక్కొండ వైపు ముగ్దుంపురం కాజ్ వే వద్ద వరద భీభత్సం పెరుగడంతో అటువైపు వెళ్లే వాహనాలను చెన్నారావుపేట పోలీసులు,అధికారులు ఎక్కడికక్కడ నిలిపివేశారు.నల్లబెల్లి మండలం నుండి నందిగామ వైపు వెళ్లే ప్రధాన రహదారి లెంకాలపల్లి నందిగామ గ్రామాల మధ్య ఉన్న లో లెవర్ కాజ్ వే పై వరద నీటితో భయంకరంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.ప్రమాదాలు జరుగకుండా నల్లబెల్లి ఎస్సై,రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో తగిన చర్యలు చేపట్టారు.దుగ్గొండి,నల్లబెల్లి,నర్సంపేట,ఖానాపూర్,చెన్నారావుపేట, నెక్కొండ మండలాల పరిధిలోని చెరువులు,కుంటలు నిండి మత్తళ్ళు పోస్తున్నాయి.దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.కొన్ని చోట్ల వాగుల వద్ద చేపలవేట చేస్తున్నారు.అనుకోకుండా ప్రమాదాలు
జరగవచ్చని అధికారులు హెచ్చరించినప్పటికి అవేవీ పట్టించుకోవడం లేదు.

Ashok Nagar

17,18 తేదీల్లో కురిసే భారీ వర్షాలతో రైతుల్లో అలజడి.

గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు డివిజన్ వ్యాప్తంగా చెరువులు,కుంటలు నిండు కుంటల్లా మారి శుక్రవారం అర్థరాత్రి కురిసిన భారీ వానకు అతలాకుతలం అయ్యింది.17,18 తేదీల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రకటించారు.ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.దీంతో ఇప్పటికే చెరువులు,కుంటలు వాగులు నిండి భారీ ఎత్తున వరద భీభత్సం సృష్టించింది.ఐతే 17,18 తేదీల్లో అతి భారీ వర్షాలు కురిస్తే పంటల పరిస్థితి ఎలా అని రైతులు ఆందోళన చెందుతున్నారు.

వరి పంటను దెబ్బతీస్తున్న భారీ వర్షాలు..

*ఋతుపవనాలు ముందుగానే వచ్చినట్లు వచ్చి వెనక్కివెళ్లడంతో సుమారు 20 నుండి నెల రోజుల ఆలస్యంగా రైతులు వరినాట్లు సాగుచేసుకున్నారు.వరినాట్లు జోరందుకుంటున్న నేపథ్యంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు,కుంటలు నిండడం వరదలకు వరినాట్లు నీట మునుగడం,కొట్టుకుపోయే పరిస్థితులు నెలకొన్నాయి.మరిన్ని రోజులు వర్షాలు కురిస్తే పంటలకు నష్టాలు వాటిల్లే అవకాశం ఉన్నాయని పలువురు రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

నీటి ప్రవాహం వద్ద పోలీస్ అధికారుల సేవలు భేష్..

*నర్సంపేట డివిజన్ పరిధిలోని కురుస్తున్న భారీ వర్షాలకు ప్రవహిస్తున్న వరద నీటి వద్ద ప్రమాదాలు జరుగకుండా రేయింబవళ్లు పహారా కాస్తున్న పోలీస్ అధికారుల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈలాంటి సేవలు అందించడంలో నర్సంపేట డివిజన్ పోలీసులు ముందుంటారని ప్రజలు పేర్కొన్నారు.

మొరంచపల్లి వాగు ఉదృతిని ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-46-2.wav?_=8

మొరంచపల్లి వాగు ఉదృతిని ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లా కలెక్టర్

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శనివారం మొరంచపల్లి వాగు ఉదృతిని ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాగు ఉదృతి దృష్ట్యా ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు తలెత్తినపుడు తక్షణమే స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖలకు ఆదేశించారు. ఎగువ భాగం నుండి ఎంత వరద వచ్చే అవకాశం ఉందన్న వివరాలు ఈ ఈ ప్రసాదు ను అడిగి తెలుసుకున్నారు. జాగ్రత్తగా ఉండాలని వరద పరిస్థితిని ముందుగా అంచనా వేసి ప్రజలను ముందస్తు అప్రమత్తం చేయాలని సూచించారు.
వాతావరణ శాఖ సూచన మేరకు
జిల్లాకు ఆదివారం వరకు
రెడ్ అలెర్ట్ జారీ చేసిన నేపథ్యంలో యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సిబ్బంది కార్యస్థానాల్లో అందుబాటులో ఉండి రక్షణ చర్యలు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
భారీ వర్షాలు దృష్ట్యా ప్రజల, పశువుల ప్రాణరక్షణలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముంపు ప్రాంతాలను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర సేవలకు ప్రజలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 24 గంటలు పనిచేసే విధంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ కు కాల్ చేయాలని సూచించారు.
90306 32608 ద్వారా వచ్చిన ఫిర్యాదులకు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పశువులను మేతకు బయటికి పంపకుండా ఇంటి పట్టునే ఎత్తైన ప్రదేశంలో ఉంచాలని తెలిపారు.
రహదారులపై నీళ్లు చేరిన ప్రాంతాల్లో ప్రజలు ప్రయాణాలు చేయకుండా పటిష్ట నియంత్రణ చేయాలని తెలిపారు. కొంతమంది. అత్యుత్సాహంతో ఎవరైనా దాటే ప్రయత్నం చేసే అవకాశం ఉన్నందున రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్ సిబ్బంది పటిష్ట పర్యవేక్షణలో బారికేడ్లు ఏర్పాటు చేసి రవాణా నియంత్రణకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఈఈ ప్రసాద్, డిఈ వరుణ్, ఏఈ షర్ఫ్ఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-24-4.wav?_=9

భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
టిపిసిసి డెలిగేడ్ కల్వకుంట్ల సుజిత్ రావు

మెట్ పల్లి ఆగస్టు 16 నేటి ధాత్రి
ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రాకూడదని ప్రమాదాలకు గురి కాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని టీపీసీసీ డెలిగేట్ మెంబర్ కల్వకుంట్ల సుజీత్ రావు కోరారు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకు పలు సూచనలు చేశారు. 2రోజులపాటు భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారని, అందువల్ల ప్రజలు భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రజలు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని,పట్టణంతో పాటు పలు మండలాలు, గ్రామాల ప్రజలు వరద ప్రవాహం ఉన్న వంతెనలు, కల్వర్ట్, రహదారులపై నుండి దాటవద్దని, శిధిల వ్యవస్థలో ఉన్న ఇండ్లలో నివాసం ఉండవద్దని, తడిగా ఉన్న కరెంట్ పోల్స్, ట్రాన్సఫర్స్ తాకవద్దని, శివారు ప్రాంతాల్లో చేపల వేటకు ఎవరు వెళ్ళొద్దని సూచించారు. అదే విధంగా రైతులు కరెంటు బావుల దగ్గరికి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, వరద నీరు వెళ్లే నాలాలు, మ్యాన్ హోల్స్ సమీపంలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు. విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడే ప్రమాదాలు గతంలో చూశామని, కావున ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. వర్షాలు, వరదల వల్ల సహాయక చర్యలు చేపట్టేందుకు స్థానిక అధికారులు సిద్ధంగా ఉన్నారని, కానీ అన్నిటి కన్నా ముఖ్యంగా ఎవరికివారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అత్యవసరమైతే, ఏదైనా సంఘటన జరిగితే స్థానిక అధికారులకు సమాచారం అందించి సహాయక చర్యలు పొందాలని కోరారు ప్రభుత్వం సంబంధిత కార్యాలయాలలో అధికారులను అప్రమత్తం చేసిందని ఏదైనా అత్యవసరం అయితే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

భారీవర్షాల వల్ల ఆస్తి,ప్రాణనష్టం జరగకుండా చూసుకోవాలి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-18-5.wav?_=10

భారీవర్షాల వల్ల ఆస్తి,ప్రాణనష్టం జరగకుండా చూసుకోవాలి

భారీ వర్షాల పట్ల జాగ్రత్త చర్యలు చేపట్టాలి

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద.

అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కలెక్టర్

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట, నేటిధాత్రి:

ఈనెల 17, 18 తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వర్షాల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా శిథిలావస్థలో ఉన్న గృహాలు, పాఠశాలలను గుర్తించి అందులో ఉండే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.రాబోయే రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అన్నారు.జిల్లా సంబంధిత వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాల వల్ల నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, పలు పథకాల క్రింద చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే విధంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాలో ప్రమాదకర పరిస్థితులు లేనప్పటికిని , వాగులు, వంకలు ప్రాంతాలలో ప్రమాదాలు జరగకుండా రోడ్డు మార్గాలను డైవర్ట్ చేయాలన్నారు.ఇందుకు గాను పోలీసు, గ్రామ కార్యదర్శుల సహకారం తీసుకోవాలని సూచించారు.తీవ్ర వర్షాల వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలి.లోతట్టు బ్ప్రాంతాల్లో జలమయం కు ముందస్తుగా నివారణ చర్యలు చేపట్టాలి. డ్రైనేజీ వ్యవస్థ మరమ్మత్తులు, వరద నీరు నిలిచిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అని అధికారులను ఆదేశించారు.ప్రత్యేకంగా డ్యామ్‌లు, చెరువుల స్థితిగతులు నిరంతరం పరిశీలించాలని,ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు.

“Precautions for Heavy Rains in Warangal”

కొన్ని ప్రాంతాలలో వర్షాల వల్ల తెగిపోయిన రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలన్నారు.ఈనెల 17, 18 తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, మండల స్థాయి టీంలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అధికారులు సెలవులో వెళ్లకుండా హెడ్ క్వార్టర్స్ లోనే ఉంటూ వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.వర్షాల వల్ల నీరు కలుషితమై దోమలు ప్రబలి సీజనల్ వ్యాధులు డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, వైరల్ ఫీవర్ లాంటి వ్యాధుల పట్ల జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి,జెడ్పి సీఈఓ రామిరెడ్డి,ఇరిగేషన్ శాఖ ఈఈలు శంకర్,సునీత,జిల్లా ఆర్ అండ్ బి అధికారి,జిల్లా పంచాయతీ అధికారి కల్పన,జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ,ఆర్డీఓ లు సత్యపాల్ రెడ్డి,ఉమారరాణి,తహసీల్దార్లు వివిధ శాఖల అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త పడాలి…

నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త పడాలి
వరంగల్ ప్రాంతీయ కేంద్ర పరిశోధన శాస్త్రవేత్తలు

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంటలు సాగు చేస్తున్న రైతులు పంట చేలలో వర్షపు నీటి నిలువలు లేకుండా జాగ్రత్త పడాలని వరంగల్ ప్రాంతీయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ వీరన్న డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ రమ్య, మొగుళ్లపల్లి మండల వ్యవసాయ అధికారి పి సురేందర్ రెడ్డిలు సూచించారు. మొగుళ్ళపల్లి మండలంలో ఇటీవల ఏకధాటిగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గురువారం స్థానిక మండల వ్యవసాయ అధికారి పి సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ ప్రాంతీయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ వీరన్న, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ రమ్యతో కలిసి మొగుళ్ళపల్లి మండలంలో పత్తి, వరి, మొక్కజొన్న పంటలను పరిశీలించారు. అనంతరం శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు మండలంలో సాగు చేస్తున్న పత్తి ,వరి, మొక్కజొన్న పంటల వద్ద ఉన్న రైతులతో సమావేశమై పలు సూచనలు చేశారు. ముఖ్యంగా వర్షాకాలంలో కురుస్తున్న అతి భారీ వర్షాలకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల పలు సూచనలు అందించారు. పత్తి పంటలో ప్రస్తుతం కురుస్తున్న వర్షపు నీటిని చేనులో నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు బయటకు తీసివేయాలని, పత్తి పంట అధిక వర్షాలకు గురైనప్పుడు ప్రతి మొక్క పెరుగుదలకై 19:19:19 పాలిఫీడ్ లేదా 13:0:45 మల్టీకే పోషకాలను లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవాలని, వర్షాలు తగ్గిన తర్వాత ఎకరాకు 25 కిలోల యూరియాతో పాటు 20 కిలోల మెరువట పోటాష్ ఎరువులను భూమిలో మొక్కకి 4 అంగుళాల దూరంలో మొదల దగ్గర వేసుకోవాలని, అలాగే పత్తి చేనులో గుంపులు గుంపులుగా మొక్కలు ఎండిపోవడం లేదా వాలిపోవడం గమనించినట్లయితే వేరు కుళ్ళు లేదా భావించి మొక్కలు మొదల చుట్టూ వేరు బాగా తడిచేటట్లు లీటర్ నీటికి మూడు గ్రాముల కాపర్ ఆక్సి క్లోరైడ్ మందును పోసుకోవాలని, పత్తి చేనులో అధికత్తమ ఉన్నప్పుడు ఎకరాకు 10 కిలోల ఏరియాతో పాటుగా 400 నుండి 5 గ్రాముల కార్బన్దజిం + మాన్కోజేబ్ కలుపుకొని మొక్క మొదల దగ్గర వేసుకుంటే పార విల్ట్ ను తగ్గించుకోవచ్చునని శాస్త్రవేత్తలు అన్నారు. ప్రస్తుతం వాతావరణంలో గాలి అధిక తేమతో ఉన్నందున పత్తిలో ఆల్టర్నేరియా ఆకుమచ్చ, అసికోకైట బ్లైట్ వచ్చే అవకాశం ఉంది, కావున మల్టీకే లాంటి పోషకాలతో పాటుగా క్యాప్తన్+ హెక్సకోనజోల్ 1.5 గ్రాములు లేదా ప్రోపీకొనుజోల్ 1 మిల్లీలీటర్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే నివారించవచ్చునని శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. అలాగే వరి పంటలో ఒకవేళ వరి నారు ముదిరినట్లయితే రైతు సోదరులు తప్పకుండా కొనలు తుంచి నాటు వేసుకోవాలి. దీని ద్వారా కాండం తొలచు పురుగు గుడ్లను నిర్మూలించుకోవచ్చన్నారు. నాటు వేసిన 20-25 రోజుల తర్వాత ఎకరానికి 8 నుండి 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3జి గుళికలు తప్పకుండా వేసుకోవాలి తద్వారా కాండం తొలుచు పురుగును నిర్మూలించవచ్చన్నారు. కావున రైతు సోదరులు పైన సూచించిన సూచనలు పాటించి అధిక దిగుబడులు పొందాలని శాస్త్రవేత్తలు పలు గ్రామాల రైతులకు సూచించారు. అలాగే పత్తి పంటలో నీరు నిలబడి మొక్కలు వదలిపోయిన చోట కాపర్ ఆక్సి క్లోరైడ్ 30 గ్రాములు, మరియు ప్లాంటమైసిన్ ఒక గ్రామ్, 10 లీటర్ల నీటితో కలిపి మొక్కల మొదలు దగ్గర పోయాలని, అదేవిధంగా రసం పీల్చే పురుగు ఉధృతి ఉన్నచోట ఇమిడాక్లోఫ్రైడ్ 2.5 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయాలని, గులాబీ రంగు పురుగు ఉధృతి గమనించడం కోసం లింగాకర్షక బట్టలు పెట్టుకోవాలని, అదేవిధంగా మొక్కజొన్నలో మువ్వు పురుగు ఉన్నచోట ఇమమెక్టిన్ బెంజోట్ నాలుగు మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయాలన్నారు. పెసర పంటలో క్లోరాంత్రిని రోల్ 60 గ్రాములు ఒక ఎకరానికి స్ప్రే చేయాలని, వరి పంటలో నీరు తీసివేసి 35 కిలోల యూరియా, 15 కిలోల పోటాష్ వారం రోజుల్లో రెండు దాఫాలుగా వేసుకోవాలని, అదేవిధంగా వరిలో తుంగ నివారణ కోసం florpyrauxifen benzyle+సైహలొఫోప్ butyl, 500 మిల్లీలీటర్ ఒక ఎకరానికి స్ప్రే చేయాలని రైతులకు తెలపడం జరిగిందన్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూం ఏర్పాటు..

భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూం ఏర్పాటు
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

24/7అందుబాటులో..వివిధ శాఖల అధికారులు

వరద, వర్షం ప్రభావిత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు

కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1800 233 1495

కంట్రోల్ రూమ్ వాట్సాప్ సెల్ నెంబర్ 9398684240

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో సంబంధిత అన్ని శాఖలను అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలలో లో లెవెల్ కాజ్ వే ల వద్ద అప్రమత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.రెవెన్యూ, పోలీస్, విద్యుత్, వ్యవసాయ, హెల్త్, పి.ఆర్, మిషన్ భగీరథ ఇతర శాఖల అధికారులు కంట్రోల్ రూంలో సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఈ నెల 13 వ తేదీ నుంచి 16 వ తేదీ వరకు అధికారులు అందుబాటులో ఉండి, వర్షాలు, వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు తగిన సమాచారం అందిస్తారు. సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని, వరద ప్రభావిత ప్రజలకు సహాయం చేసేలా సేవలు అందిస్తారు. 24 గంటలు ఆయా శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే కంట్రోల్ రూమ్ నెంబర్లు టోల్ ఫ్రీ నెంబర్ 1800 233 1495, వాట్సాప్ సెల్ నెంబర్ 9398684240 లను వర్షం, వరద ప్రభావిత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రజలకు సూచించారు. జిల్లా, మండల స్థాయి అధికారులు తమ, తమ కార్యాలయాల్లో, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. వర్షాల కారణంగా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రా వద్దని ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

రాబోయే మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలి’

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-13T120744.487.wav?_=11

 

రాబోయే మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలి’

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి: న్యాల్కల్ మండల ప్రజలు రాబోయే మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సుజిత్ కుమార్ సూచించారు.

అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు పొంగే అవకాశం ఉందని, ఎవరూ చేపల వేటకు వెళ్లవద్దని తెలిపారు. ఏవైనా సమస్యలు ఎదురైతే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను సూచించారు.

నిండు కుండల మారిన నారింజ ప్రాజెక్టు ను పర్శిలించిన ఎమ్మెల్యే మాణిక్ రావు…

 

నిండు కుండల మారిన నారింజ ప్రాజెక్టు ను పర్శిలించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు కారణంగా నిండు కుండల మారిన నారింజ ప్రాజెక్టు ను పర్శిలించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు సందర్శించి ,నీటి ప్రవాహాన్ని , కెపాసిటీ నీటి విడుదల & ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా తీసుకుంటన చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు ,అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.ఎమ్మెల్యే గారితో పాటు గా మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మొహియుద్దీన్, మాజి కౌన్సిలర్ అబ్దుల్లా,యువ నాయకులు ముర్తుజా,దీపక్ తదితరులు పాల్గొన్నారు

ప్రజలకు ఝరాసంగం ఎస్సై కీలక సూచనలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-13T115407.332.wav?_=12

ప్రజలకు ఝరాసంగం ఎస్సై కీలక సూచనలు.

◆:- రాబోయే మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం మండలంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై క్రాంతి కుమార్ పటేల్ సూచించారు. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నందున, ప్రజలు గ్రామాల్లోనే ఉండి, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని ఆయన తెలిపారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలని, విద్యుత్ షాక్ ప్రమాదాల పట్ల జాగ్రత్త వహించాలని, పశువులను కూడా వాటికి దూరంగా ఉంచాలని ఆయన సూచించారు. కరెంట్ స్తంభాలు, ట్రాన్స్ఫారం వద్దా పశువులను ఉండొద్దని కూడా ఆయన పేర్కొన్నారు.

ఎమర్జెన్సీ ప్లాన్లో భాగంగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-12T141549.362.wav?_=13


ఎమర్జెన్సీ ప్లాన్లో భాగంగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు

ఆపత్కాలంలో బల్దియా టోల్ ఫ్రీ నెంబర్ నెంబర్కు సమాచారం ఇవ్వాలన్న మున్సిపల్ కమిషనర్.

బల్దియా కమిషనర్తో కలిసి వరంగల్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలను సందర్శించిన వరంగల్ కలెక్టర్.

వరంగల్, నేటిధాత్రి

భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద అన్నారు. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు జలమయమైన వరంగల్ నగరంలోని పలు ప్రాంతాలలో బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి క్షేత్ర స్థాయిలో సందర్శించి సమర్థవంతంగా చర్యలు చేపట్టుటకు అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పరిధి లోని నాలుగు మండలాలలైనా వరంగల్, సంగెం, ఖిలా వరంగల్, వర్ధన్నపేటలలో అత్యధిక వర్షపాతం నమోదు కావడం జరిగిందని అత్యధికంగా సంగెం మండలంలో 24 సెంటీమీటర్ల వర్షపాతం,

ఖిలా వరంగల్ మండలం లో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగిందని, జలమయమైన లోతట్టు ప్రాంతాలైన సాయి గణేష్ కాలనీ, గాంధీ నగర్, డి కే నగర్, లెనిన్ నగర్, అగర్తల చెరువు ప్రాంతం, మైసయ్య నగర్, గిరి ప్రసాద్ కాలనీ, పద్మ నగర్, శాకారాశికుంట తదితర ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో సందర్శించడం జరిగిందని, వర్షపు నీరు బయటకు వెళ్లే స్ట్రాం వాటర్ డ్రైన్ లు ఇరుకుగా ఉండడం వల్ల నీటి ప్రవాహంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ఖిలావరంగల్ నుండి వరంగల్ వరకు జీడబ్ల్యూఎంసి తరపున అట్టి నాలాను విస్తరించడానికి పనులు కొనసాగుతున్నాయని, లోతట్టు ప్రాంతాలలో ఎమర్జెన్సీ ప్లాన్ కింద చర్యలు చేపట్టడం జరుగుతుందని మంగళవారం రాత్రి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని, వాతావరణ శాఖ ఆదేశాల మేరకు లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని, లోతట్టు ప్రాంతాలలో ఉండే ప్రజల కోసం ఆహారంతో పాటు, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మందులు అందుబాటులో ఉంచడం జరిగిందని, ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో పిల్లలను పాఠశాలకు పంపించవద్దని, ముఖ్యంగా భారీ వర్షాలు కురిసే క్రమంలో ప్రాణహాని ఉంటుందని, కావున పిల్లలను చెరువుల్లో చేపల వేటకు వెళ్లకుండా తల్లిదండ్రులు నియంత్రించాలని, విద్యుత్ సంబంధ వస్తువులను తాకకుండా ఉండాలని, వర్షాలు కురిసే క్రమంలో ఎర్తింగ్ వచ్చే అవకాశం ఉంటుందని, భారీగా నీరు నిలిచి ఉండే లోతట్టు ప్రాంతాలకు విద్యుత్తు నిలిపివేయడం జరిగిందని, ఒకరోజు పునరవస కేంద్రాలలో ఆవాసం పొందడం వల్ల కలిగే నష్టం ఏమీ లేదని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ వారు అందజేసిన సాటిలైట్ ఇమేజ్ లో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని సమాచారం అందిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అన్నారు.

బల్దియా కమిషనర్ మాట్లాడుతూ….

జీడబ్ల్యూఎంసి తరపున డిఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయని ప్రతి వార్డులో జవాన్తో పాటు ప్రత్యేక మాన్ సూన్ బృందాలు అందుబాటులో ఉన్నాయని అంతే కాకుండా ఇంజనీరింగ్ బృందాలు కూడా క్షేత్ర స్థాయిలో సంసిద్ధంగా ఉన్నారని వర్షపు నీటిని వేగవంతంగా బయటకు పంపించడానికి కచ్చా కాలువల ద్వారా పంపించడం జరుగుతుందని, శాశ్వత పరిష్కారం కోసం నాలాను

విస్తరించడంతో పాటు డ్రైన్ ఆక్రమణలను తొలగించడం జరుగుతుందని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సమీప ప్రాంతాల్లో ఉన్న పునరావాస కేంద్రాల్లోకి వెళ్లాలని ప్రస్తుతం 6 పునరావాస కేంద్రాలు ఎస్ ఆర్ నగర్ లో శుభం గార్డెన్, గాంధీ నగర్, మైసయ్యనగర్ కమ్యూనిటీ హాల్లో, డి కే నగర్లో బీరన్నకుంట హై స్కూల్ , గిరి ప్రసాద్ నగర్లోని కమ్యూనిటీ హాల్, ఏం ఎన్ నగర్ లోని మార్వాడీ హాల్లలోను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రస్తుతం ఆయా కేంద్రాలలో ప్రజలు ఆవాసం పొందుతున్నారని ఉదయం సుమారు 1300 మందికి అల్పాహారం అందజేయడం జరిగిందని లంచ్ తో పాటు డిన్నర్ కూడా అందజేస్తామని ప్రజల అవసరాల కోసం వరంగల్, హన్మకొండ కలెక్టరేట్ లతో పాటు బల్దియా ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్ : 18004251980, మొబైల్ నంబర్:

9701999676 అందుబాటు లోకి తెచ్చామని, ప్రజలు ఈ నంబర్లలో సంప్రదించాలని జీడబ్ల్యుఎంసి తరఫున 2 డిఆర్ఎఫ్ బృందాలు 24×7 మూడు షిఫ్టులలో పనిచేస్తున్నాయని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిఏంహెచ్ఓ సాంబశివరావు ఆర్డిఓ సత్యపాల్ రెడ్డి, సిఏంహెచ్ఓ డా.రాజారెడ్డి, డి ఎఫ్ ఓ శ్రీధర్ రెడ్డి, ఏం హెచ్ ఓ డా.రాజేష్ ఇంచార్జి ఈ ఈ సంతోష్ బాబు, వరంగల్, ఖిలా వరంగల్ తహసీల్దార్ లు మహమ్మద్ ఇక్బాల్, నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సిఐ నరేష్ కుమార్

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సిఐ నరేష్ కుమార్
https://youtu.be/XsqTcVL4mKo
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి పట్టణం  పరిసర మండల ప్రాంతాలలో గత రెండు  రోజులుగా అధిక వర్షపాతం నమోదవుతున్నది. ఈ కారణంగా పిడుగులు పడే అవకాశం  రహదారులపై వరద నీటి ముప్పు ఏర్పడే అవకాశం ఉన్నందున, ప్రజల ప్రాణ, ఆస్తి భద్రత దృష్ట్యా ఈ క్రింది జాగ్రత్తలు పాటించాలని భూపాలపల్లి పట్టణ సిఐ నరేష్ కుమార్ప్రజలకు సూచించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
చెట్ల కింద, ఎలక్ట్రిక్ పోల్స్ లేదా విద్యుత్ తీగల సమీపంలో నిలబడవద్దు.2. అత్యవసర పనులు తప్ప రోడ్లపైకి రావద్దు.3. వరద నీరు ప్రవహిస్తున్న ప్రదేశాలలో ప్రయాణించవద్దు, ప్రత్యేకించి లోతైన కాలువలు, వంతెనలు, బండ్లు వద్ద జాగ్రత్తగా ఉండాలి.4. వాహనదారులు రహదారులు జారుడు మయం కావచ్చునని గుర్తుంచుకుని మితమైన వేగంతో ప్రయాణించాలి.5. ఏవైనా ప్రమాద సూచనలు గమనించిన వెంటనే పోలీసు స్టేషన్ 8712658142, 8712658110, 8712658120, 8712658121 నంబర్‌లకు సమాచారం అందించాలి
ప్రజల భద్రత మా ప్రాధాన్యం. సహకరించి, భద్రంగా ఉండండి అని భూపాలపల్లి సీఐ నరేష్ కుమార్ సూచించారు

భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

సీజనల్ వ్యాధులు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి వర్ధన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ

వర్దన్నపేట (నేటిధాత్రి ):

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు వర్ధన్నపేట మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.చిన్న పిల్లలను బయటకు వెళ్లకుండా చూడాలి. రైతులు వ్యవసాయ పనులు చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలి. లోతట్టు ప్రాంతాలు, శిథిలావస్థ ఇళ్లలోని వారిని సురక్షిత ప్రాంతాలకుగానీ, పునరా వాస కేంద్రాలకుగానీ అధికారులు తరలించి వారికి భోజన సదుపాయం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇళ్ళ నుండి బయటకు రావొద్దు. సీజనల్ వ్యాధులు రాకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు ఎద్దు సత్యనారాయణ వర్ధన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు

భారీ వర్షాలు.. 18 మంది మృతి

భారీ వర్షాలు.. 18 మంది మృతి

 

 

 

shine junior college

 

మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ వాతావరణ శాఖ జారీ చేసింది.

 

ముంబై, జూన్ 17: మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటి కారణంగా 18 మంది మృ‌తి చెందారు. 65 మంది గాయపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. భారీ వర్షాలు, రోడ్డు ప్రమాదాలు, పిడుగుపాటు, నీట మనిగి పోవడం కారణాల వల్ల ఈ మృతులు సంభవించాయని వివరించింది. రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని.. ఈ నేపథ్యంలో గత 24 గంటలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పింది.

 

రాజధాని ముంబై మహానగరంతోపాటు ముంబై శివారు ప్రాంతం, రత్నగిరి, సిందుదుర్గ్, రాయ్‌గఢ్ తదితర జిల్లాల్లో భారీగా వర్షం కురిసిందని తెలిపింది. మరోవైపు పశ్చిమ మహారాష్ట్రలోని అరంజ్ అలర్ట్‌ జారీ చేసినట్లు పేర్కొంది. అలాగే పుణె, కోల్హపూర్, సతారాతోపాటు రాయ్‌గఢ్ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. జూన్ 15 నుంచి 18వ తేదీ వరకు మహారాష్ట్రకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక సహాయక చర్యలు కొనసాగుతోన్నాయి. అలాగే లోతట్టు ప్రాంతాల్లో.. నీట ముంపునకు గురైన వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇంకోవైపు భారీ వర్షాల కారణంగా ముంబై మహానగరంలో రహదారులపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

 

 

ఇక నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో 24 గంటల్లో గుజరాత్, విదర్భా, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో విస్తరించనున్నాయని తెలిపింది. అలాగే పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బిహార్, తూర్పు ఉత్తరప్రదేశ్‌లో మరో మూడు రోజుల్లో ఇవి విస్తరిస్తాయని పేర్కొంది. అయితే ఈ మరణాలు జూన్ 1వ తేదీ నుంచి నేటి వరకు చోటు చేసుకున్నవని వివరించింది.

 

కేరళలో..

అదీకాక.. కేరళలో జూన్ 18 వరకు విస్తృతంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. దీంతో జిల్లా ఉన్నతాధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

 

న్యూఢిల్లీలో..

ఇక ఈ రోజు సాయంత్రం లేదా రాత్రికి దేశ రాజధాని న్యూఢిల్లీలో సైతం సాధారణ వర్షాలు లేకుంటే.. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని వివరించింది.

 

కర్ణాటకలో..

అలాగే కర్ణాటకలో సైతం భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది ఈ జూన్ మాసంలో సగటు కంటే 110 శాతం అధిక వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ విభాగం పేర్కొంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version