ఎంపీడీవో గొడిశాల సురేందర్ గౌడ్ అమ్మవార్లను దర్శనం

అమ్మవార్లను దర్శించుకున్న ఎంపీడీవో గొడిశాల సురేందర్ గౌడ్ దంపతులు
మొగుళ్లపల్లి నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ముల్కలపల్లి-మొగుళ్లపల్లి గ్రామాల మధ్యన అత్యంత వైభవంగా నిర్వహించిన శ్రీ సమ్మక్క-సారలమ్మ మినీ మేడారం జాతరను మొగుళ్ళపల్లి ఎంపీడీవో గొడిశాల సురేందర్ గౌడ్ దంపతులు శనివారం సందర్శించి, అమ్మవార్లకు మొక్కులను సమర్పించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో ముచ్చటించారు. గత కొన్ని సంవత్సరాల నుండి ఎంతో అద్భుతంగా జాతర ఉత్సవాలను నిర్వహిస్తున్న కమిటీ సభ్యులకు ఆయన అభినందనలు తెలిపారు. సమ్మక్క-సారలమ్మ అనుగ్రహంతో..అమ్మవార్ల దీవెనలతో ప్రజలంతా సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్లాపాపలతో, పాడి పంటలతో కుటుంబ సభ్యులంతా కలిసి సుఖంగా జీవించాలని వారు అమ్మవార్లను వేడుకున్నట్లు తెలిపారు. అనంతరం జాతర ఉత్సవాలను నిరంతరం పర్యవేక్షిస్తూ..జాతర ఉత్సవాలు సజావుగా జరిగేలా ఉత్సవ కమిటీకి తోడ్పాటునందిస్తూ..జాతర ఉత్సవాలను నిరంతరం పర్యవేక్షిస్తూ..జాతర ఉత్సవ కమిటీకి వారి సూచనలతో జాతర విజయవంతంలో భాగస్వాములైన తహసిల్దార్ జాలీ సునీతా రెడ్డి, ఎంపీడీవో గొడిశాల సురేందర్ గౌడ్, ఎంపీఓ సుభాష్ చంద్రబోస్, మండల వైద్యాధికారిణి డాక్టర్ పోరండ్ల నాగరాణి, దేవదాయ శాఖ అధికారి వెంకటయ్యలకు జాతర ఉత్సవ కమిటీ పక్షాన చదువు అన్నారెడ్డి శాలువాలతో ఘనంగా సత్కరించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version