అగ్నిప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యం
వి.భద్రయ్య స్టేషన్ ఫైర్ ఆఫీసర్
పెట్రోల్ బంకుల్లో అవగాహన కార్యక్రమం
పరకాల,నేటిధాత్రి
అగ్నిప్రమాదంలో వీరమరణం పొందిన 66 మంది అగ్నిమాపక సిబ్బంది స్మృతార్థం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.ఈ సందర్బంగా పట్టణంలోని శ్రీ బాలాజీ ఫిల్లింగ్ స్టేషన్లో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ వి.భద్రయ్య ఆధ్వర్యంలో కరపత్రాలు,పోస్టర్లు పంపిణీ చేసి,అగ్నిప్రమాద నివారణ చర్యలపై అవగాహన కల్పించారు.పాఠశాలలు, కార్యాలయాలు,వ్యాపార సంస్థలు,గ్రామీణ ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్,సదస్సులు నిర్వహిస్తూ విద్యుత్ భద్రత, ఎల్పీజీ వాడకం,గ్యాస్ లీకేజీ నివారణ,అగ్ని సమయంలో పాటించాల్సిన చర్యలపై సూచనలు ఇస్తున్నామని అగ్నిప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యమని భద్రయ్య తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎల్ఎఫ్ఎఫ్.కృష్ణకుమార్, G. గణేష్ ఎఫ్ఎఫ్టి,ఎఫ్ఎఫ్ లు దిలీప్,రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
