ఆక్రమణకు గురైన గార్ల పెద్ద చెరువు శిఖం భూములకు.

ఆక్రమణకు గురైన గార్ల పెద్ద చెరువు శిఖం భూములకు హద్దులు ఏర్పాటు చేయాలి…

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించిన సిపిఎం,బిఆర్ఎస్, న్యూడెమోక్రసీ, టిడిపి నాయకులు…

నేటి ధాత్రి –

 

 

 

మహబూబాబాద్,గార్ల :-ఆక్రమణకు గురైన గార్ల పెద్ద చెరువు శిఖం భూములకు సర్వే చేపట్టి, హద్దులు ఏర్పాటు చేయాలనీ సిపిఎం, బిఆర్ఎస్, న్యూడెమోక్రసీ, టిడిపి పార్టీల నాయకులు డిమాండ్ చేశారు.సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ వీర బ్రహ్మచారి లకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ,సీతంపేట పరిధిలోని గార్ల పెద్ద చెరువు ఆక్రమణకు గురౌతూ కబ్జా కు గురైన చెరువు శిఖం భూములను కబ్జా నుండి కాపాడి,శాశ్వతంగా ట్రెంచ్ ఏర్పాటు చేయాలని కోరారు.మండలానికే తలమానికంగా మారిన గార్ల పెద్ద చెరువులో 766 సర్వే నెంబరు లో శిఖం భూములు ఆక్రమణకు గురయ్యాయాని,766 సర్వే నెంబరు భూములతో పాటు 457, 440 సర్వే నెంబరు లలో ఉన్న ఎఫ్ సి ఎల్ భూములను సర్వే చేపట్టి శాశ్వతంగా ట్రెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో రెవెన్యూ అధికారులు స్పందించి శిఖం భూములు కబ్జా కాకుండా ట్రెండ్ ఏర్పాటు చేసి భూములను కాపాడాలని కోరారు. అక్రమంగా ఆక్రమించుకున్న భూమిని చెరువులో కలపాలని, తప్పుడు పత్రాలు సృష్టించి పట్టాలు చేయించుకున్న భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.వినతిపత్రం అందజేసిన వారిలో సిపిఎం మండల కార్యదర్శి అలవాల సత్యవతి,కందునూరి శ్రీనివాస్,న్యూ డెమోక్రసీ నాయకులు జి‌.సక్రు, గంగావత్ లక్ష్మణ్ నాయక్, కత్తి సత్యం గౌడ్, సంగు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version