మండల స్థాయి వ్యాసరచన, ఉపన్యాస పోటీ విజేతలు

వ్యాసరచన పోటీల్లో మండల స్థాయి విజేతలు వీరే

కొత్తగూడ నేటిధాత్రి

 

జనవరి 25 న జాతీయ ఓటర్ల దినోత్సవంను పురస్కరించుకొని గురువారం మండల కేంద్రం లోని మోడ ల్ స్పోర్ట్స్ స్కూల్ లో మండల విద్యాశాఖ అధికారి గుమ్మడి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో విద్యార్థులకు మండల స్థాయి వ్యాస రచన, ఉపన్యాసం, డ్రాయింగ్, సోలో సాంగ్ పోటీలు నిర్వహించారు.ఈ సందర్బంగా మండల విద్యాశాఖ అధికారి గుమ్మడి లక్ష్మి నారాయణ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఓటు విలువను తెలుసుకోవాలని, తమ ఇంట్లో మరియు గ్రామంలో ఉన్న వారందరూ బాధ్యతగా ఓటు వేసేలా ప్రోత్సహించాలని” కోరారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని, ముఖ్యంగా యువత ఓటు హక్కు ను బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ఉపన్యాసం లో వి.శివుడు ఎం ఎస్ ఎస్ స్పోర్ట్స్ స్కూల్ ఫస్ట్ ప్రైజ్,.సి యచ్ చరణ్య-కెజీబీవీ కొత్తగూడ,వ్యాసరచన:గుగులోత్ నందిని- టీ డబ్ల్యూ (ఏ ఎచ్ ఎస్(జి)కొత్తగూడ,డి. మధుప్రియ-టీ డబ్ల్యూ ఆర్ జేసీ (జి)కొత్తగూడ,డ్రాయింగ్:
సి యచ్. శ్రావ్య-టీ డబ్ల్యూ ఏ హెచ్ ఎస్(జి)కొత్తగూ,జి. సుమశ్రీ-( ఎంపీ యూపీఏస్) కొత్తగూడ,సోలోసాంగ్:రామటెంకి. సంజన-(ఎంపీ యూపీఏస్) వీరు మండల స్థాయి విజేతలు గా నిలిచారని తెలిపారు.ఈ కార్యక్రమం లో మోడల్ స్పోర్ట్స్ స్కూల్ ప్రిన్సిపాల్ డి.సారయ్య, వన ప్రేమి డాక్టర్ పులుసం సాంబయ్య, సోషల్ ఫోరమ్ తీగల రమేష్ గౌడ, రేగా పాపయ్య,డాక్టర్ వాసం వీరాస్వామి, బి మంగీలాల్, నామాల మోహన్, సిర్పీలు యల్ వెంకన్న, మంకిడి ఉపేందర్,జి లలిత, వి సంధ్య, యం స్వప్న, యస్ అరుణ, యం మల్లేశ్వరి, యం రజిత, ఎంపెల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సత్యసాయి సేవా సమితి వ్యాస పోటీ…

“సత్య సాయి సేవా సమితి” ఆధ్వర్యంలో “డిగ్రీ” విద్యార్థులకు వ్యాస రచన పోటీలు
మెట్ పల్లి ఆగస్టు 22 నేటి ధాత్రి

 

 

జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు వచ్చే నెల 10 వ తేదీన “సత్యసాయి సేవా సమితి” ఆధ్వర్యంలో “వ్యాసరచన” పోటీలను నిర్వహిస్తున్నామని, ఈ పోటీలను విజయవంతం చేయాలని ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్.కే.వేంకయ్య విద్యార్థులకు పిలుపునిచ్చారు.మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఛాంబర్ లో శుక్రవారం రోజున ఆయన విలేకరులతో మాట్లాడుతూ,సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలలో “భవిష్యత్తు కోసం ప్రస్తుతం మనం ఏమి చేయాలి”( ది ఫ్యూచర్ డిపెండ్స్ అపాన్ వాట్ వి డు ఇన్ ద ప్రెజెంట్) అన్న శీర్షికపై విద్యార్థులకు వ్యాస రచన పోటీలను నిర్వహించడం జరుగుతుందని,ఈ పోటీలు ఉదయం 11 గంటల నుంచి 11.45 నిమిషాల వరకు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ – కళాశాల విద్య కమీషనర్ (సీ సీ ఈ) శ్రీమతి ఏ.దేవసేన మరియు సీసీఈ జాయింట్ డైరెక్టర్ ఆచార్య డీ ఎస్ ఆర్ రాజేందర్ సింగ్ లు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఈ పోటీలను నిర్వహిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.కళాశాల, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో ప్రథమ ,ద్వితీయ, తృతీయ స్థానం పొందిన విద్యార్థులకు ఈ బహుమతులను ప్రదానం చేస్తున్నారని ఆయన వివరించారు. మానవ విలువలను పెంచడం కోసమే ఈ పోటీలను నిర్వహిస్తున్నామని పేర్కొంటూ “సత్య సాయి సేవా సమితి” స్పష్టంగా ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. ఈ పోటీలలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొనాలని ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్య పిలుపునిచ్చారు. ఇతర సమాచారం కోసం 98493 94561 నెంబర్ కు కాల్ చేయాలని ఆయన సూచించారు.ఈ సమావేశంలో కళాశాల కామర్స్ హెచ్.ఓ.డి ఏ.మనోజ్ కుమార్, లెక్చరర్లు అంజయ్య, శ్రీకాంత్, దశరథం, బోధనేతర సిబ్బంది లక్ష్మీ నారాయణ, శ్రీనివాస్, లింగం, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version