గణపురం రేగొండ సర్పంచ్ లు గ్రామాలల్లో ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టి పారదర్శక పరిపాలనతో గ్రామాభివృద్ధికి సేవ చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కొత్తగా ఏకగ్రీవమైన సర్పంచ్ లకు సూచించారు. గురువారం భూపాలపల్లిలోని ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను గణపురం మండలం బుద్దారం ఏకగ్రీవ సర్పంచ్ విడిదినేని శ్రీలత – అశోక్, పన్నెండు మంది ఏకగ్రీవ వార్డు సభ్యులు మరియు రేగొండ మండలం కొత్తపల్లి(బీ) గ్రామ ఏకగ్రీవ సర్పంచ్ బూతం రజిత – రమేష్ లు మర్యాదపూర్వకంగా పూల బొకేలు అందించి కలిశారు. అనంతరం ఎమ్మెల్యే సర్పంచ్ లకు శాలువాలు కప్పి, స్వీటు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ ప్రజల ఐక్యతతో, అభివృద్ధి లక్ష్యంతో ఏకగ్రీవంగా సర్పంచ్ లను ఎన్నుకోవడం సంతోషమన్నారు. ఈ నిర్ణయం గ్రామ సమగ్రాభివృద్ధికి బాటలు వేస్తుందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టి పారదర్శక పరిపాలనతో గ్రామాభివృద్ధికి సేవ చేయాలని సూచించారు. గ్రామాల్లో మౌలిక వసతులు, రహదారులు, తాగు నీరు, విద్యా, ఆరోగ్య రంగాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు మరింత సమర్థవంతంగా అందించేందుకు సర్పంచ్లు కీలక పాత్ర పోషించాలన్నారు. గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో అవసరమైన చోట (ఎమ్మెల్యే) పూర్తి సహకారం ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని రైతు వేదికలొ గురువారం రోజున కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి ఆధ్వర్యంలో చిట్యాల టేకుమట్ల మండలంలోని సిఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగాభూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పాల్గొనిపంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు మంత్రి సహాయ నిధి ఒక వరం లాంటిదని అన్నారు అలాగే పేద ప్రజలు ఎవరైనా ఎలాంటి పైరవీలకు తావు లేకుండ స్వచ్ఛందంగా అమలు చేస్తామన్నారు ఎవరికి ఏ ఆపద ఉన్న స్వచ్ఛందంగా వచ్చి చెప్పుకోవాలన్నారు, ఇది ప్రజా పాలన ప్రభుత్వమని కొనియాడారు, 18 గంటలు కష్టపడి పని చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ నియోజకవర్గ ప్రజల కోసమే అహర్నిశల కృషి చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి మాజీ జెడ్పిటిసి పులి తిరుపతిరెడ్డి,జిల్లా కాంగ్రెస్అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మధువంశీకృష్ణ, టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బుర లక్ష్మణ్ గౌడ్ , జిల్లా నాయకులు చిలుకల రాయకొమురు, వర్కింగ్ ప్రెసిడెంట్ మూలశంకర్ గౌడ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుల అల్లకొండ కుమార్ టేకుమట్ల చిట్యాల మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు లబ్ధిదారులు పాల్గొన్నారు.
హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామా ల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 10 ఏండ్లుగాఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సన్నధాన్యానికి రూపాయలు 500 బోనస్ ప్రకటించారని అన్నారు రైతుల పండించిన పంటను 17% తేమ మించ కుండా ప్రభుత్వం ద్వారా కేటా యించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాల న్నారు రైతులు ఆరుగాలం కష్టపడి శ్రమించి పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రజా ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగో లు కేంద్రాలకు తీసుకువచ్చి, ప్రభుత్వం నిర్ణయించిన గిట్టు బాటు ధరలు పొందాలని రైతులను ఎమ్మెల్యే కోరారు. రైతుల సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఎవరూ ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా జరపాలని సంబంధిత శాఖల అధికారు లకు ఎమ్మెల్యే సూచించారు.
లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
శాయంపేట మండల కేంద్రం లోని రైతు వేదికలో వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 62 మంది కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూ.62,07,192 విలువైన చెక్కులను ఎమ్మెల్యే అందజే శారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ పేద, నిరుపే ద కుటుంబాల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభు త్వం పెద్దపీట వేస్తూ సబ్బండ వర్గాల ప్రజలకు అండగా నిలు స్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నా రు. పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మీ పథకం ఆర్థికంగా ఎంతో తోడ్పాటును అందిస్తుం దని తెలిపారు. మహిళల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటు న్నట్లు ఎమ్మెల్యే చెప్పారు.
శాయంపేటమండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 16 మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారులకు రూ.5,70, 600 విలువైన చెక్కులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లా డుతూ సీఎం సహాయ నిధి ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఖరీదైన వైద్య చికిత్స చేసుకో లేక ఆర్ధిక ఇబ్బందులు పడు తున్న ఎన్నో కుటుంబాలకు ఈ ఫండ్ ఆసరాగా నిలుస్తుందని, బాధితులు అవసరమైన సమ యంలో సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినియోగం చేసుకోవాల న్నారు. అనంతరం రైతులకు మొక్కజొన్న సబ్సిడీ విత్తనా లను అందజేశారు. ఈ కార్యక్ర మాలల్లో కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా, మం డల స్థాయి అధికారులు, కాంగ్రెస్ నేతలు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జన్మదిన వేడుకలను నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్ అన్నారు అనంతరం అంబేద్కర్ సెంటర్లో కేక్ కట్ చేసి టపాసులు పేల్చి స్వీట్లు పంచి పెద్ద ఎత్తున సంబరాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్ద సంఖ్యలో హాజరైన అభిమానుల, కార్యకర్తల మధ్య ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జన్మదిన వేడుకలను జరుపకోవడం చాలా సంతోషం రానున్న రోజులలో మరిన్ని ఉన్నంతమైన పదవులు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని పిప్పాల రాజేందర్ అన్నారు ఈ కార్యక్రమంలో దాట్ల శ్రీనివాస్ మహేష్ రెడ్డి సంజన స్వామి పైడిపల్లి రమేష్ క్యాతరాజు సాంబమూర్తి పానుగంటి శీను అంబాల శ్రీనివాస్ మహిళా కాంగ్రెస్ నాయకులు మాలతి పద్మ పుష్ప యూత్ నాయకులు సురేష్ గణేష్ ప్రకాష్ తదితరులు పాల్గొనడం జరిగింది
భూపాలపల్లి మున్సిపాలిటీ 1వ వార్డు సెగ్గంపల్లి హనుమాన్ ఆలయం సెంటర్ లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ కౌన్సిలర్ అభ్యర్థి భౌతు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కేకు కటింగ్ చేసి స్వీట్లు పంచి పెద్ద ఎత్తున సంబరాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గజ్జ రాజబాపయ్యా,దుర్గం రవి, ప్రసాద్,దుర్గం అనిల్ , సాగర్, రాజు ఆకుదారి విజయభాస్కర్ ,రంజిత్ ,మధు, తదితరులు పాల్గొన్నారు
సీసీఐ పత్తి కొనుగోళ్లను ప్రారంభించిన, గండ్ర సత్యనారాయణ రావు
శాయంపేట నేటిధాత్రి:
రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం, రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంటను సీసీఐ కేంద్రాల్లో అమ్ముకొని మద్దతు ధర పొందాలని గండ్ర సత్యనారా యణరావు సూచించారు. పరకాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు లో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన పత్తి కొనుగో లు కేంద్రాన్ని ఎమ్మెల్యే లిద్దరు రిబ్బన్ కట్ చేసి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా వేరు వేరుగా మాట్లాడుతూ సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని రైతు లు సద్వినియోగం చేసుకొని, మద్దతు ధరను పొందాలని అన్నారు.
8 నుండి 12 శాతం వరకు తేమ శాతం ఉండడం వలన రైతులు నష్టపోతున్నా రని 20 శాతం తేమ ఉండే విధంగా కొనుగోలు చేయాల న్నారు. ప్రతి ఎకరాకి 7 క్వింటాళ్లు కొనుగోలు చేయా లనే నిబంధన కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసి, 12 క్వింటాలు కొను గోలు చేసేలా రైతులకు సహక రించాలన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపో యిన ప్రతి ఒక్కరికి పరిహారం అందించేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుం దని, అధికారులు వెంటనే సర్వే చేసి ప్రభుత్వానికి నివే దిక అందించేలా సహకరిం చాలన్నారు. పత్తి కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు స్లాట్ బుకింగ్ చేసుకుని పత్తిని తీసుకురావాలని సూచించా రు. అంతకుముందు వివిధ పంటలకు సంబంధించిన కనీస మద్దతు ధర పోస్టర్ ను ఎమ్మెల్యేలు, అధికారులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శాయంపేట మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు
రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
భూపాలపల్లి నేటిధాత్రి
రేగొండ మండల కేంద్రంలో పశువులకు సకాలంలో గాలికుంటు నివారణ టీకాలు వేయించడం ద్వారా పశువుల్లో రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటాయని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండల కేంద్రంలో పశు వైద్య పశు సంవర్ధక శాఖ జయశంకర్ భూపాలపల్లి జిల్లా వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమం గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి వాకిటి శ్రీహరి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ లతో కలిసి పాల్గొన్నారు. పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసిన అనంతరం మంత్రి మాట్లాడారు. పశువులకు టీకాలు వేయించటం ద్వారా పశువుల్లో రోగ నిరోధక శక్తి పెరిగి, వ్యాధుల ప్రభావం తగ్గుతుందన్నారు. గాలికుంటు వంటి వ్యాధులు పశువుల పాలు, ఉత్పత్తితో పాటు రైతుల ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపుతాయన్నారు. ప్రతీ ఒక్క రైతు తన పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని మంత్రి సూచించారు.
అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ…. పశు సంపద తోడు ఉంటేనే వ్యవసాయం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. మన ఇళ్లల్లో పశుసంపద ఉంటే ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుందన్నారు. రైతులు పశువులకు సరైన పోషకాలు కలిగిన దాణా మరియు మేత అందిస్తే పాల దిగుబడి పెరగడంతో పాటు వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉంటాయన్నారు. ముఖ్యంగా చూడి పశువులకు తప్పకుండా గాలికుంటు నివారణ టీకాలు వేయించడం తప్పనిసరి అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో పశువర్ధక శాఖ జిల్లా అధికారి కుమారస్వామి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరసయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీదేవి గండ్ర సత్యనారాయణరెడ్డి పున్నమి రవి తదితరులు పాల్గొన్నారు
బుగులోని వెంకటేశ్వరస్వామి జాతర వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జీఎస్సార్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులో వచ్చే నెల 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు జరిగే బుగులోని వెంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవములు(జాతర) – 2025 గోడ పత్రికను ఈరోజు ఉదయం గణపురం మండలం బుద్దారం గ్రామంలోని శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.
రెండో తిరుపతిగా పేరుగాంచిన బుగులోని వెంకటేశ్వరస్వామి వారి జాతర కు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు. భక్తి, సేవ, సాంస్కృతిక పరంపరలను ప్రతిబింబించే ఈ జాతర ప్రజల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతర బ్రహ్మోత్సవాలు ప్రజల ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదపడాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. భక్తుల సౌకర్యార్థం సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఇప్పటికే రూ.200 లక్షల నిధులు కేటాయించినట్లు, అట్టి అన్ని పనులు పూర్తి కావస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
బుధవారం భూపాలపల్లి క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పం కిషన్ పుట్టిన రోజు సందర్భంగా కిషన్ ని ఆశీర్వదించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎస్సార్ మాట్లాడుతూ కిషన్ నిండు నూరేళ్లు ఆయురు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే జి ఎస్ ఆర్ ను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.
చిట్యాల, నేటిదాత్రి :
Vaibhavalaxmi Shopping Mall
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది…ముగ్గురు పిల్లలు ఉంటే స్థానిక సంస్థలలో పోటీ చేయరాదని ఉన్న జీవోను రద్దు చేయించి ముగ్గురు పిల్లలు ఆ పైన ఉన్న కూడా స్థానిక సంస్థల పోటీ చేయొచ్చు అనే జీవోను ఇప్పించినందుకు గాను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కి బొకే ఇచ్చి శాలువాతో సత్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో *చిట్యాల మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య,మండల ప్రధాన కార్యదర్శి గడ్డం కొమురయ్య, గుండెపరెడ్డి రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్, మట్టికి రవీందర్, *సీనియర్ నాయకులు సిరిపురం కుమారస్వామి ,కొర్రి సాంబశివుడు, తదితరులు పాల్గొన్నారు.
శాయంపేట మండల కేంద్రంలో గల గ్రామపంచాయతీ ఆవర ణంలో ఐదుసంవత్సరాల లోపు చిన్నారు లందరికీ తప్పకుండా పోలియో చుక్కలు వేయించుకోవాలని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి నియోజక వర్గం గ్రామపంచాయతీ కార్యాల యంలో నిర్వహించిన పోలి యో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేస్తూ, చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ప్రతి తల్లిదం డ్రులు తమ పిల్లలకు రెండు పోలియో చుక్కలు వేయాలని పిలుపు నిచ్చారు ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలియో రహిత సమాజం నిర్మాణం మన అందరి బాధ్యత
ఈ మహత్తర లక్ష్యం సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు, ఆశా కార్యకర్తలు,స్థానిక ప్రజలు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
బిఆర్ఎస్ డోకా కార్డు విడుదల చేసిన ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్.
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రెస్ మీట్ లో గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం చేసిన మోసాలను వెల్లడిస్తూ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుండి 23 శాతానికి కుదించి బీసీలను డోకా చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వం. వరి వేస్తే ఉరి అని రైతులను భయపెట్టి తన ఫామ్ హౌస్ లో మాత్రం వరి పంటను పండించి రైతులను డోకా చేశారు. 317 జీవోను తెచ్చి ఉద్యోగుల జీవితాలతో ఆడుకుని ఉద్యోగులకు 20వ తేదీ వరకు జీతాలు ఇవ్వలేని స్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీసుకువచ్చిన ఘనత గత టిఆర్ఎస్ ప్రభుత్వానిదే. మిగులు బడ్జెట్ తో ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా చేసిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిది. రైతుబంధు పేరుతో కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, ఫంక్షన్ హాల్లకు,ప్రైవేట్ కాలేజీలకు ప్రజా సొమ్మును పంచిపెట్టినది బి.ఆర్.ఎస్ ప్రభుత్వానిది. అమరవీరుల కుటుంబాలను,ఉద్యమకారులను గుర్తించకుండా వారిని మోసం చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వమే. పదేళ్ల కాలంలో సర్పంచులతో అభివృద్ధి పనులు చేయించి బిల్లులు ఇవ్వకుండా ఎగ్గొట్టి వారి ఆత్మహత్యలకు కారణమైనది బిఆర్ఎస్ ప్రభుత్వం. మహిళలకు పావలా వడ్డీకే 10 లక్షల రుణం ఇస్తానని ఇవ్వకుండా దూకా చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని మాట తప్పి మోసం చేసింది కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని డోకా చేసింది బిఆర్ఎస్ పార్టీ. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని ఇవ్వకుండా డోకా చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వము. ఇంటికో ఉద్యోగం ఇస్తానని అధికారంలోకి రాగానే ఇవ్వకుండా డోకా చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వం. నిరుద్యోగులకు 3000 రూపాయల నిరుద్యోగ భృతిని ఇస్తానని డోకా చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వం. పది సంవత్సరాల కాలంలో ఒక డీఎస్సీ కూడా వేయకుండా నిరుద్యోగులను డోకా చేసింది. బిఆర్ఎస్ ప్రభుత్వం. గ్రూప్.1 ప్రశ్నాపత్రాలు లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నది బిఆర్ఎస్ ప్రభుత్వం. పదేళ్ల పాలనలో ఒక రేషన్ కార్డు ఇవ్వకుండా ప్రజలను డోకా చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వం. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో హడావిడి చేసి పేదలకు ఇండ్లు ఇవ్వకుండా మోసం చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేసి ధరణిని అడ్డుపెట్టుకొని బిఆర్ఎస్ నాయకులు భూములను అక్రమంగా కాజేసినారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
దసరా ఉత్సవాల ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే జిఎస్ఆర్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో దసరా ఉత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయాలని, ఈ ఉత్సవాలకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సింగరేణి, మునిసిపల్, పోలీసు అధికారులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచించారు. బుధవారం వివిధ శాఖల అధికారులతో కలిసి క్రిష్ణకాలనీ అంబేద్కర్ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. దసరా ఉత్సవాల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. విద్యుత్, నీటి సరఫరా, పారిశుధ్యం, భద్రత, ఆరోగ్య సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ సరిగా ఉండేలా చూసుకోవాలన్నారు. అంబేద్కర్ స్టేడియంలో గతేడాది జరిగిన దసరా ఉత్సవాల్లో కొంతమంది అల్లరి మూకలు గొడవ చేశారని, ఈసారి అలాంటి గొడవలు జరగకుండా పోలీసు అధికారులు తగిన భద్రత ఏర్పాటు చేసుకోవాలని పోలీసులకి సూచించారు. ఉత్సవాలు ప్రజాస్వామ్య పండుగలా అందరికీ ఆనందాన్ని పంచేలా విజయవంతంగా నిర్వహించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ డిఎస్పి సంపత్ రావు కాంగ్రెస్ పార్టీ నాయకులు చల్లూరి మధు అప్పం కిషన్ ముంజల రవీందర్ తదితరులు పాల్గొన్నారు
దండు రమేష్ కు రాష్ట్ర ఈ జీ సి కౌన్సిలర్ గా సన్మానం
గణపురం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆరు ముళ్ళ ఎల్ల స్వామి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆరు ముళ్ళ ఎల్ల స్వామి మాట్లాడుతూ బుధవారం రోజు జయశంకర్ భూపాలపల్లి భారత్ ఫక్షన్ హాల్ లో జరిగే దండు రమేష్ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్ర ఈ. జి.సి. కౌన్సిల్ మెంబర్ గా నియమించిన సంధర్బంగా “సన్మాన మహోత్సవ” కార్యక్రమానికి ముఖ్య ఆతిథులుగా విచ్చేస్తున్న దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాశనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు, నాగరిగారి ప్రీతం తెలంగాణ రాష్ట్ర ఎస్.సి.కార్పొరేషన్ చైర్మన్,గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి శాసనసభ్యులు, అయిత ప్రకాష్ రెడ్డి , రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ కావున ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కుటుంభ సభ్యులు అందరూ హాజరై విజయవంతం చేయవలసిందిగా మనవి
మహారాణి బతుకమ్మ పాట సిడి ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే గండ్ర
చిట్యాల, నేటిధాత్రి :
చిట్యాల మండలంలోని తిర్మలాపూర్ గ్రామానికి చెందిన వర్ధమాన గేయ రచయిత దాసారపు నరేష్ రచించిన మహారాణి బతుకమ్మ పాటను భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సిడి ఆవిష్కరణ చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నరేష్ ఎన్నో సామాజిక ఉద్యమ గీతాలు రాస్తూ ప్రజల మన్నలను పొందుతున్నాడని, తెలంగాణలో బతుకమ్మ పండుగ చాలా విశిష్టమైనదని పువ్వులను పూజించే గొప్ప సంస్కృతి మనదని ప్రపంచంలో ఎక్కడ లేదని తెలంగాణలో పండుగ వస్తే ఆనందంతో ఆడబిడ్డలు మెరిసిపోయే అంబరాన్ని తాకే సంబరాలు జరుపుకుంటారని పేర్కొన్నారు బతుకమ్మ సంస్కృతి సాంప్రదాయాల గురించి శాయంపేట మండలంలోని మాందారి పేట గ్రామానికి చెందిన గాయకులు మిద్దెపాక మధుకర్, అంబాల గ్రామానికి చెందిన గాయని జేరిపోతుల సంధ్య, చాలా చక్కగా పాడారని అభినందించారు, ఈ పాట ఎమ్ ఎస్ సాంగ్స్ యూట్యూబ్ ఛానల్ లో చూడవచ్చని చెప్పారు ఈ కార్యక్రమంలో నటులు జన్నె యుగేందర్,గాయకులు పుల్ల ప్రతాప్, మిట్టపల్లి బాలు,దొగ్గేల దేవేందర్,గేయరచయిత బానోతు రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు
నిధులు తెచ్చే దమ్ము లేక ప్రజలను శిలాఫలకలు వేసి ఏమార్చుతున్నావ్
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్య మంత్రి కేసీఆర్ ను ఒప్పించి కొప్పుల గ్రామం నుండి పరకా ల నేషనల్ హైవే మధ్యన చలి వాగుపై బ్రిడ్జి నిర్మాణం కొరకు ఎస్టిహెచ్డిఎఫ్ 2023-24 నుండి రూ.574 లక్షలు మరియు కొప్పుల గ్రామం నుండి పరకా ల వరకు బిటీ రోడ్డు నిర్మాణం కొరకు రూ.585 లక్షలు మం జూరు చేయించి, టెండర్లు పిలిచి, పనులు ప్రారంభిం చడం జరిగింది. పనులు జరుగు తుంటే వాటిని వేసిన ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సిగ్గుచేటు.నేను నిధులు తెచ్చిన అంటూ మేము వేసిన శిలా పలకాల పక్కనే శిలాఫలకాలు వేసి ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేయడం ఏంటని ఏద్దేవా చేసిన భూపా లపల్లి మాజీఎమ్మెల్యే మండ లంలో పర్యటించిన భూపాల పల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లా డుతూ జోగంపల్లి గ్రామం నుండి మైలారం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మె ల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ. నేను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు హుస్సేన్ పల్లి నుండి మైలారం వరకు వయా పెద్ద చెరువు కట్ట మీదుగా కోటి అరవై లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేసి, పనులు ప్రారంభించడం జరిగింది.కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇష్టరాజ్యంగా పనులు చేస్తున్నారు.కాంగ్రెస్ నాయ కుల వ్యవసాయ భూమి ఉందని రోడ్డు పక్కన ఉన్న చెరువుని ఆక్రమిస్తూ రోడ్డు వేస్తున్నారు.కాంగ్రెస్ నాయకు లకు సహకరించని అధికారు లను ట్రాన్స్ఫర్ చేయిస్తూ వారిపై కక్ష్య సాధింపు చర్యలు చేస్తున్నారు.అదే విదంగా ఎస్సిలకి సంబంధించిన స్మశాన వాటికను కూడా ఆక్రమించుకు న్నారు.అంటే అధికార పార్టీ నాయకులు ఏదీ చేసిన మాఫ్ అనే ధోరణి నడుస్తుంది. కావున ఇరిగేషన్ అధికారులు మరియు రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెరువును ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అనంతరం కొప్పుల గ్రామంలో వేసిన శిలా ఫలకాలను చూసి శిలాఫల కాల మోజులో ప్రజలను ఏమార్చుతున్నారు అంటూ చురకలు అంటించాడు ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే జిఎస్ఆర్ కు వినతి పత్రం ఇచ్చిన ఎస్ఎఫ్ఐ నాయకులు
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రములో ఉన్న బాలికల ఆశ్రమ పాఠశాల వర్డన్ వెంటనే సస్పెండ్ చేయాలి మహిళా వార్డెన్ సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామేర కిరణ్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న మేస్ కాస్మోటిక్స్. స్కాలర్ షిప్స్ & ఫిజురియంబర్స్ వెంటనే విడుదల చేయాలీ జిల్లా కేంద్రములో విద్యార్థులు సమస్యను వెంటనే పరిష్కరించాలి అని ఎమ్మెల్యేకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బొడ్డు స్వరం ప్రధాన కార్యదర్శి కుమార్ రాజ్ కుమార్ పాల్గొనడం జరిగింది
గ్రామీణ ప్రాంత ప్రజలకు రాకపోకలు సులభతరం చేయడం, వ్యవసాయ ఉత్పత్తులకు రవాణా సౌకర్యం కల్పించడం, విద్యార్థులు, కార్మికులు, రోగులు సులభంగా ప్రయాణించేలా చేయడం లక్ష్యంగా భూపాలపల్లి నియోజకవర్గంలోని అన్ని పల్లెల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. గురువారం భూపాలపల్లి నియోజకవర్గంలోని భూపాలపల్లి మండలంతో పాటు గణపురం మండలంలోని వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులకు జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మీ తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మొత్తం రూ.390 లక్షల వ్యయంతో వివిధ గ్రామాల్లో రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామంలో కమలాపూర్ నుండి పెద్దాపూర్ వరకు రూ.20 లక్షలు, ఎస్ యం కొత్తపల్లి నుండి దొమ్మటిపల్లి చెరువు వరకు రూ.100 లక్షలు, గొర్లవీడు గ్రామంలో జడ్పీ రోడ్డు నుండి మల్లయ్యపల్లి వరకు రూ.20 లక్షలు, ట్రాన్స్ఫార్మర్ నుండి మొరంచవాగు వరకు రూ.20 లక్షలు. గణపురం మండలం రంగారావుపల్లి నుండి దశరథం తండా వరకు రూ. 20 లక్షలు, వీర్లపల్లి(బంగ్లాపల్లి) నుండి చక్రవర్తిపల్లి వరకు రూ.20 లక్షలు, బంగ్లాపల్లి ఎస్సీ కాలనీ నుండి మామిడి తోట వరకు రూ.20 లక్షలు, సీతారాంపూర్ నుండి కొండాపూర్ వరకు రూ.20 లక్షలు, అప్పయ్యపల్లి తూపురం నుండి కొండంపల్లి వరకు రూ.20 లక్షలు, గణపురం చీరలపల్లి చింతల నుండి లబ్బదండ వాగు వరకు రూ.130 లక్షలతో వ్యవసాయ పొలాలకు వెళ్లే అంతర్గత రోడ్ల నిర్మాణపనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ… గ్రామీణ రహదారులు బాగుంటేనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, అందుకోసం ప్రభుత్వ నిధులతో పాటు ఇతర పథకాల ద్వారా కూడా రహదారి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం అందే వరకు కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. అభివృద్ధి అన్నది పట్టణాలకు మాత్రమే పరిమితం కాకుండా, పల్లెల్లో కూడా సమానంగా ఉండాలి అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
గొర్లవీడు గ్రామంలో సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే జీఎస్సార్ అన్నారు. భూపాలపల్లి మండలం గొర్లవీడు గ్రామంలో గ్రామ దాతల సహకారంతో సుమారు రూ.2 లక్షల 50 వేల వ్యయంతో 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. కాగా, సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఎక్కడైతే శాంతిభద్రతలు పటిష్టంగా ఉంటాయో, అక్కడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రజల రక్షణ, భద్రత గురించి పోలీసులు ఎల్లవేళలా పనిచేస్తున్నట్లు తెలిపారు. దొంగతనాలు, నేరాలు, రోడ్డు ప్రమాదాలు, నిందితులను తొందరగా పట్టుకునేందుకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయన్నారు. గొర్లవీడు గ్రామస్తులు దాతల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మంచి విషయమన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు కూడా ముందుకువచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజల్లో అవగాహన కల్పించి ముఖ్య పాత్ర పోషించిన భూపాలపల్లి పోలీసులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పోలీసులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు
మృతురాలు కుటుంబ సభ్యులను పరమర్శించిన గండ్ర సత్తన్న
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రానికి చెందిన దేసు ప్రదీప్ వారి సతీమణి అనారోగ్య సమస్యతో బాధపడుతూ మృతి చెందగా విషయం తెలుసుకున్న భూపాలపల్లి శాసనసభ్యులు ఈరోజు ఉదయం వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యుల పరమశించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఎమ్మెల్యే వెంట జిల్లా నాయకులు కటుకూరి శ్రీనివాస్ మాజీ ఎంపీపీ వడ్లకొండ నారాయణ గౌడ్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఓరుగంటి కృష్ణ జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు పోశాల మహేష్ గౌడ్ మండల నాయకులు నేరెళ్ల రాజు యువజన నాయకులు కార్తీక్ కార్యకర్తలు ఉన్నారు
శాయంపేట మండలంలోని కాట్రపల్లి గ్రామం నుండి గంగిరేణిగూడెం గోరీకొత్తపల్లి రేగొండ భూపాలపల్లి కాలే శ్వరం వెళ్ళుటకు నర్సంపేట నుండి వయా మల్లంపల్లి ద్వారా ప్రయాణించే ప్రయాణికులకు సౌకర్యార్థం గత పది సంవత్సరాల క్రితం అప్పటి శాసనసభ స్పీకర్ మధుసూదననాచారి కాట్రపల్లి నుండి గంగిరేణిగూడెం వరకు ఒక కోటి 16 లక్షలతో ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను బీటీ రోడ్డు వేసి తీర్చడం జరిగింది.
వామ్మో ఈ రహదారిలో ప్రయాణించా లంటే నరకం కనిపిస్తుంది తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళిన వాళ్ళు గుల్ల కావడం కాయం అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు వాహనదారులు ప్రత్యక్ష నరకాన్ని తలపిస్తున్న ఈ మార్గం ఎక్కడో కాదు. ప్రజలకు ఈ రహదారి ఇబ్బందికరంగా ఉంది. ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని భయంగా ప్రయాణం సాగిస్తు న్నారు పాలకుల నిర్లక్ష్యానికి గురై కనీసం కాలి బాటలో కూడా నడవలేని దుస్థితి నెలకొం ది.గత 20 నెలలుగా అధికారం లోకి వచ్చిన కాంగ్రేస్ ప్రభుత్వం దేశానికి పట్టుకొమ్మ లైన గ్రామాలను విస్మరించిం ది.కనీస అవసరాలు కూడా తీర్చలేని దౌర్భాగ్యాన్ని రాష్ట్ర ప్రజలకు అందించడం జరిగింది గ్రామా ల్లో పారిశుద్ధ్యంలోపించి అనేక రోగాలబారిన ప్రజలు పడుతు న్న గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించక కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్ఛేనిధులు రాకుండా రాష్టంలో రాక్షస పాలన కొనసాగిస్తుందని కాట్రపల్లి మాజీ ఎంపీటీసీ షేక్ అని ఫాగౌస్ విమర్శించాడు.
కావున రాష్ట్ర ప్రభుత్వం త్వర గా 42%బీసీ రిజర్వేషన్ అమ లు చేసి దొంగనాటకాలు ఆడ కుండా గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని వారు అన్నారు ఇప్పట్లో ఎన్నికలు నిర్వహిస్తే కనీసం ఒక్క సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీని కుడా గెలుచుకో లేని దుర్భార స్థితిలో ఉందని కాంగ్రేస్ భయపడుతుందని , ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతుందని ఇప్పటికైనా స్థానిక శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణరావు చొరవ తీసుకొని ఈ రహదారిని మర మ్మత్తు చేయించాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గొల్లపల్లి గ్రామ ప్రజలు బాబు పెద్ద రమేష్ బాబు సాంబయ్య పాక చిన్న రాజయ్య బాబు చిన్నన్న బాబు తిరుపతి బాబు శ్రీను బైకని సాంబయ్య అరే తిరుపతి పోతరాజ్ ఐలయ్య నూనెటి రమేష్ ఎల్లవుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.