రామాయంపేట అభివృద్ధి జనహృదయనేత సుప్రభాత్ రావు

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-16T143429.082.wav?_=1

 

రామాయంపేట అభివృద్ధి పథంలో “జనహృదయనేత” సుప్రభాత్ రావు పాత్ర..

రామాయంపేట, సెప్టెంబర్16 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట అభివృద్ధి, ప్రజా సంక్షేమం దిశగా గత పదేళ్లుగా నిరంతరం కృషి చేస్తున్న నాయకుడిగా టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత్ రావు పేరు రామాయంపేట ప్రజల్లో విశేష గుర్తింపు పొందింది. రాజకీయాల్లో సాధారణంగా పదవులు, వర్గ పరమైన లాభాల కోసం కృషి చేసే నాయకులు ఉన్నారనే అభిప్రాయం ప్రజలలో బలపడుతున్న తరుణంలో, అన్ని వర్గాలను కలుపుకుంటూ ప్రజల కోసం అహర్నిశలు శ్రమించే నేతగా సుప్రభాత్ రావు ప్రత్యేక స్థానం సంపాదించారు.

 

Development

రామాయంపేటకు పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల మంజూరులో ఆయన పాత్ర ప్రధానమని స్థానికులు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రామాయంపేట అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ని ఒప్పించి కోట్ల రూపాయల నిధులు విడుదల కావడంలో ఆయన కృషి కీలకమైందని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.
గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆరోగ్యశ్రీ పథకంను రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా రామాయంపేటలో ప్రారంభించడంలో సుప్రభాత్ రావు పట్టుదల నిర్ణయాత్మకమైంది . అంతేకాకుండా రామాయంపేటలో రెవెన్యూ డివిజన్ స్థాపన కోసం ఆయన చేపట్టిన నిరాహార దీక్ష తర్వాతే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటన చేయడం గమనార్హం.
రామాయంపేట అభివృద్ధి దిశగా ఆయన సమన్వయంతోనే మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ప్రస్తుత ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు లు నిధుల మంజూరులో ముందడుగు వేసినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా రోహిత్ రావు గెలుపులో సుప్రభాత్ రావు పోషించిన పాత్రను కాంగ్రెస్ వర్గాలు ప్రత్యేకంగా గుర్తిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఆయన చేసిన శ్రమ ఆ విజయంలో కీలకమైందని చెబుతున్నారు.

 

Development

 

రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలను ముందు ఉంచే నాయకుడిగా, *“జనహృదయనేత”*గా సుప్రభాత్ రావు పేరు రామాయంపేట ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచింది. అభివృద్ధి మార్గంలో రామాయంపేటను తీసుకెళ్లడమే తన లక్ష్యమని ఆయన తరచూ చెప్పడం, ప్రజలు ఆయనను ఆశాకిరణంగా భావించడానికి ప్రధాన కారణమవుతోంది. అంతే కాకుండా రామాయంపేట పట్టణ ప్రజలు కలలో కూడా ఊహించని భారీ వరదలు వినాయక చవితి పండుగ రోజున అర్ధరాత్రి పట్టణాన్ని చుట్టుముడితే ప్రజలందరూ గాఢనిద్రలో ఉన్నప్పుడు అధికారులను అప్రమత్తం చేసి తనే స్వయంగా ముందుకు వచ్చి అధికారులకు ధైర్యాన్నిస్టు , ఎమ్మెల్యే కి, ఉన్నతాధికారులకు, ఎప్పటికి అప్పుడు సమాచారం అందిస్తూ ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా.300మంది గిరిజన డిగ్రీ కళాశాల పిల్లలను కాపాడటం పట్ల పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

పల్లెల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తా…

పల్లెల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తా

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర జి ఎస్ ఆర్

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండల కేంద్రంలో
గ్రామీణ ప్రాంత ప్రజలకు రాకపోకలు సులభతరం చేయడం, వ్యవసాయ ఉత్పత్తులకు రవాణా సౌకర్యం కల్పించడం, విద్యార్థులు, కార్మికులు, రోగులు సులభంగా ప్రయాణించేలా చేయడం లక్ష్యంగా భూపాలపల్లి నియోజకవర్గంలోని పల్లెల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. ఈరోజు గురువారం గణపురం మండలంలోని వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులకు జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మీ తో
రంగారావుపల్లి నుండి దశరథం తండా వరకు రూ. 20 లక్షలు, వీర్లపల్లి(బంగ్లాపల్లి) నుండి చక్రవర్తిపల్లి వరకు రూ.20 లక్షలు, బంగ్లాపల్లి ఎస్సీ కాలనీ నుండి మామిడి తోట వరకు రూ.20 లక్షలు, సీతారాంపూర్ నుండి కొండాపూర్ వరకు రూ.20 లక్షలు, అప్పయ్యపల్లి తూపురం నుండి కొండంపల్లి వరకు రూ.20 లక్షలు, గణపురం చర్ల పల్లి చింతల నుండి లద్దబండ వాగు వరకు రూ.130 లక్షలతో వ్యవసాయ పొలాలకు వెళ్లే అంతర్గత రోడ్ల నిర్మాణపనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాలల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ. గ్రామీణ రహదారులు బాగుంటేనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, అందుకోసం ప్రభుత్వ నిధులతో పాటు ఇతర పథకాల ద్వారా కూడా రహదారి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం అందే వరకు కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. అభివృద్ధి అన్నది పట్టణాలకు మాత్రమే పరిమితం కాకుండా, పల్లెల్లో కూడా సమానంగా గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజల్లో అవగాహన కల్పించి ముఖ్య పాత్ర పోషించిన భూపాలపల్లి పోలీసులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పోలీసులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు ఉన్నారు.

రాజపేట దగ్గర పెట్రోల్ పంపు ప్రారంభోత్సవంలో ఐజీ…

రాజపేట దగ్గర పెట్రోల్ పంపు ప్రారంభోత్సవంలో ఐజీ

పోలీసులపై ప్రజలకు నమ్మకం పెరిగింది

వనపర్తి నేటిదాత్రి .

 

 

 

పోలీస్ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకులో నాణ్యత ప్రమాణాలు పాటించడం జరుగుతుంద ని రాష్ట్ర పోలీసు హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్.ఐజి రమేష్ రెడ్డి తెలిపారు
రాజపేట గ్రామ శివారులో వనపర్తి పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన పెట్రోల్ బాంక్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ ఐజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పెట్రోల్ బాంక్ ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, జిల్ల ఎస్పీ రావుల గిరీదర్ పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో ఐ ఓ సి ఎల్ అధికారులు సుమిత్ర, శరణ్య, జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ బి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, డి.ఎస్.పి వెంకటేశ్వర్లు సిఐలు ఎస్సైలు పాల్గొన్నారు

పరకాల అభివృద్ధి ప్రధాత చల్లా కు జన్మదిన శుభాకాంక్షలు…

పరకాల అభివృద్ధి ప్రధాత చల్లా కు జన్మదిన శుభాకాంక్షలు

16వ డివిజన్ లో చల్లా జన్మదిన వేడుక నిర్వహించిన స్థానిక కార్పొరేటర్.

కాశిబుగ్గ నేటిధాత్రి

 

 

 

గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారం లో పరకాల మాజీ శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 16వ డివిజన్ కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్ పాల్గొని కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ చల్లా ధర్మారెడ్డి పరకాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గా నిరంతరం కృషి చేశారని,వారి పట్టుదలతో మండలానికి కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు వచ్చిందని,డివిజన్ వ్యాప్తంగా ధర్మారెడ్డి కృషితోనే అభివృద్ధి జరిగిందని,పరకాల ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటున్న చల్లా ధర్మారెడ్డి రాబోయే రోజుల్లో మళ్ళీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పరకాల ప్రజలకు సేవ చేస్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ మాజీ డైరెక్టర్ గోలి రాజయ్య,డివిజన్,గ్రామ అధ్యక్ష కార్యదర్శులు,బీ.ఆర్.ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, యువత తదితరులు పాల్గొన్నారు..

ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-62-1.wav?_=2

ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డ్

వనపర్తి నేటిదాత్రి .

గత ప్రభుత్వం లో 8.19 లక్షల కోట్ల అప్పుల భారం చేసి న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ లను అమలు చేస్తున్నమని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.శనివారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ ములో మంత్రులు జూపల్లి కృష్ణారావు వాకిటి శ్రీహరి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తో కలిసి ప్రారంభిం చారు ఈసందర్భంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం లో చేసిన అప్పులకు వడ్డీ చెల్లిస్తూన్నామను రాష్ట్రంలో అభివృద్ధి, ఆపలే దని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత పేదలకు ఇందిరమ్మ ఇల్లు కేటాయింపు జేరుగు తున్నదని అన్నారు
అంటే ఇలా ఉండాలి అని ప్రజల చేత శభాస్ అని మెప్పులు పొందుతున్నారు. అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే సిలిండరు, రూ. 21 వేల కోట్లతో రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణ మాఫీ, గత ప్రభుత్వం సంవత్సరానికి ఎకరాకు 10 వేల చొప్పున రైతు భరోసా ఇస్తే ఈ ప్రభుత్వం 12 వేల చొప్పున ఇచ్చిందన్నారు. గత ప్రభుత్వం వారి వేస్తే ఉరి అని అంటే ఈ ప్రభుత్వం రైతును రాజు చేయాలనే ఉద్దేశ్యంతో సన్న రకం వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో కొత్తగా 7 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు పాత రేషన్ కార్డుల్లో పెళ్ళైన, పుట్టిన వారి పేర్లు కొత్తగా చేర్చడం జరిగిందన్నారు.
గత పాలకులు పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకోలేదని, కనీసం సంవత్సరానికి 2 లక్షల ఇల్లు కట్టిన ఐదు సంవత్సరాల్లో 10 లక్షల ఇళ్లు కట్టేవారని కానీ వారికి పేదల సంక్షేమం కంటే కమిషన్లే ముఖ్యమని కాలేశ్వరం కట్టారని దుయ్యబట్టారు.
ప్రజాపాలనలో తొలి విడతగా రూ. 22,500 కోట్ల నిధులతో ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్ల చొప్పున ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. మరో మూడు విడతల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు . ప్రతి సోమవారం రాష్ల్
వనపర్తి జిల్లాకలెక్టర్ ఆదర్శ్ సురభి సేవలపై మంత్రి శ్రీనివాస్ రెడ్డి అభినందించారు
రాష్ట్రంలోని 200 యూనిట్ల లో పు ఉచిత విద్యుత్ వనపర్తి జిల్లా లో 6127 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు మహిళల కు ఉచిత బస్ ప్రయాణం రైతులకు భూ భారతి చట్టం అనేక అభివృద్ధి పనులు చేస్తూ న్న మని మంత్రి చెప్పారు ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి వనపర్తి నియోజకవర్గ ని కి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న రాని కొనియాడారుమంగంపల్లిలో గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు , మంత్రులు పాల్గొన్నారు ఎమ్మెల్యే మేఘా రెడ్డి వ్యక్తిగతంగా ఇందిరమ్మ ఇల్ల లబ్ధిదారులకు బట్టలు పెట్టారు డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్ ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ లోకల్ యాదయ్య, మార్కెట్ కమిటి చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

ప్రాంతీయ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి.

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T123441.263.wav?_=3

ప్రాంతీయ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి :

◆:- యువనేత మొహమ్మద్ ముర్తజా

జహీరాబాద్ నేటి ధాత్రి:

జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ కలిసి మన ప్రాంతీయ పార్టీ తెలంగాణ రాష్ట్రము సాధించిన బిఆర్ఎస్ పార్టీ ని లేకుండా చేయాలని చేస్తున్న కుట్రలు సాగవు కెసిఆర్ కాళేశ్వరం నిర్మించి అపర భగీరతుడు అయ్యారు. కాంగ్రెస్, బీజేపీ నాటకాలు గట్టిగ ఎండగట్టాడు మరియు వీళ్ళ ఆటలు సాగాలేవు అందుకని కక్ష సాధింపు చర్యలకు కాంగ్రెస్ బీజేపీ లు కలసి కవిత ని కేసులు పేరుతో బెదిరించి పావుగా చేసి ఆడిస్తున్న నాటకం.
ఒక రకంగా చెప్పాలంటే ప్రాంతీయ పార్టీ లేకుండా చేసే కుట్ర ఇది.జాతీయ పార్టీ రాష్ట్రము లో అధికారం లో ఉంటే రాష్ట్రాన్ని వాళ్ళ చెప్పు చేతల్లో, ఢిల్లీ కి గులాం గిరి చేయిస్తారు, స్వతంత్ర నిర్ణయం తీసుకొనే అధికారం వీళ్లకు ఉండదు.
జాతీయ పార్టీల కన్నా, రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, అవసరాలు, ప్రాధాన్యతలు ప్రాంతీయ పార్టీ బిఆర్ఎస్ కె బాగా తెలుసు. రాష్ట్రానికి ప్రత్యేకమైన ప్రాజెక్టులు, పథకాలు, నిధుల కోసం కేంద్రం దగ్గర బలంగా డిమాండ్ చేయగలదు.
స్థానిక సంస్కృతి, భాష, ఆర్థిక వ్యవస్థ, రైతాంగం, పరిశ్రమలు వంటి అంశాల్లో ప్రాంతీయ పార్టీలు ఎక్కువ దృష్టి ప్రాధాన్యత ఇస్తుంది.ప్రజల్లారా జాగ్రత్త బిఆర్ఎస్ పార్టీ మన ప్రాంతీయ పార్టీ, అందరు కలసి కట్టుగా మన ప్రాంతీయ పార్టీ అయిన బిఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయాల్సిన సమయం ఇది, లేదంటే శాశ్వతంగా ఢిల్లీ గులాముల చేతిలో రాష్టం బందిగా ఉంటుంది.

గుండంపల్లి లో గులాబీ పార్టీ కి పెద్ద దెబ్బ…

గుండంపల్లి లో గులాబీ పార్టీ కి పెద్ద దెబ్బ

కొత్తగూడ, నేటిధాత్రి:

 

సంక్షేమ పథకాలకు ఆకర్షిణితులై కాంగ్రెస్ పార్టీ లో చేరిక బిట్ల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి & క్లస్టర్ ఇంచార్జి ఆధ్వర్యంలో… పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క. ..ములుగు అసెంబ్లీ, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుండంపల్లి లో బిఆర్ఎస్ పార్టీ కి స్థానిక ఎన్నికల ముందు కోలుకోలేని దెబ్బ పడింది కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బిట్ల శ్రీనివాస్ & క్లస్టర్ ఇంచార్జి వారి ఆధ్వర్యంలో నేడు గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ చేరిక ..

వీరికి మంత్రి సీతక్క కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు

పార్టీలో చేరిన వారు
గట్టి బాబు ( నర్సయ్య ) మాజీ సర్పంచ్ తిమ్మాపూర్.
దానం నారాయణ వార్డ్ మెంబర్ గుండంపల్లి
రమేష్ సీనియర్ కార్యకర్త.
జాటోత్ తేజ గుండంపల్లి
భూక్య నాగులు గుండంపల్లి వీరు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రాగానే నిస్వార్ధంగా ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను అందించిన ఘనత రేవంత్ సర్కార్ ది మాత్రమే ..
ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని
మహిళలకు మొదటి ప్రాధాన్యత కల్పించి వారి భవిష్యత్ కార్యాచరణ కోసం మహిళా సంఘాలను బలోపేతం చేశారు వడ్డీ లేని రుణాలు ఇచ్చారు వ్యవసాయ రంగంకు దేశంలో ఎక్కడా లేనివిధంగా సన్న వడ్ల కు 500 బోనస్ వరి మద్దతు ధర నిరుపేదలకు రేషన్ నూతన కార్డులను అందించి అర్హులందరికీ సన్న బియ్యం.. అందించిన ఘనత రేవంత్ సర్కార్ ..!
ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు.. ఎన్నడూ లేనివిధంగా కొత్తగూడ లో దూసుకుపోతున్న పలు అభివృద్ధి పనులు
కెసిఆర్ ఇవ్వలేనిది ప్రతి గ్రామానికి ఆనాడైనా ఈనాడైనా నిరుపేదలకు గూడు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ గ్రామాన ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్న సంగతి విదితమే.. వ్యవసాయ రంగంతో పాటు నిరుపేద గృహాల వెలుగులను నింపుతున్న ప్రజా ప్రభుత్వం ఉచిత విద్యుత్ ను అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలకు ఆకర్షిణితులై కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరుగుతుందని అన్నారు ములుగు నియోజకవర్గానికి సీతక్క ఎమ్మెల్యేగా .. రాష్ట్ర కేబినెట్ మంత్రివర్యులు గా ఉంటూ ప్రాంత అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి నిస్వార్ధంగా సేవలను అందిస్తున్న మంత్రి సీతక్క ఉండడం మన అదృష్టం అందుకే కాంగ్రెస్ పార్టీలో సగర్వంగా చేరుతున్నామని అన్నారు
ఈ కార్యక్రమంలో
కాంగ్రెస్ పార్టీ ములుగు (అసెంబ్లీ ) జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ పటేల్ రాష్ట్ర రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ చల్ల నారాయణరెడ్డి.
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య.
కొత్తగూడ బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు సుంకరబోయిన మొగిలి.
జిల్లా సీనియర్ నాయకులు వీరనేని వెంకటేశ్వరరావు
జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ రూఫ్ సింగ్.
( గుండంపల్లి క్లస్టర్ & కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బిట్ల శ్రీనివాస్ )
వల్లపు రంజిత్, వద్ది సోమయ్య, లక్కాకుల రాజు, గట్టి రమేష్ తోట మాధవలు బానోతు బాలు తదితరులు పాల్గొన్నారు

“వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మాజీ సర్పంచ..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-28T115850.126.wav?_=4

 

నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఉప్పు సర్పంచ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల నర్సాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ మండల ప్రజలందరికీ యువ నాయకులు మాజీ ఉప్పు సర్పంచ్ గోపాల్ మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా మీ కందరికీ సకల శుభాలు కలగాలని జీవితాల్లో విఘ్నాలు తొలగిపోయి విజయాలు సిద్ధించాలని గణనాథుని వేడుకుంటూ విగ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో అభివృద్ధిలో ముందడుగు వేయాలని నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తిశ్రద్ధలతో వినాయకుడిని ప్రార్థించి దేవదేవుని అనుగ్రహం పొందాలన్నారు,

ఇండస్ట్రియల్ హబ్‌ లో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి పెట్టుబడిదారులు ముందుకురావాలి

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-86-1.wav?_=5

 

ఇండస్ట్రియల్ హబ్‌ లో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి పెట్టుబడిదారులు ముందుకురావాలి

– మైలారం గుట్టల్లో ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి పనులను రెవెన్యూ, పరిశ్రమల శాఖ, పోలీసు అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే జీఎస్సార్
– వ్యాపారవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని సూచించిన ఎమ్మెల్యే
– 187 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు

గణపురం నేటి ధాత్రి

 

భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండలం మైలారం గ్రామ శివారులోని గుట్టల్లో 187 ఎకరాల్లో ఏర్పాటు చేయబోయే ఇండస్ట్రియల్ హబ్‌ లో పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి ఔత్సాహిక పెట్టుబడిదారులు ముందుకురావాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు. ఈరోజు సోమవారం రెవెన్యూ, ఇండస్ట్రీయల్, పోలీస్ ఇతర శాఖల అధికారులతో కలిసి మైలారం గుట్టపై జరుగుతున్న ఇండస్ట్రియల్ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే జీఎస్సార్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ. మైలారం రెవెన్యూ శివారులోని 204/1 ,205/1 సర్వే నెంబర్ లలో మొత్తం 187 ఎకరాలు భూమి ఉందన్నారు. ప్రభుత్వ భూమి దుర్వినియోగం కాకుండా చూస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు స్థలం కేటాయించామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మంత్రులు, ఎంపీల సహకారంతో ఈ ప్రాంత అభివృద్ధికి ఆహర్నిశలు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ ప్రాంతాన్ని టూరిజం, ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చి దిద్దుతున్నామన్నారు. ఇండస్ట్రీస్ పార్క్ కొరకు 60 ఎకరాల్లో 197 ఫ్లాట్లు కేటాంచడం జరిగిందన్నారు. స్క్వేర్ ఫీట్ రూ.1600 లకు టెండర్ కూడా త్వరలోనే ఓపెన్ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన వ్యాపారవేత్తలు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ కు 40 ఎకరాలు, కేంద్రీయ విద్యాలయంకు 10 ఎకరాలు, సైనిక్ స్కూల్ కు 20 ఎకరాలు, అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ కు 15 ఎకరాలు కేటాయించడం జరిగిందన్నారు. ఇప్పటికే రోడ్డు పనులకు రూ.4 కోట్లు ఖర్చు చేశారని మరో రూ.15 కోట్ల నిధులు సమకూర్చుతున్నట్లు ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు కాంగ్రెస్ నేతలు, అధికారులు, కార్యకర్తలు ఉన్నారు.

చంద్రబాబు కుప్పానికి కృష్ణా జలాలు చేరవేసారు

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-44-4.wav?_=6

*అపర భగీరథుడు ఏపీ సీఎం చంద్రబాబు.

*హంద్రీ-నీవా జిలాలతో కుప్పం సస్యశ్యామలం

*30న కుప్పంలో కృష్ణా జలాలకు హారతినివ్వనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు..

*ఎన్నికల హామీని నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం..

*చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..

చిత్తూరు,ఢిల్లీ(
నేటి ధాత్రి) ఆగస్టు 21:

రాయలసీమ ప్రాంతంలోని ప్రతి ఆయికట్టుకు నీరందించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి.., అన్నదాతలను ఆదుకోవడమే లక్ష్యంగా
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అపర భగీరథుడిలా అహర్నిశలు శ్రమిస్తున్నారని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు కొనియాడారు. కుప్పం నియోజకవర్గాన్ని హంద్రీ-నీవా జిలాలతో సస్యశ్యామలం చేయడమే తన సంకల్పంగా భావించి, ముందుకు సాగుతుండడం ఏపీ సీఎం చంద్రబాబు చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు.
పార్లమెంట్ సమావేశాలకు హాజరై దేశరాజధాని ఢిల్లీలో ఉన్న చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు ఈ నెల 30న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో కృష్ణా జలాలకు హారతి పట్టనున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు కృషిని.., పాలనా దక్షతను శుక్రవారం ఓ ప్రకటనలో కొనియాడారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చిత్తూరు పార్లమెంటు పరిధిలోని కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు చేరుకోవడం పై హర్షం వ్యక్తం చేశారు. దీనికి కారణమైన
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేసిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ. ఆయన నిత్య శ్రామికుడనీ. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గొప్ప పరిపాలనాదక్షుడంటూ ప్రశంసించారు. అంతేకాకుండా
ఇటు అధికారులు.
అటు కూటమి నాయకులు, కార్యకర్తలకు సీఎం స్పూర్తిగా నిలవడం అభినందనీయమన్నారు.
వైసిపి ప్రభుత్వం హయాంలో ఆగిపోయిన హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరుగులు తీయించిందన్నారు. సీఎం చంద్రబాబు, జల వనరుల శాఖ మంత్రి రామానాయుడు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ నిర్ణీత గడువులోగా హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులను పూర్తి చేశారని తెలిపారు. 530 కోట్ల వ్యయంతో 265 కిలోమీటర్ల కాల్వ విస్తరణ, అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేసి, కృష్ణా జలాలు కుప్పానికి చేరుకునేందుకు శ్రమించిన అధికారులను ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు అభినందించారు.

అభివృద్ధి పథంలో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-22T141651.918-1.wav?_=7

అభివృద్ధి పథంలో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్

_చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు.

నేటిధాత్రి, వరంగల్.

 

వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుందని బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు తెలిపారు. శుక్రవారం వరంగల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్యాంక్ ప్రగతిని వివరించారు. 1995లో ప్రారంభమైనప్పటి నుండి ఎదురైన సవాళ్లను అధిగమించి బ్యాంకును దినదినాభివృద్ధి చేసుకుంటూ వచ్చామని తెలిపారు. మొదట 5 కోట్లతో ప్రారంభమైన ఈ బ్యాంక్ ప్రస్తుతం 400 కోట్ల టర్నోవర్తో ముందుకు సాగుతోందని ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు 10శాఖలను ఏర్పాటు చేశామని, వచ్చే 5 సంవత్సరాలలో రాష్ట్రవ్యాప్తంగా బ్యాంక్ శాఖలను విస్తరించాలని సంకల్పించామని చెప్పారు.

“రాజకీయాలకు అతీతంగా సహకార స్ఫూర్తితో అభివృద్ధి చేస్తాము. బ్యాంక్తో రాజకీయం చేయకండి. 6 సార్లు గెలిచి సేవ చేసే అవకాశం కలిగింది. ఓడిపోయిన వారినీ కలుపుకొని ముందుకు వెళ్తాం” అని ప్రదీప్ రావు పేర్కొన్నారు.

వ్యాపార వర్గాలను ఎటువంటి ఇబ్బందులకు గురి చేయనివ్వమని, మహిళలకు కూడా రుణాలు అందించే దిశగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ సేవలను మరింత విస్తరిస్తామని చైర్మన్ స్పష్టం చేశారు

నారాయణపూర్ పై రవిశంకర్ ను కాంగ్రెస్ ధ్వజమెత్తింది..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-54-3.wav?_=8

నారాయణపూర్ పై మాట్లాడే అర్హత మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ కు లేదు

ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి నారాయణపూర్ నిర్వాసితుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన ఘనుడు రవిశంకర్

ఐదేళ్లు నారాయణపూర్ ప్రజలకు ముఖం చూపించకుండా తప్పించుకు తిరిగిన చరిత్ర నీది కాదా?

రైతు సమస్యలు, ప్రజా సంక్షేమంపై పూర్తి అవగాహన ఉన్న గొప్ప నాయకుడు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి కోసం రూ. 43 కోట్లు మంజూరు చేయించిన ఘనత చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ది

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్

గంగాధర మండలం మధురానగర్ ప్రజా కార్యాలయంలో విలేకరుల సమావేశం

గంగాధర నేటిధాత్రి :

గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ గురించి మాట్లాడే అర్హత మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్కు లేదు. ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి నారాయణపూర్ నిర్వాసితుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన ఘనుడు రవిశంకర్, నారాయణపూర్ నిర్వాసితుల సమస్యలను పట్టించుకోకుండా ఐదేళ్లు మొఖం చాటేసిన ఘన చరిత్ర ఆయనది. సాగునీరు అందించి పంటలు ఎండిపోకుండా కాపాడాలని కోరితే, రాళ్ల వర్షం పడి పంట నష్టపోయాం అనుకోవాలని రైతులకు నిర్లక్ష్యమైన సమాధానమిచ్చిందెవరో రైతులు మరచిపోరన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఏనాడైనా సకాలంలో నారాయణపూర్ రిజర్వాయర్ కు నీటిని విడుదల చేయించిన చరిత్ర నీకుందా, పంటలు సాగు చేయడానికి ముందే నారాయణపూర్ రిజర్వాయర్ కు సాగునీటిని విడుదల చేయించి రైతులపై తమకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారు మా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ నారాయణపూర్ నిర్వాసితులకు న్యాయం చేయలేక పోయింది. అబద్ధపు హామీలు పబ్బం గడుపుకోవడం తప్ప చేసింది ఏమీ లేదు. నారాయణపూర్ నిర్వాసితులకు ఒక్క రూపాయి పరిహారమైన ఇప్పించావా, పుట్టిన ఊరు అని చెప్పుకునే నువ్వు నారాయణపూర్ గ్రామానికి ఏం చేశావు, మధురానగర్ చౌరస్తాలో చర్చకు సిద్ధమా. చొప్పదండి ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాది కాలంలోనే నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి, పరిహారం కోసం రూ.43 కోట్లు మంజూరు చేయించిన గొప్ప నాయకుడు మా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. రైతు సమస్యలపై, సంక్షేమంపై అవగాహనతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పనిచేస్తున్నారు. ఫోటోల కోసం ఫోజులు ఇస్తూ, వాటిని పేపర్లో చూసుకుంటూ మురిసిపోవడం తప్ప మాజీ ఎమ్మెల్యే రవిశంకర్కు ఏమి చేతకాదు అని నిరూపితం కావడంతోనే, చొప్పదండి నియోజకవర్గం ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. ఇప్పటికైనా అబద్ధపు ప్రచారం మానుకోవాలని లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బసి బుచ్చన్న,జాగిరపు శ్రీనివాస్ రెడ్డి,బూర్గు గంగన్న, దోర్నాల శ్రీనివాస్ రెడ్డి,రోమాల రమేష్, సాగి అజయ్ రావు,వేముల అంజి,మంత్రి మహేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాలు కోసం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-16T155338.351-1.wav?_=9

 

తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాలు కోసం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ మా కళ్ళ ముందే కర్ణాటకకు నారింజ నీళ్లు ప్రవహిస్తున్నాయి మా జహీరాబాద్ నీళ్లు మేము నిలబెట్టుకోలేని దుస్థితి మా సొంత రాష్ట్రంలో కూడా నారింజ ప్రాజెక్టు పునరుద్ధరణ మరియు నిర్మాణానికి పడని అడుగులు జహీరాబాద్ ప్రాంత ప్రజలు కోసం నారింజకు లోతైన పూడిక తొలగించి, ప్రాజెక్టును పునర్నిర్మిస్తే, జహీరాబాద్‌లో కురిసిన ప్రతి నీటి చుక్క జహీరాబాద్ ప్రాంత వ్యవసాయ రైతన్నలకు సాగునీటి సమస్యలను పరిష్కరిస్తుంది.

 

తెలంగాణ తెచ్చుకున్నదే మన నీళ్లు మనకు కావాలని, కళ్ళముందే మన జహీరాబాద్ ప్రతి నీటి బొట్టు పక్క రాష్ట్రానికి పారిపోతుంటే దుఃఖం వస్తుంది.మా జహీరాబాద్‌లోని ప్రతి నీటి చుక్క పొరుగు రాష్ట్రానికి పారుతుండటం విచారకరం కనీసం ఇప్పుడైనా, జహీరాబాద్ ప్రాంత ప్రజాప్రతినిధులు, పార్టీలకు అతీతంగా ఐక్యంగా, ఒక ఉద్యమంగా, నారింజ ప్రాజెక్టు పునర్నిర్మాణమై, ద్వారా, జహీరాబాద్ నియోజకవర్గాన్ని సింగూరు ప్రాజెక్టు లాగా నిర్మాణం జరిగి జహీరాబాద్ భూమిని పచ్చని వనంల మారాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు.

కార్యకర్తలను గెలిపించడమే ఝాన్సీ,యశస్విని రెడ్డి లక్ష్యం

కార్యకర్తలను గెలిపించడమే ఝాన్సీ,యశస్విని రెడ్డి లక్ష్యం
-కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు పెదగాని సోమయ్య

తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి

 

 

 

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రజా ప్రతినిధులుగా చేయడమే ఝాన్సీ యశస్విని రెడ్డి లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గం సీనియర్ నాయకులు పెదగాని సోమయ్య అన్నారు. గురువారం డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు నాయకులను ఝాన్సీ యశస్విని రెడ్డిలు గుర్తిస్తారని అన్నారు. కాంగ్రెస్ పథకాలను ప్రజల్లో తీసుకుపోయి ప్రచారం చేయాలని అన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని ఎలా గెలిపించారో రాబోయే ఎన్నికల్లో వారు కష్టపడి కార్యకర్తలను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాల కోసమే నిరంతరం ప్రజల మధ్యలో ఉండి సేవలందించి అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ఝాన్సీ యశస్విని రెడ్డిలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ జెండాకు అండగా ఉన్నారని, పార్టీ లైన్ దాటిన వారిపై చర్యలు తీసుకుంటారని అన్నారు. పాలకుర్తిలో 40 ఏళ్ల చరిత్రను తిరగరాసిన వ్యక్తులపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణ కోసం ఎంతమంది బలైన కాంగ్రెస్ పార్టీ గుర్తించి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఇచ్చిందన్నారు. రాజీవ్ గాంధీ కంప్యూటర్ యుగాన్ని తీసుకొచ్చి లక్షలాది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని అన్నారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశాడని అన్నారు.గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు ఉంటుందని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలను గెలిపించేందుకు ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, ఎస్టి సేల్ మండల అధ్యక్షుడు జాటోత్ రవి నాయక్, నాయకులు అలువాల సోమయ్య, బిజ్జాల అనిల్, గోపి నాయక్, సురేందర్ నాయక్, పరశురాములు, రమేష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

ఎంపిడివో గా భాద్యతలు స్వీకరించిన

ఎంపిడివో గా భాద్యతలు స్వీకరించిన పసరగొండ రవి .

నల్లబెల్లి, నేటి ధాత్రి:

మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పసరగొండ రవి శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు గతంలో విధులు నిర్వహించిన నరసింహమూర్తి ఇటీవల పదవి విరమణ పొందడంతో ఆయన స్థానంలో ఎంపీ ఓ గా బాధ్యతలు నిర్వహిస్తున్న రవికి ఎంపీడీవో గా బాధ్యతలు నిర్వహించేందుకు అధికారులు ఆదేశాలు జారీ చేయగా. బాధ్యతలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా కార్యాలయ సూపర్డెంట్ ఎండి అబిద్ అలీ, సీనియర్ అసిస్టెంట్ శారదామని, నూతన బాధ్యతలు చేపట్టిన రవికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ శైలజ, పరంజ్యోతి, టైపిస్ట్ గంగాధర్, ఈ పంచాయతీ ఆపరేటర్ రఘువరన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయండి.

అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయండి.

⏩సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి

⏩పారిశుద్ధ్యం,తాగునీటి, విద్యుత్ సరఫరా పై ప్రత్యేక అధికారులు దృష్టి సారించాలి.

రేవూరి ప్రకాష్ రెడ్డి
పరకాల శాసనసభ్యులు.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-02T143438.123.wav?_=10

కాశిబుగ్గ నేటిధాత్రి.

పరకాల నియోజకవర్గంలో 15 16 17 వ డివిజన్ లలో పలు అభివృద్ధి పథకాల కింద చేపట్టి కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని స్థానిక శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అధికారులను ఆదేశించారు.నియోజకవర్గం పరిధిలోని 15,16,17 డివిజన్ల పురోభివృద్ధిపై నగర మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ భాజ్ పాయి లతో కలిసి బల్దియాలోని మేయర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.15,16,17 డివిజన్లలో అభివృద్ధి పనుల పురోగతి,పారిశుద్ధ్యం నిర్వహణ,మంచినీటి, విద్యుత్ సరఫరాకు సంబంధించిన పలు సమస్యలపై సమీక్షించడం జరిగింది.
⏩ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ

సాధారణ నిధులు,15వ ఆర్థిక సంఘం నిధులు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్,స్టాంప్ డ్యూటీ నిధులతో మూడు డివిజన్లో సుమారు 727 లక్షల రూపాయలతో 32 అభివృద్ధి పనులు చేపట్టగా అందులో దాదాపు కోటి రూపాయల వ్యయంతో 18 పనులు పూర్తి కాగా,కోటి రూపాయల వ్యయంతో కొనసాగుతున్న రెండు అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయని, మిగిలిన పనులకు వెంటనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ప్రారంభించాలన్నారు.
వర్షాకాలం నేపథ్యంలో ప్రణాళిక బద్ధంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు జరగాలని,మురుగు కాలువలలో పూడికలు తీయడంతోపాటు,చెత్త సేకరణ,ఫాగింగ్,బ్లీచింగ్ పౌడర్ చల్లడం, దోమలు ప్రబలకుండా ఆయిల్ బాల్స్ వేయడం జరగాలన్నారు.డివిజన్లలోని కొన్ని ప్రాంతాల్లో తక్కువ నీటి ప్రెషర్ వల్ల నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని, ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలన్నారు.స్వచ్ఛమైన మంచి నీటిని అందించుటకు ట్యాంకులు ఎప్పటికపుడు శుభ్రం చేస్తూ వాటి వివరాలు ఆయా ట్యాంకులపై ప్రదర్శించాలన్నారు.గాడిపల్లి లో మంచినీటి పైప్ లైన్ సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బల్దియాకు సంబంధించిన వార్డ్ ఆఫీసర్,పారిశుద్ధ్య, మంచినీటి సరఫరా,విద్యుత్ అధికారుల ఫోన్ నంబర్లు, బల్దియా టోల్ ఫ్రీ నెంబర్లు
మూడు డివిజన్లోని ఈ 11 గ్రామాల కూడలిల గోడలపై ప్రదర్శించాలని,ఏమైనా సమస్య ఉత్పన్నమైతే ఆయా ప్రాంతాల ప్రజలు అధికారులను సంప్రదించి పరిష్కరించుకోవచ్చునని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై ఎమ్మెల్యే సమీక్షిస్తూ 404 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించగా అందులో 296 మంది లబ్ధిదారులకు మంజూరు చేయగా,మిగిలిన 108 ఇళ్లను త్వరితంగా లబ్ధిదారులకు అందజేయాలన్నారు.
ధర్మారంలో మహిళల కొరకు నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటుకు వేగవంతంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం గ్రేటర్ వరంగల్ లోని 66 డివిజన్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇంచార్జ్ ఎస్ ఈ మహేందర్ వివరించారు.ఈ సమావేశంలో అదనపు కమిషనర్ జోనా, ఎం హెచ్ ఓ డాక్టర్ రాజారెడ్డి, ఇంచార్జ్ ఎస్ ఈ, సి పి లు మహేందర్, రవీందర్ రాధాకర్, ఉప కమిషనర్ ప్రసన్న రాణి, ఇంజనీరింగ్, పారిశుద్ధ్య, ఎలక్ట్రికల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

గత బీఆర్‌ఎస్ పాలన గిరిజనుల అభివృద్ధికి అడ్డుపడింది..

గత బీఆర్‌ఎస్ పాలన గిరిజనుల అభివృద్ధికి అడ్డుపడింది

వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య

వర్ధన్నపేట,(నేటిధాత్రి):
వర్ధన్నపేట మండల కేంద్రంలో ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు &వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య,మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యం, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అబిడి రాజ్ రెడ్డి,జిల్లా సీనియర్ నాయకులు పోషాల వెంకన్నగౌడ్ లు విలేఖర్లతో మాట్లాడుతూ.
గత బి.ఆర్.ఎస్ పాలనలో హరిజన – గిరిజనులపై దాడులు జరిగినవి ఎస్టీ సంక్షేమ అభివృద్ధి కోసం పది సంవత్సరాల కాలములో ఒక్క పైసా కూడా ఖర్చు చేయలే,ఎస్సీ -ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి హరిజన ,గిరిజన కాలనీ, గూడలా లో అభివృద్ధి చేస్తే గత బి.ఆర్.ఎస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దుర్వినియోగం చేసి ఎస్సీ, ఎస్టీ కాలాని, గూడ లలో ఒక్క పైసా పనికూడా చేయలేదు తండాలు గ్రామ పంచాయతీలు గా ఏర్పాటు అయితే బి.ఆర్. ఎస్ పాలనలో పంచాయతీ కార్యాలయా లు కట్టించ లే,అక్కడ ఏలిన సర్పంచ్ లకు నిధులు ఇవ్వలేదు, నిధులు ఇవ్వక పోయే సరికి ఆత్మహత్య లు చేసుకోవడం జరిగింది.ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు గిరిజనుల సంక్షేమ ము కోసం 17,169 కోట్లు కేటాయించి మూత వేయబడ్డ కార్పొరేషన్ ,తెరిపించి ,గిరిజన యునివర్సిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది,గత బి.ఆర్.ఎస్ పాలనలో సమగ్ర సర్వే చేసి బయట పెట్టకుండా దాస్తే,కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుల గణన విషయంలో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నది. కులగణన ద్వారా భవిష్యత్ లో ఎస్టీ,ఎస్సీ,బిసి, మైనార్టీ వర్గాల ప్రజలకు ఉపయోగ కారంగా ఉంటుంది.కనీసం గిరిజన యునివర్సిటీ కట్టని చరిత్ర బి.ఆర్.ఎస్ పార్టీ ది.
బిసి లుగా కోన సాగిన గిరిజనులను ఎస్టీ జాబితాలో చేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ది,1975 లో గిరిజనులకు వ్యవసాయ భూములు ఇచ్చి,ఇండ్ల ప్లాట్లు ఇచ్చి ఇండ్లు కట్టించింది, వ్యవసాయం చేసుకోవడం కోసం బ్యాంకులను జాతీయం చేసి పెట్టుబడులు కల్పించింది కాంగ్రెస్ పార్టీ,పోడు భూముల కోసం 1/70 యాక్ట్ చట్టం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది,గిరిజనుల కోసం కాంగ్రెస్ పాటుపడింది,మరి గిరిజనుల కోసం బి.ఆర్.ఎస్ పార్టీ ఏమి అభివృద్ధి చేసిందో గమనించాలని గిరిజన సోదరులను కోరుచున్నాం.

మున్సిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం….

మున్సిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం….

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, టీపీసీసీ సభ్యులు రఘునాథరెడ్డి

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 17 వ వార్డ్ విద్యానగర్ ఏరియాలో 4.75 లక్షల డిఎంఎఫ్టీ నిధులతో 92 మీటర్ల సిసి రోడ్డు పనులకు గురువారం రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, టిపిసిసి సభ్యులు రఘునాథరెడ్డి లు భూమి పూజ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. 17వ వార్డు అభివృద్ధి కోసం 25 లక్షల నిధులతో డ్రైనేజీ, సిసి రోడ్డు పనులను చేయించడం జరుగుతుందని తెలిపారు.బడ్జెట్ లేని కారణంగా పనులు ఆలస్యం అయ్యాయని అన్నారు. ఇకనుండి అభివృద్ధి పనులు ఆలస్యం కాకుండా స్థానిక ఎమ్మెల్యే, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రత్యేక చొరవ తీసుకొని మున్సిపాలిటీ అభివృద్ధికి 15 కోట్ల తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులను విడుదల చేయించారని త్వరలోనే పనులు సైతం ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రామకృష్ణ, రవీందర్, వెంకటేష్ కిష్టయ్య, రాజయ్య, కళ్యాణ్, కనకరాజు, వేణు, రమేష్, విజయ, పుష్ప, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

అట్టడుగు వర్గాల అభివృద్దే ఎమ్మెల్యే దొంతి లక్ష్యం.

అట్టడుగు వర్గాల అభివృద్దే ఎమ్మెల్యే దొంతి లక్ష్యం

దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ గౌడ్

ఎమ్మార్వో,ఎంపిడిఓ కలిసిన కాంగ్రెస్ శ్రేణులు

నర్సంపేట,నేటిధాత్రి:

అట్టడుగు వర్గాల అభివృద్ధి లక్ష్యంగా దొంతి మాధవరెడ్డి పనిచేస్తున్నారని దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ అన్నారు. దుగ్గొండి మండల కేంద్రంలో తహశీల్దార్ రాజేశ్వర్ రావు,ఎంపిడిఓ అరుంధతి,ఎస్సై రావుల రణధీర్ రెడ్డితో పాటు పలువురు అధికారులకు బుదవారం మండల అధ్యక్షుడు చుక్క రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో మండల కమిటీ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానించారు.

Congress ranks meet MRO, MPDO

అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చుక్క రమేష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను నియోజకవర్గంలో ప్రతి గడపగడపకు తీసుకెళ్తూన్నా ప్రజా నాయకుడు దొంతి మాధవ రెడ్డి అని అన్నారు. పేదోళ్ళ సొంతింటి కల నెరవేర్చేందుకుగాను ఇందిరమ్మ ఇండ్లను ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల పాలనలో నియోజకవర్గంలో రేషన్ కార్డ్ ఇవ్వలేదని,నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేషన్ కార్డులు ఇంచ్చిందన్నారు.దేశంలో ఎక్కడలేని విధంగా ఉచిత రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తూన్నా ఘనత రాష్ట్ర ప్రభుత్వందే అని పేర్కొన్నారు.రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త క్షేత్రస్థాయిలో సమిష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అజ్మీరా రవీందర్, ఉపాధ్యక్షులు నల్ల వెంకటయ్య, కామ శోభన్ బాబు,కోశాధికారి జంగిలీ రవి,మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కొమ్మ లక్ష్మయ్య,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్తకొండ రవివర్మ,మాజీ ఎంపిటిసి సభ్యులు బొల్లపెల్లి రాము,నియోజకవర్గ యూత్ నాయకులు డ్యాగం శివాజీ,గిన్నె స్వామి, విరాట్, రాజేశ్వర్ రావు,తదితర మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

క్రీడ‌ల అభివృద్ధికి కూట‌మి ప్ర‌భుత్వం కృషి..

*క్రీడ‌ల అభివృద్ధికి కూట‌మి ప్ర‌భుత్వం కృషి..

*అమరావ‌తిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు త్వ‌ర‌లోనే శంకుస్థాప‌న‌..

*ఏపీ స్టేట్ బ్యాడ్మింట‌న్ ఛాంపియ‌న్‌షిప్ ప్రారంభోత్స‌వంలో శాప్ ఛైర్మ‌న్ ర‌వినాయుడు.

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-30T133904.551.wav?_=11

తిరుప‌తి(నేటి ధాత్రి) జూలై 30:

ఆనాడైనా ఈనాడైనా క్రీడ‌ల అభివృద్ధికి సీఎం చంద్ర‌బాబునాయుడు క‌ట్టుబ‌డి ప‌నిచేస్తున్నార‌ని, ఆయ‌న నేతృత్వంలో క్రీడ‌ల బ‌లోపేతానికి కూట‌మి ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని శాప్ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు అన్నారు. తిరుప‌తిలోని శ్రీ శ్రీ‌నివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో చిత్తూరు డిస్ట్రిక్ట్ బ్యాడ్మింట‌న్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఈనెల 29 నుంచి 31వ తేదీ వరకూ నిర్వ‌హిస్తున్న ఏపీ స్టేట్ బ్యాడ్మింట‌న్ ఛాంపియ‌న్‌షిప్‌-2025(సీనియ‌ర్ మెన్ అండ్ ఉమెన్‌) పోటీల‌ను మాజీ శాస‌న స‌భ్యురాలు సుగుణ‌మ్మతో
ఆయ‌న కలిసి ప్రారంభించారుతొలుత ప‌లు జిల్లాల నుంచి వ‌చ్చిన క్రీడాకారుల‌ను ప‌రిచ‌యం చేసుకుని వారితో బ్యాడ్మింట‌న్ ఆడి పోటీల‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన ప్రారంభోత్స‌వ స‌భ‌లో క్రీడాకారుల‌ను ఉద్దేశించి ఆయ‌న ప్ర‌సంగించారు. సీఎం చంద్ర‌బాబునాయుడు మొద‌టి నుంచి క్రీడ‌ల‌కు అధిక ప్రాధాన్యత‌ క‌ల్పిస్తున్నార‌న్నారు. త్వ‌ర‌లోనే అమ‌రావ‌తిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ముఖ్య‌మంత్రి శంకుస్థాప‌న చేస్తార‌ని వివ‌రించారు. టీటీడీ, శాప్ నిధుల‌తో ఆనాడే శ్రీ శ్రీ‌నివాస స్పోర్ట్స్ కాంప్లెక్సును ఆయ‌న నిర్మించార‌న్నారు. ఏపీ నుంచి అంత‌ర్జాతీయస్థాయి క్రీడాకారుల‌ను త‌యారుచేయాల‌నే సంక‌ల్పంతో అంత‌ర్జాతీయ క్రీడాకారుల‌కు స్థ‌లాలనిచ్చి అకాడ‌మీల స్థాప‌న‌ల‌కు కృషి చేసిన వ్య‌క్తి చంద్ర‌బాబు నాయుడని కొనియాడారు. గత ముప్పై ఏళ్లుగా బ్యాడ్మింట‌న్ అసోసియేష‌న్, ఫెడ‌రేష‌న్లు స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తూ బ్యాడ్మింట‌న్ క్రీడ‌ను ముందుకు తీసుకెళ్ల‌డం ప్ర‌శంస‌నీయ‌మ‌న్నారు. రాష్ట్ర‌వ్యాప్తంగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ క్రీడాస‌దుపాయాల క‌ల్ప‌న‌కు సీఎం కృషి చేస్తున్నార‌న్నారు. అత్యుత్త‌మ క్రీడా విధానాల‌ను రూపొందించి అమ‌లు చేస్తున్నార‌న్నారు. అనంత‌రం తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గ మాజీ శాస‌న స‌భ్యురాలు సుగుణ‌మ్మ మాట్లాడుతూ ఏపీలో క్రీడాభివృద్ధికి సీఎం చంద్ర‌బాబునాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, విద్యాశాఖామంత్రి నారా లోకేష్‌లు అపార‌మైన కృషి చేస్తున్నారన్నారు. అలాగే రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ల్పిస్తున్న క్రీడాస‌దుపాయాలు, క్రీడా ప్రోత్సాహ‌కాల‌ను స‌ద్వినియోగం చేసుకుని క్రీడాకారులు భ‌విష్య‌త్తులో మ‌రింత మెరుగ్గా రాణించాల‌ని సూచించారు. సీఎం చంద్ర‌బాబు ఆశ‌యాల‌కు అనుగుణంగా క్రీడాంధ్ర‌ప్ర‌దేశ్ సాధ‌న‌కు ప్ర‌తీ ఒక్క‌రూ కృషి చేయాల‌ని వెల్ల‌డించారు. ఈ కార్య‌క్ర‌మంలో డీఎస్డీఓ శ‌శి, బ్యాడ్మింట‌న్ అసోసియేష‌న్ స‌భ్యులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version