ఎంజీఎం హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యుడిగా సయ్యద్ మోసిన్
వరంగల్ తూర్పు నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద హాస్పిటల్ అయిన, ఎంజీఎం హాస్పిటల్ నూతన డెవలప్మెంట్ కమిటీ శుక్రవారం హాస్పిటల్ ఆవరణలో ప్రమాణ స్వీకారం చేశారు. ఎంజీఎం హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యుడిగా వరంగల్ నగరం 25వ డివిజన్ కు చెందిన సయ్యద్ మోసిన్ నియామకం అయ్యారు. శుక్రవారం రోజు ఎంజిఎం హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యుడిగా మోసిన్ ఎంజీఎం ఆస్పత్రి లో ప్రమాణ స్వీకారం చేశారు. తనకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు గోపాల్ నవీన్ రాజ్, స్థానిక కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంజీఎం డెవలప్మెంట్ కమిటీ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సయ్యద్ మోసిన్ ను స్థానిక కాంగ్రెస్ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
సమాజ అభివృద్ధిలో కార్మికులదే కీలకపాత్ర -మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల
రామడుగు నేటిధాత్రి:
సమాజాభివృద్ధిలో కార్మికులదే కీలకపాత్రాని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేని తిరుమల తిరుపతి ముదిరాజ్ అన్నారు. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కార్మికుల చేత జెండా ఎగర వేయించారు. అనంతరం కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలిపి వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా చెర్మెన్ మాట్లాడుతూ కార్మికుల శ్రమకు గౌరవం కల్పించడమే మే డే ఉద్దేశమని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం కోసం మార్కెట్ కమిటీ ఎల్లప్పుడూ అంకిత భావంతో పనిచేస్తుందని తెలిపారు. ఈకార్యక్రమంలో వైస్ చైర్మన్ పిండి సత్యం రెడ్డి, డైరెక్టర్లు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అభివృద్ధి అనేది కలిసికట్టుగా పనిచేస్తే సాధ్యమవుతుంది
కేసముద్రం మండల షాదీ ఖానా కమిటీ కి సన్మానం
వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి
కేసముద్రం/ నేటి దాత్రి:
మంగళవారం వ్యవసాయ మార్కెట్ కార్యాలయము లో ముస్లిం మండల షాదీ ఖానా కమిటీ నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది, నూతనంగా ఏర్పడ్డ షాది ఖానా మండల నూతన కమిటీ సభ్యులు మరియు ముస్లిం సోదరులు పెద్దలు కలిసికట్టుగా మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అనంతరం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు, డైరెక్టర్లు సంకేపల్లి నారాయణరెడ్డి, చిదురాల వసంతరావు, ఆ యూబ్ ఖాన్, ఆర్టిఏ మెంబర్ రావుల మురళి, నూతన షాది ఖానా మండల కమిటీ అధ్యక్షులు మహమ్మద్ రజాక్, ఎండి రఫీ, తాజుద్దీన్, లను మరియు కమిటీ సభ్యులను శాలువాతో సత్కరించి షాది ఖానా కమిటీకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అనంతరం మార్కెట్ చైర్మన్ మాట్లాడుతూ కేసముద్రం మండల ముస్లిం సోదరులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని షాదీ ఖానా ఏర్పాటు కొరకు 80 లక్షల రూపాయలు మంజూరు చేయుటకు ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఎంతో కృషి చేశారని వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. అలాగే షాదీ ఖానా అభివృద్ధి కొరకు ఇంతటితో సరిపోదని ఇంకా మునుముందు సహాయ సహకారాలు ఉంటాయని 80 లక్షల రూపాయల నిధితో షాది ఖానా ఏర్పాటు చేయడం నిధి సరిపోకపోతే మరల కొంత నిధులు మంజూరు చేయించడం కోసం కృషి చేస్తామని అన్నారు. అలాగే కేసముద్రం మండలంలోని ముస్లిం సోదరులు అందరూ ఏకతాటిపై ఉండి షాదీ ఖానా అభివృద్ధి కొరకు పాటుపడాలని, ముస్లిం సోదరులు అందరూ సమైక్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని హితువు పలికారు. ముస్లింలలో చాలావరకు నిరుపేద కుటుంబాలే ఉన్నాయని అలాంటి నిరుపేద కుటుంబాలు శుభకార్యాలు చేసేవారికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ షాదీ ఖానా ఏర్పాటు అనంతరం అందరికీ అందుబాటులో వస్తుందని ఎవ్వరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవద్దని ఈ షాదీ ఖానా అందరికీ ఉపయోగపడుతుందని ఈ అవకాశాన్ని అందరూ కలిసికట్టుగా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కూరెల్లి సతీష్. ముదిగిరి సాంబయ్య. షాదీఖానా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
గణపురం మండల కేంద్రంలో కోటగుళ్ల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని దేవదాయ శాఖ డివిజనల్ ఇన్స్పెక్టర్ నందనం కవిత అన్నారు. గురువారం ఆమె సిబ్బందితో కలిసి కోట గుళ్ళ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వహణ విషయమై కోటగుళ్లు పరిరక్షణ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాబోయే రోజుల్లో 43 సెక్షన్ కింద కోట గుళ్ళు దేవాలయం పేరున రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందన్నారు. దీంతో ఆలయం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా అన్నారు. ఆలయ నిర్వహణ పూర్తిగా కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలోనే కొనసాగుతుందని ఇందులో తమకు ఎలాంటి ప్రమేయం ఉండదని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిడిఎన్ అర్చక సంఘం రాష్ట్ర క్రమశిక్షణ సంఘం కార్యదర్శి కర్నే సాంబయ్య, డిడిఎన్ అర్చక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మహదేవ్,జిల్లా కోశాధికారి సాంబశివుడు, అర్చకులు గురు మూర్తి, చంద్రశేఖర్, రాజు, కోటగుళ్లు పరిరక్షణ కమిటీ గౌరవ అధ్యక్షులు, మామిండ్ల మల్లికార్జున గౌడ్, సభ్యులు నాగపురి శ్రీనివాస్ గౌడ్, రౌతు కిషోర్, గొర్రె ఎల్లయ్య యాదవ్ చిలువేరు ఉదయాకర్, కొయ్యల గౌతమ్ గౌడ్, సామర్ల నాగరాజు, కొయ్యల రమేష్, , తోట నవీన్, బాలాజీ నవీన్, పెద్ది ప్రశాంత్,ఆరెల్లి ఓంకార్, శంకర్ అంజి, పుప్పాల దీపక్, ఆనంద వర్ధన్, నల్లగొండ రాజు , గణేష్ ,వంశీ తదితరులు పాల్గొన్నారు.
*ఈ- వేస్ట్ ను ఇవ్వండి – నగర అభివృద్ధికి సహకరించండి…
కమిషనర్ ఎన్.మౌర్య..
తిరుపతి(నేటి ధాత్రి) ఏప్రిల్ 19:
ప్రమాదకరమైన ఎలక్ట్రానిక్ వేస్ట్ తమకు అందజేసి నగర శుభ్రతకు సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అన్నారు. స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర లో భాగంగా శనివారం ఈ-వేస్ట్ సేకరణ, నిర్వహణపై నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మునిసిపల్ కార్యాలయం నుండి శ్రీదేవి కాంప్లెక్స్ వరకు సాగిన ఈ ర్యాలీ ని కమిషనర్ ఎన్.మౌర్య, శాప్ చైర్మన్ రవి నాయుడు, యాదవ కార్పొరేషన్ అధ్యక్షుడు నరసింహ యాదవ్, ఏపీఎంఐడిసి డైరెక్టర్ విజయకుమార్, డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్.సి.మునికృష్ణకార్పొరేటర్ నారాయణ, అధికారులు పాల్గొని ర్యాలీని ప్రారంభించి పాల్గొన్నారు. An e-waste collection program was organized at Sridevi Complex. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్. మౌర్య మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా జనవరి నెలలో పరిశుభ్రత పచ్చదనం, ఫిబ్రవరి నెలలో వేర్వేరుగా చెత్త సేకరణ,మార్చిలో ప్లాస్టిక్ నియంత్రణ థీమ్ తో ప్రజల్లో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు.ఏప్రిల్ నెలలో ఈ-వేస్ట్ నియంత్రణ థీమ్ తో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించామని అన్నారు.
Development
ఎలక్ట్రిక్ దుకాణాల వద్ద వేస్ట్ సేకరించామని అన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆర్ఆర్ఆర్ సెంటర్ ను న్యూ బాలాజి కాలనీలోని అన్నా క్యాంటీన్ సమీపంలో ఏర్పాటు చేశామని ఈ-వేస్ట్ ను అక్కడ ఇవ్వ వచ్చునని అన్నారు. అలాగే అన్ని సచివాలయాల వద్ద కూడా ఇవ్వవచ్చునని తెలిపారు. ఇలా సేకరించిన వేస్ట్ ను సురక్షితంగా రీ సైకిల్ చేస్తామని అన్నారు. ప్రజలు ఈ-వేస్ట్ ను మీ ఇంటి వద్దకు వచ్చే మా సిబ్బందికి కూడా అందించవచ్చునని తెలిపారు. శాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. జన్మభూమి, పరిసరాల పరిశుభ్రత వంటి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు.ఈ వేస్ట్ వలన కాలుష్యం పెరుగుతోందని దీన్ని నియంత్రించేందుకు ప్రత్యేక కార్యక్రమం రూపొంచించారని అన్నారు. ఇందులో అందరూ భాగస్వాములై ఎలక్ట్రానిక్ వ్యర్థాల నియంత్రణకు సహకరించాలని అన్నారు. స్వచ్ఛ తిరుపతి సాధనకు అందరూ సహకరించాలని అన్నారు. యాదవ కార్పొరేషన్ అధ్యక్షుడు నరసింహ యాదవ్, ఏపీఎంఐడిసి డైరెక్టర్ విజయకుమార్, డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్.సి.మునికృష్ణ మాట్లాడుతూ నగరం సుందరంగా, పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి బాధ్యత అన్నారు. చెత్తను రోడ్లపై వేయకుండా, తడి, పొడి చెత్త గా వేరు చేసి నగరపాలక సంస్థ సిబ్బందికి అందించి నగర శుభ్రత కు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఈ-వేస్ట్ అందించిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, మేనేజర్ హాసీమ్, సర్వేయర్ కోటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు…
కొమ్మాల జాతర విజయవంతం…అధికారులను అభినందించిన ఎమ్మెల్యే.
వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:
గీసుకొండ మండలంలోని కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం జాతర అభివృద్ధికి అన్ని విధాలుగా కృషిచేస్తానని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి హామీ ఇచ్చారు.గత నెల నుండి ఏప్రిల్ మొదటివారం వరకు కొమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలు,జాతర నిర్వహణ విజయవంతంగా ముగిసింది.అలాగే దేవాలయం ప్రాంగణం వద్ద ప్రతీ శనివారం నిత్య అన్నదాన కార్యక్రమం దాతల సహకారంతో చేపట్టిన నేపథ్యంలో మహా అన్నప్రసాద వితరణ దాతగా దేవాలయ మాజీ చైర్మన్ వీరాటి రవీందర్ రెడ్డి స్వర్ణలత దంపతులు ఉన్నారు.కాగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి శనివారం దేవాలయం వద్ద అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు.ముందుగా దేవాలయం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని దేవాలయ ఈవో నాగేశ్వర్ రావు, ఆలయ అర్చకులు రామాచారి, ఫౌండర్ శ్రీనివాస చార్యులు సాంప్రదాయ పద్ధతులతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు.అంతకుముందు ఆలయ అర్చకులు దేవాలయ దాతలు,మాజీ చైర్మన్,ప్రతినిధులతో కలిసి గోశాల వద్ద గోమాత పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం జాతర పట్ల మండపాల ఏర్పాట్ల కోసం,అలాగే పరిసర ప్రాంతాలు రోడ్డు రవాణా మౌలిక సదుపాయాల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.అన్నిశాఖల అధికారులు,సిబ్బంది, ప్రజాప్రతినిధుల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో జాతర జరుపుకున్నామని పేర్కొన్నారు.అనంతరం జాతర విజయవంతం చేసిన సందర్భంగా దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నాగేశ్వర్ రావు,మామునూరు ఏసిపి తిరుపతి,సీఐ మహేందర్,ఎస్సై కుమార్,ప్రశాంత్ పలువురు అధికారులు,ప్రజా ప్రతినిధులను, పోలీస్ శాఖ అధికారులను,దాతలు,ప్రతినిధులకు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అభినందనలు తెలిపి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పరకాల అధికార ప్రతినిధి చాడ కొమరారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మలపెల్లి అధ్యక్షుడు శ్రీనివాస్, ఆలయ ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ కడారి రాజు మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్య గౌడ్ ,ఆలయ పౌండర్ శ్రీనివాసచార్యులు,అర్చకులు విష్ణు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సాయిలి ప్రభాకర్, మండల అధ్యక్షులు,మండల మహిళా అధ్యక్షురాలు జక్కుల సరిత, మండల సమన్వయ కమిటీ అధ్యక్షులు దూలం వెంకన్న, జావిద్,గోదాసి చిన్న,సంగెం మాజీ జెడ్పీటీసీ వీరమ్మ,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కూస రమేష్ ,కొమ్మాల తాజా మాజీ ఎంపీటీసీ గోపాల్ ,ఉత్సవ కమిటీ మాజీ సభ్యులు లావుడ్యా రాజన్న, కోల వేణు , కేలోత్ జైత్రాం,మర్రి రాజలింగం,భూక్యా రాంబాబు,వాంకుడోత్ సెల్వా, లడే రాజేశ్వర్ రావు,మండల నరేష్,ఇమ్మడి సమ్మయ్య,బోయపాటి శ్రీదేవి,యార రాజయ్య,నాగారపు సుమలత పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
అందరిపైనా ఆంజనేయ స్వామి కృపా కటాక్షం ఉండాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. హనుమాన్ జయంతి సందర్భంగా.. మహబూబ్ నగర్ పట్టణంలోని అప్పన్నపల్లి ఆంజనేయ స్వామి దేవాలయం లో జరిగిన హనుమాన్ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ ప్రజలంతా సుఖసంతోషాలతో ఆకాంక్షించారు. ఎంతో పురాతనమైన ఆంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే వేద ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, నాయకులు గుండా మనోహర్, శివశంకర్, రామాంజనేయులు , హరిబాబు , రామకృష్ణ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ నియోజకవర్గం హన్వాడ మండలంలోని టంకర, వేపూర్ గ్రామాల్లో MGNREGA పథకం క్రింద రూ.44.50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్ ను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామానికి రోడ్లు, రవాణా, కమ్యునికేషన్, ఆరోగ్య సదుపాయాలు, విద్యాసంస్థలు, విద్యుత్ ఏర్పాటు వంటివి గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన చాలా ముఖ్యం అని ఎమ్మెల్యే అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మహబూబ్ నగర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
మహ్మద్ ఖాన్ పల్లి తాండా సమస్యలు తీరుస్తానని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. మహబూబ్ నగర్ నగరపాలక పరిధిలోని మహ్మద్ ఖాన్ పల్లి తాండా 16వ వార్డులో కొలువైన శ్రీ వీర ఆంజనేయ స్వామి దేవాలయ ఆవరణలో జరిగిన ధ్వజస్థంభం ప్రతిష్టాపన మహోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శ్రీ వీరాంజనేయ స్వామి సంపూర్ణ కటాక్షం గ్రామ ప్రజలందరి పైన ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ గ్రామంలో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయాన్ని అందరం కలిసి అన్నివిధాలా అభివృద్ధి చేసుకుందాం అన్నారు.
MLA
దేవాలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. గ్రామ అభివృద్ధికి గ్రామ ప్రజలంతా కలిసి కట్టుగా ఉండాలని ఆయన సూచించారు. అనంతరం అర్చకులు ఎమ్మెల్యేకు వేద ఆశీర్వాదం అందించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు మోతిలాల్, జాజి మొగ్గ నర్సింహులు, దేవేందర్ నాయక్, అబ్దుల్ హక్, శ్రీనివాస్ యాదవ్, జోజ్య నాయక్ , డి.ఎం.నాయక్, మాజీ ఎంపిటిసి గోపి నాయక్, శరత్ చంద్ర, హన్మంతు నాయక్ , కృష్ణ, కుమార్, రవి నాయక్, శంకర్ నాయక్, గోపాల్, చర్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే నే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి.
సోషల్ మీడియా వేదిక గా ప్రచారం నిర్వహించాలి
మాజీమంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి నేటిదాత్ర
కె.సి.ఆర్ గారి నాయకత్వములో ఏప్రిల్ 27న వరంగల్ లో జరగనున్న బి.ఆర్.ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రన్ని అభివృద్ధి చేశారని మాజి మంత్రి అన్నారు వనపర్తి జిల్లా బీ ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో సమావేశం జరిగింది.ఈ భారీగా వచ్చిన కార్యకర్తలకు నిరంజన్ రెడ్డి గారు దిశ నిర్దేశం చేశారు రజతోత్సవ సభను విజయవంతం చేయుటకు గ్రామగ్రామాన సమావేశాలు సోషల్ మీడియా వేదికగా ప్రచారం నిర్వహించి కార్యకర్తలను,ప్రజలను సమాయత్తం చేయాలని పిలుపునిచ్చారు. 25.సంవత్సరాల బి.ఆర్.ఎస్ ప్రస్థానాన్ని రజతోత్సవ సభ ద్వారా భావితరాలకు స్పూర్తి కలిగించాలని కోరుకున్నారు. తెలంగాణ ఆస్తి కె.సి.ఆర్ అని 14ఏండ్ల ఉద్యమ చరిత్ర,10ఏండ్ల అధికారంలో తెలంగాణ కె.సి.ఆర్ నాయకత్వములో సుభిక్షంగా మారిందని కొంతమది కుట్రలు కుతంత్రాల వల్ల అధికారం కోల్పోయిన ప్రజలలో అభిమానం తగ్గలేదని అధికార కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని కె.సి.ఆర్ విలువ బి.ఆర్.ఎస్ పార్టీ అవసరం ప్రజలకు తెలిసివచ్చింది అని అన్నారు. 20రోజులలో నాయకులు మండల,గ్రామ సమావేశాలు పార్టీ పతాక ఆవిష్కరణ చేసి సభ విజయవంతం చేయుటకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు ఎల్లపుడు ప్రజల మధ్యన ఉండి వారి సమస్యలలో పాలుపంచుకోవాలని అటువంటి నాయకులకే పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. రజతోత్సవ సభ విజయవంతంతో పాటు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు రైతు బంధు రైతు రుణ మాఫీ రైతు భరోస,మహిళలకు 2500,తొలం బంగారం,నిరుద్యోగ భృతి వంటి అంశాలు ప్రజలకు వివరించాలని అన్నారు.రజతోత్సవ సభ విజయవంతంతో రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు వస్తాయని సకల జనులు బి.ఆర్.ఎస్ వైపు చూస్తారని గౌరవ నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఈ సమావేశములో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ పట్టణ అధ్యక్షుడు పలస రమేష్ గౌడ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్,మీడియా కన్వీనర్ నందిమల్ల. అశోక్, చంద్రశేఖర్ నాయక్,కురుమూర్తి యాదవ్, మార్క్ ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్,పార్టీ అధ్యక్షులు పలుస.రమేష్ గౌడ్,దిలీప్ రెడ్డి,వనం.రాములు,రాళ్ళ.కృష్ణయ్య,మాణిక్యం,వేణు యాదవ్,వెంకటస్వామి,మాజీ ప్రజాప్రతినిధులు రఘుపతి రెడ్డి,బోర్ల.భీమయ్య,కృష్ణా నాయక్, లక్ష్మమా రెడ్డి, కర్రేస్వామి, రాజశేఖర్,మాజీ కౌన్సిలర్లు బండారు కృష్ణ, పెండం నాగన్న యాదవ్,ఉంగ్లం. తిరుమల్ నాయుడు ,ప్రేమ్ నాథ్ రెడ్డి,సమద్, స్టార్.రహీమ్,ఇమ్రాన్,హేమంత్ ముదిరాజ్,సూర్యవంశం.గిరి జోహెబ్ హుస్సేన్, చిట్యాల రాము,సునీల్ వాల్మీకి మహిళా నాయకురాలు నందిమల్ల.శారద ,నాగమ్మ,జమ్ములమ్మ, సాయిలీలా,కవితా నాయక్ తదితరులు పాల్గొన్నారని జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ తెలిపారు
మహిళల ఆర్ధిక అభివృద్దే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి అన్నారు. సోమవారం నర్సంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 11 కోట్ల రూపాయల వడ్డీలేని రుణాలు సంబంధించిన చెక్కును అందించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అందజేశారు.
అదే విధంగా వరంగల్ జిల్లాలో 9 ఆర్టీసీ బస్సులు మంజూరు కాగా నర్సంపేట నియోజకవర్గంలో మంజూరైన 6 బస్సులకు మండలానికి ఒకటి చొప్పున ప్రతీ మండల సమాఖ్యకు రూ.30 లక్షల రూపాయలు సబ్సిడీ చెక్కు అందించడం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
MLA
చెన్నరావుపేట మండలంలోని అక్షయ మహిళా రైతు ఉత్పత్తి సంఘానికి మరియు ఖానాపురం భారతీయ మహిళ రైతు ఉత్పత్తి సంఘానికి గోదాంల నిర్మాణం కొరకు ప్రభుత్వం ద్వారా మంజూరైన రూ.30 లక్షల( ఒక్కొకంటి15 లక్షల చొప్పున)చెక్కులను సంఘాల బాధ్యులకు అందిజేసినట్లు పేర్కొన్నారు.2004 లో పావలా వడ్డీ రుణాలు మహిళకు అందించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి నుండి మహిళల అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీర హామీల్లో మొదట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించిందని .ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గుర్తుకు చేశారు.ఈకార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ రేణుకాదేవి,ఆర్డీవో ఉమారాణి, మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, డీపీఎంలో దయాకర్, సరిత, అనిత, అన్ని మండలాల మహిళ సమాఖ్య అధ్యక్షులు,ఏపీఎంలు పాల్గొన్నారు.
ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టడానికి వీలు లేదని,ఎట్టి పరిస్థితుల్లో నిధులు పక్క దారి పట్ట వద్దని , ఎక్కడైనా నిధులు దుర్వినియోగం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటానని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు పర్యటించారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ , సభ్యులు మేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శించుకున్న అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్కు రాగా కలెక్టర్ సాదరంగా స్వాగతించారు. పోలీసు వారి చే గౌరవ వందనం స్వీకరించారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, ఎస్పీ మహేష్ బి.గితే, ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, కుశ్రము నీలాదేవి, రేణిగుంట్ల ప్రవీణ్, జిల్లా శంకర్ లతో కలిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగారాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లాలో 4 వేల 313 ఎకరాలకు సంబంధించి 6029 మంది రైతులు పోడు పట్టాల కోసం దరఖాస్తు చేసుకోగా 1614 మంది రైతులకు 2860 ఎకరాలను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. పెండింగ్ ఆర్.ఓ.ఎఫ్.ఆర్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, అర్హులైన ఎస్టీ రైతులందరికీ పట్టాలు అందాలని 10 రోజులలో సమస్య పరిష్కారం కాకపోతే సంబంధిత అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తామనిఅన్నారు.సబ్సిడీ కింద ప్రభుత్వం మంజూరు చేసే మొత్తం సద్వినియోగం జరిగి యూనిట్లకు గ్రౌండ్ అయ్యే విధంగా ప్రత్యేక చోరువ చూపాలని అన్నారు. జిల్లాలో ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించి చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్ లలో సోలార్ ప్యానల్ ఫెన్సింగ్ ఏర్పాటు ప్రతిపాదనలు 7 రోజుల్లో సిద్ధం చేయాలని, అవసరమైన నిధులు ప్రభుత్వం నుంచి విడుదల అయ్యేలా కృషి చేస్తామని అన్నారు. జిల్లాలో పెండింగ్ ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని,బాధితులకు సత్వరమే న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలనిఅన్నారు. పోలీస్ కేసులకు సంబంధించి కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు కొరకు తహసిల్దార్ ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద ఎస్సీ ఎస్టీలకు 100% పని దినాలు కల్పించాలని, వేసవి దృష్ట్యా పని ప్రదేశాలలో చల్లని త్రాగునీరు, నీడ, ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు.సంక్షేమ హాస్టల్స్ లలో ప్రభుత్వం రూపొందించిన డైట్ మెన్యూ ను తూచ తప్పకుండా పాటించాలనిఅన్నారు. స్వయం ఉపాధి కల్పన పథకం కింద రాజీవ్ వికాసం ద్వారా ఎస్సీ ఎస్టీ యువతకు అర్హత మేరకు రుణాలు అందేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ శాఖలలో ఎస్సీ,ఎస్టీ అధికారులకు రోస్టర్ పాయింట్ ప్రకారం పదోన్నతులు సజావుగా పారదర్శకంగా వచ్చేలా వ్యవహరించాలని,ప్రభుత్వ కార్యాలయాల్లో నియామకాలలో సైతం 15% ఎస్సీలకు రిజర్వేషన్ అమలు చేయాలని అన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యుల సూచనలు, ఆదేశాలను అధికారులు తూచా తప్పకుండా పాటించాలని అన్నారు. సభ్యులు వివిధ అంశాల పై కోరిన సమాచారాన్ని, ప్రతిపాదనలను నిర్దిష్ట సమయంలో అందించాలని అన్నారు. ఎస్సీ,స్టడీ సర్కిల్ కోసం భూమి కేటాయింపు చేయడం జరిగిందని, అక్కడ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని అన్నారు. అనంతరం రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ , సభ్యులను జిల్లా అధికారులు, ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఏ.ఎస్పీ. శేషాద్రిని రెడ్డి, రెవెన్యూ డివిజన్ అధికారీ రాధా భాయి, డిఎస్పీ. చంద్ర శేఖర్ రెడ్డి,జిల్లా అధికారులు, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు,వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
రాబోయే తరానికి స్ఫూర్తి కలిగించేలా అభివృద్ధి పనులు
గ్రామ అభివృద్ధికి పెద్దపీట
గ్రామ అభివృద్ధి కమిటీ- గట్లకానిపర్తి
శాయంపేట నేటిధాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకా నిపర్తి గ్రామంలో రాబోయే తరానికి స్ఫూర్తి కలిగించేలా అభివృద్ధి పనులు చేస్తున్న గ్రామ అభివృద్ధికి పెద్దపీట.
ముళ్ల పొదలు/చెట్ల పొదలు తొలగింపు
శాయంపేట మండలం గట్ల కానిపర్తి నుండి నర్సిరావు పల్లె వెళ్లే రోడ్డు పైకి ఇరువైపులా ఉన్న ముళ్లపదలను/చెట్ల కొమ్మలను స్వచ్ఛందంగా తొలగించడం ద్వారా వాహనదారులకు డ్రైవర్ ముఖ్యంగా పల్లె వెలుగు బస్సు రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చెట్ల కొమ్మలను తొలగించడం జరిగింది. అక్టోబర్ 2 2014 ప్రజలందరూ శ్రమదానం చేయాలని నిర్ణయించడం జరిగింది. ఉదయం నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు శ్రమదానం గ్రామ ప్రజలు చేయడం అభినందన నియ మని కమిటీ పేర్కొన్నారు.
Development
ప్రధాన కూడలిలో డ్రైనేజీలు మరమ్మత్తులు
గట్లకానిపర్తి గ్రామంలో కీర్తిశేషులు నల్లెల్ల మహేందర్ ఇంటి దగ్గర లోని మూల మలుపు వద్ద డ్రైనేజీ ఒక చివర శిథిలమై ఉన్నదానిని వెళుతుంటే ప్రజలకు ఆసౌకర్యంగా ఉన్నదని గుర్తించి ప్రజాక్షేమం దుష్ట ముఖ్యంగా టు వీలర్, వాహనదారులకు, వృద్ధులకు, చిన్న పిల్లలకు ప్రమాదాలు జరగకుండా పారిశుద్ధ కార్యక్రమం ఇట్టి పనిని 13 జనవరి 2025 రోజున ఇట్టి పనిని సందర్భంగా పూర్తి చేయడం జరిగింది గ్రామ అభివృద్ధి కొరకు ముందుకు వచ్చిన దాతలు గ్రామాభివృద్ధి కమిటీ మరియు గ్రామ ప్రజలు అభినందించడం జరిగింది.
Development
వైకుంఠధామానికి విద్యుత్ సౌకర్యం తీసుకురావడం
గట్లకానిపర్తి గ్రామంలో ఉన్న వైకుంఠధామానికి దగ్గర స్నానం చేయడానికి వీలుగా గ్రామ ప్రజలు కొరకు విద్యు త్తును వాడుకునే సౌకర్యం కల్పించడం కోసం దాదాపు ఖర్చు అవుతుందని అంచనా వేసి దాతలు వస్తువులు రూపకంలో మాత్రమే సహకారం అందించాలని కోరారు.తప్పెట్ల పున్నం రాజ్ మాతృభూమి పై ఉన్న మమకారం కోసం తన తండ్రి గారైన తప్పెట్ల భద్రయ్య మీద ఉన్న ప్రేమతో వారి జ్ఞాపకార్థం మన గ్రామ ప్రజల సౌకర్యార్థం సామాజిక సేవ గ్రామ ప్రజల సౌకర్యం ముఖ్యంగా మన ఇంట ఆడబిడ్డల మహిళల ఆత్మగౌధం నిలబడ్డ దానికి సామాజిక సేవా కార్యక్రమంలో దాతగా ముందుకు రావడం జరిగింది దాతలు గ్రామ అభివృద్ధి కమిటీ మరియు గ్రామ ప్రజలు అభినందించడం జరిగింది.
గ్రంథాలయ ఏర్పాటుకు ముందుకు వచ్చిన దాతలు
గట్లకానిపర్తి గ్రామంలో ఏర్పాటు చేయడం గ్రంథాల యం కొరకు వస్తువులు పుస్తకాలు డబ్బాలు ఇవ్వడా నికి ముందుకు వచ్చిన దాతలు అభినందనీయం కనుక గ్రామంలో 2 అక్టోబర్ 2024 నుండి 21 ఫిబ్రవరి 2025 వరకు గ్రంథాలయ ఏర్పాటుకు ముందుకు వచ్చిన దాతలు న్యూటoకి ప్రభాకర్ సీనియర్ జర్నలిస్ట్, భాస్కర్ సహకారం, బొమ్మ కంటి కుమారస్వామి గ్రంథాలయం కొరకు సీలింగ్ ఫ్యాన్స్, బొమ్మ కంటి రాజు రెండు సీలింగ్ ఫ్యాన్స్, పెద్దపల్లి సురేందర్ మహనీయుని కోడలపై అతికించడం, కక్కర్ల భారత్ గౌడ్ సైన్ బోర్డులు ఇస్తానని హామీ, క్రాంతి కుమార్ రంగులు సున్నాలు అయ్యే ఖర్చుకు హామీ,గ్రంథాలయానికి డబ్బులు మరియు దాతలు బొమ్మ కంటి బుచ్చయ్య పెయింటింగ్ ఎలక్ట్రిషన్ వగైరా అయ్యే ఖర్చు చేయడం, బాధ్యత రాజ్యాంగం పుస్తకం బహుకరించిన బొమ్మకంటి శ్యాంసుందర్, గడ్డం వెంకటేశ్వర్లు, కేశవమూర్తి (వరంగల్ వాయిస్ ఎడిటర్) 5000 రూపాయల ఆర్థిక సాయం మరియు 5 వేల రూపాయల విలువగల పుస్తకములు అందజేస్తానని తెలియజేయడం జరిగింది.. ఎండవల్లి స్నేహిత రెడ్డి సాఫ్ట్వేర్ ఆమె అందిస్తానని తెలిపారు బొమ్మ కంటి వెంకటేష్ పుస్తకాల నిమిత్తం 8 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. గ్రంధాలయ నిర్వాహన కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారికి గ్రామ అభివృద్ధి కమిటీ ధన్యవాదాలు తెలియజేశారు ఇంకా రేకులు ఐరన్ పైపులు సిమెంటు సిమెంటు ఇటుకలు కంకర డస్ట్ తలుపులు కిటికీలు ఎలక్ట్రిక్ సహాయం వంటివి అవసరం గ్రామ పెద్దలు మేధావులు ఉద్యోగస్తులు విద్యావంతులు వృత్తిని పనులు యువకులు వ్యాపారస్తులు ఎస్ఎస్సి బ్యాచ్ వాళ్లు అన్ని వర్గాల ప్రజల స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జండా ఏర్పాటుకు సహకరించాలని గట్ల కనపర్తి గ్రామ అభివృద్ధి కమిటీ ప్రజలను వేడుకున్నారు.
విజన్ డాక్యుమెంట్ గట్ల కనపర్తి
సమాజ సేవ చేయాలనే దృడ సంకల్పం, పట్టుదల నిజాయితీ ఆత్మవిశ్వాసం చర్యలకు పారదర్శకత సమిష్టి తత్వం తగ్గింపు తత్వం నిరాడంబరం మానవీయత వంటి ప్రధాన అంశాలలో లక్ష్యం వైపు సాగడం
చుట్టుపక్కల గ్రామాలకు ఉపయోగపడేలా గ్రంథాలయం ఏర్పాటు
సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం, స్మశాన వాటిక దగ్గర స్నానం కోసం షవర్లు ఏర్పాటు చేయడం
గ్రామానికి కైలాసరథం వచ్చేందుకు కృషి
గ్రామంలో అంగడి ఏర్పాటు చేయడం
గంగదేవిపల్లి మొలకనూర్ లాంటి ప్రేరణతో అభివృద్ధి పనులను, మహిళలు అభివృద్ధి పనులకు ఆలోచించి స్వయం ఉపాధి పథకాల వైపు ప్రోత్సహించడం
యువత చదువుకోవడం ద్వారా ఉపాధి అవకాశాలు అందించడం కోసం
గ్రామ విడతల వారీగా హెల్త్ క్యాంపులు రక్తదాన శిబిరాలు నిర్వహించడం
గ్రామానికి పేరు ప్రఖ్యాతలు గుర్తింపును తీసుకొచ్చిన వారిని గౌరవించడం, సన్మానించడం
ప్రజల్లో మానవత్వ విలువలు పెంపొందించే విధంగా కృషి చేయడం
*సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనది
ఉపాధ్యాయులను సన్మానించడం
Development
దేశ భవిష్యత్తు తరగతిగది గో డల మధ్య నిర్మితమై ఉన్నది బావి భారత పౌరులను తయా రు చేయడంలో అనేకులను ప్రయోజకులను తయారు చేయడంలో గురువులది కీలక పాత్ర. వారి కృషి మరువలేనిది గురువులను గౌరవించి సన్మానం చేయటం ఆలోచన రావడం కారణం విద్యనే జ్ఞానానికి మూల స్తంభాలైన గురువులను రాబోయే రోజులలో ఘనంగా సన్మానం ఏర్పాటు చేయడo జరుగు తుంది ఉపాధ్యాయ వృత్తి అనేది ఉన్నతమైనది దేశానికి మంచి పౌరులను అందించేదే కేవలం ఉపాధ్యాయులే. మన గ్రామంలో బోధించిన ఉపాధ్యా యుని, ఉపాధ్యాయులను గౌరవించడం కోసం గురువుల కు సన్మానం అనే మహత్తర కార్యక్రమాన్ని చేపట్టాలని సంకల్పించడం జరిగింది. గ్రామంలో పాఠశాలలు స్థాపించినప్పటి నుండి 60 సంవత్సరాల కాలం నేటి వర కు ప్రాథమిక పాఠశాలలో ఉన్న త పాఠశాలలో బోధించే పదవి విరమణ పొందిన ఉపాధ్యా యిని, ఉపాధ్యాయులను గ్రామ అభివృద్ధి ఆధ్వర్యంలో మరియు గ్రామ ప్రజలు సమక్షంలో మెమొరంటోను, బహుకరించి శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానిం చడానికి నిర్ణయిం చడం జరిగింది. సేకరించిన సమాచారం ప్రకారం 60 సంవత్సరాల కాలం నుండి 200 మందికి పైగా గురువులు గట్ల కనపర్తి గ్రామంలో విధులు నిర్వర్తించి ఉంటారు మరికొందరు బోధించే వృత్తిలో కొనసాగు తున్నారు. రాబోయే రోజుల్లో మన గ్రామంలో ఏర్పాటు చేయబడి గ్రంథాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించి గురువులను అందరిని ఒకే వేదిక మీద ఘనంగా సన్మానిద్దాం,
నియోజకవర్గంలో 63 లక్షలతో 187 పశువుల తొట్టెల నిర్మాణానికి భూమి పూజ చేపట్టిన ఎమ్మెల్యే అమర్
పలమనేరు(నేటి ధాత్రి) ఏప్రిల్ 01:
గ్రామాల సర్వతోముఖాభివృద్దే ప్రభుత్వ ధ్యేయమని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. గంగవరం మండలంలోని కీలపల్లి పంచాయతీ జే.ఆర్. కొత్తపల్లిలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పశువులకు నీటి తొట్టెల నిర్మాణ భూమీ పూజ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన పూజలు చేసి పనులను ప్రారంభించారు.అనంతరం జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. నియోజకవర్గంలో 62 లక్షల రూపాయలతో 187 నీటి తొట్టెలను నిర్మించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
MLA Amar
ఉపాధి హామీ పథకంలో రైతులకు ఎన్నో ఉపయోగకరమైన కార్యక్రమాలు చేసుకునేందుకు అవకాశం ఉందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తుందని గ్రామాలలో రోడ్లు, మౌలిక సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో డ్రామా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ రవికుమార్, అసిస్టెంట్ పిడి ఎస్ రవికుమార్, ఎంపీడీవో సురేష్ కుమార్, తహసిల్దార్ మాధవరాజు, ఏపీవో శ్రీనివాసులు, ఏపీఎం హరినాథ్ లతోపాటు తెలుగుదేశం పార్టీ నాయకులు సోమశేఖర్ గౌడ్, ప్రతాపరెడ్డి,నాగరాజు రెడ్డి, ఆల్ కుప్పం రాజన్న, మునస్వామి రెడ్డి, గిరిధర్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు..
పలు గ్రామాల్లోఅభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్
గ్రామాలభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోంది
ప్రగతిసింగారం గ్రామ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు
కండువా కప్పి ఆహ్వానిం చిన ఎమ్మెల్యే జీఎస్సార్
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలంలో వివిధ గ్రామాలలో భూపాల పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణరావు పర్యటిం చారు. ఆయా గ్రామాలల్లో సుమారు రూ.7.74 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముం దుగా కొత్తగట్టుసింగారం గ్రామంలో బీటీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాందా రిపేట లో సీసీరోడ్లు, శాయం పేట మహాత్మాగాంధీ జ్యోతిభా పూలే పాఠశాలలో సీసీ రోడ్డు, శాయంపేట నాగసముద్రం నుండి పత్తిపాక వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పత్తిపాక, నేరేడుపల్లి, కాట్రపల్లి, గంగిరేణిగూడెం, వసంతా పూర్, కొప్పుల, జోగంపల్లి, పెద్దకోడెపాక, మైలారం గ్రామాల్లోని ఎస్సీ కాలనీలల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకు స్థాపన చేశారు. అదేవిధంగా, వసంతాపూర్ నుండి కొత్త పల్లిగోరి మండల కేంద్రం వరకు బీటీ రోడ్డు రెన్యువల్, పెద్దకోడెపాక డంపింగ్ యార్డు నుండి మూడువాగుల కట్ట వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మారుమూల గ్రామాలు, పంచాయితీలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. ప్రజల ప్రతీ అవసరాన్ని తీర్చడమే ద్వేయంగా ముందుకెళ్తున్నా మని, సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్క పేద ప్రజలకు అందించేలా చూస్తా నని ఎమ్మెల్యే అన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ప్రజల భాగస్వామ్యంతో ప్రజా ప్రతి నిధి ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేస్తుందని తెలి పారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం అనేక వినూ త్న కార్యక్రమాలు చేపడుతోం దన్నారు. ఇందిరమ్మ రాజ్యం, ప్రజా ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిందని తెలిపారు. ఉచిత ప్రయాణమే కాకుండా ఆ బస్సులకు ఓనర్లుగా మహిళలను చేయడం ప్రజా ప్రభుత్వం చేపట్టిన విజయ మని అన్నారు. ప్రతీ మహిళ ఆర్థికంగా ఎదగాలని, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని, అన్ని రంగాల్లో వారిని ముందంజలో ఉంచా లనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. సదరు గుత్తేదా రులు నాణ్యతతో కూడిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, నాణ్యతలో రాజీపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే అన్నారు.
Foundation stone
రూ.5,96,000 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే..
శాయంపేట మండలంలో వివిధ గ్రామాల్లో అభివృద్ది పనులకు శంకుస్థాపనల పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే ఆయా గ్రామాల్లోనే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదా రులకు అందజేశారు. మొత్తం 20 మంది సీఎం రిలీఫ్ లబ్దిదారులకు రూ.5,96, 000/- విలువ గల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూరాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. లక్షలు ఖర్చు చేసి ప్రైవేటు, కార్పొరేట్ వైద్యశాలల్లో చికిత్స చేయించుకోలేని వారికి సీఎంఆర్ఎఫ్ పథకం కొండంత అండగా నిలుస్తుందన్నారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రగతి సింగారం గ్రామ బీఆర్ఎస్ నేతలు
ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈరోజు మండలంలోని ప్రగతిసింగారం గ్రామం నుండి 20 మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయ ణరావు గ్రామ కూడలిలో పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు వీరే పిట్టల రఘుపతి, బళ్ల సంతోష్, చిలుకల తిరుపతి, చిలుకల సతీష్, చిలుకల రవి, దైనంపల్లి ప్రకాష్ లతో పాటు మరో ఇరవై మంది ఉన్నారు.
అన్నదాతల అభివృద్ధి కాంగ్రెస్ పాలన లక్ష్యంకాంగ్రెస్ పార్టీమండల అధ్యక్షులు..
తంగళ్ళపల్లి నేటి ధాత్రి..
తంగళ్ళపల్లిమండలంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏ ఎల్ ఎం.4. ఏ ఎల్ ఎం.5. కాలువల ద్వారా సాగునీరు అందిస్తున్న విధానాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నదాతల సంక్షేమమే ప్రజాపాలన లక్ష్యమని తెలియజేస్తూ జిల్లెల్ల గ్రామ చెరువులోకి వచ్చే సాగునీటి కాలువలను మరియు దాచారం మీదిగా చిన్న లింగాపూర్ పరిసర గ్రామాలకు వచ్చే కాలువలను రైతులతో కలిసి సందర్శించి రైతులకు సాగునీరు రావడానికి కృషిచేసిన సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కి ప్రభుత్వ విప్ విఫ్ వేములవాడ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ కి. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వం పెల్లి సత్యనారాయణకు ప్రత్యేక కృతజ్ఞతలు.11/6. ఏ ఎల్ ఎం కాల్వ ద్వారా శాశ్వత పరిష్కారం ద్వారా లక్ష్మీపురం గ్రామ0 వరకు నిర్మాణం పూర్తి చేసి అన్నదాతలకు అండగా ఉండేందుకు ప్రభుత్వ పెద్దలు కృషి చేస్తున్నారని కాల్వ నిర్మాణం కోసం ల్యాండ్ ఆక్వా జేషన్ లో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం అందించే దిశగా కేకే మహేందర్ రెడ్డి కృషి చేస్తున్నారని తమ గ్రామాలకు సాగునీరు రావాలని రాత్రింబవళ్లు.కష్టపడి కేసుల పాలైన వివిధ గ్రామాల రైతులకు అండగా ఉంటామని ప్రజాపాలనలో అన్నదాతలు బాధపడితే చూస్తూ ఊరుకోం అని వారికి అన్ని విధాల అండగా ఉండి ఆదుకుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమిటీ అధ్యక్షులు డైరెక్టర్లు మండల కాంగ్రెస్ నాయకులు జిల్లా కాంగ్రెస్ నాయకులు తో పాటు జిల్లా చిన్న లింగాపురం రైతులు తదితరులు పాల్గొన్నారు
పట్టణంలోని మారుతి నగర్ అభయాంజనేయ స్వామి ఆలయ ఛైర్మెన్ శ్రీ బండి సదానందం యాదవ్ ఆదేశం మేరకు అలయకమిటి సభ్యులు మరియు వివిధ వార్డు లకు సంబంధించిన అభయ ఆంజనేయ స్వామి భక్తులకు తెలియజేయునది ఏమనగా.
తేదీ 6/4/2025 రోజున శ్రీరామ నవమి ఉన్నందున శ్రీరామ నవమి కార్యక్రమాన్ని జరుపుకోవడం తో పాటు ఆలయ కమిటీ ని సవరిస్తూ భవిష్యత్తు లో ఆలయాన్ని పెద్ద మొత్తము లో గుడి అభివృద్ధి మరియు ఇతర కొన్ని సమస్య లపై చర్చించుకునేందుకు ఎల్లుండి ఆదివారం రోజున ఉదయం 10 గంటలకు గుడి ప్రాంగణంలోని ఛైర్మెన్ ఆదేశాల మేరకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది..
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో మంగళవారం రోజు న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది, మండలంలోని గోపాలపురం ముచనిపర్తి చల్లగరిగే, జూకల్, తిర్మలాపూర్, చిట్యాల, మోడల్ స్కూల్ ఆవరణలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పార్టీ శ్రేణులతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల అభివృద్ధి కోసం నిత్యం కృషి చేస్తుందని, రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా అందించి రైతులను అన్ని విధాలుగా ఆదుకుందని తెలిపారు,మరిన్ని అభివృద్ధి పనుల కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు, ఇది ప్రజల ప్రభుత్వమని ప్రజాపాలన జరుగుతుంద ని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ హేమ, ఎంపీడీవో జయ శ్రీ ,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మూలశంకర్ గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ బుర్ర లక్ష్మణ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల గ్రామ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
పరకాల నేటిధాత్రి ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి అదేశాలమేరకు(1,2,3)వార్డులలో కాంగ్రేస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొయ్యడా శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్,మాజీ ఎమ్మెల్యే మొలుగురి భిక్షపతి,ఎఎంసి చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన,మరియు ఎస్ సి వర్గీకరణ తో పాటు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఒంటెరు రామ్మూర్తి,1,2,3 వార్డుల మాజీ కౌన్సిలర్లు మడికొండ సంపత్ కుమార్,కుంకుమేశ్వర అలయకమిటి ఛైర్మన్ కొలుగూరి రాజేశ్వరరావు, పరకాల పట్టణ కాంగ్రేస్ పార్టీ సమన్వయకమిటి సభ్యులు సోదా రామకృష్ణ,పావుశెట్టి వెంకన్న,బండి సదానందం, ఎం డి రంజాన్ అలీ,నల్లెళ్ల అనిల్ కుమార్,దుబాసి వెంకటస్వామి,పసుల రమేష్,చిన్నల గొనాద్,బుర్ర రాజమోగిలి, బండి సదానందం గౌడ్ న ల్లెల అనిల్ డాక్టర్.మడికొండ శీను పాలకుర్తి శ్రీనివాస్ వార్డ్ కమిటీ సభ్యులు,ఇందిరమ్మ కమిటీ సభ్యులు,కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు సవాల్ విసిరిన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి వనపర్తి నేటిధాత్రి ;
వనపర్తి నియోజకవర్గం అభివృద్ధికి అడ్డు పడ వద్దని రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి కి సవాల్ విసిరారు ఆదివారం సాయంత్రం చిన్నారెడ్డి నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గం నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందించానని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని ఒకసారి0 మంత్రిగా పనిచేశానని చెప్పారు .గోపాల్ పెట్ మండలం లో పోలికేపాడు గ్రామం గుట్టల మధ్యన మార్కెట్ యార్డ్ శంకుస్థాపన ఎమ్మెల్యే మెగా రెడ్డి మార్కెట్ యార్డ్ నిర్మాణానికిమంత్రి తుమ్మల నాగేశ్వర్ రెడ్డితో శంకుస్థాపన చేయించారని ఆయన పేర్కొన్నారు గోపా ల్ పే ట్ మండల కేంద్రంలో ప్రభుత్వ స్థలం 76 ఎకరాలు ఉన్నదని మండలానికి అనుకూలంగా తన సొంత గ్రామం తిరుమలాపుర o ఉన్నదని వివిధ గ్రామాలు ఉన్నాయని గోపాల్ పెట్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ నిర్మిస్తే అన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఆయన అన్నారు. ఎన్నికల ముందు ఎమ్మెల్యే మెగా రెడ్డి గెలుపుకు పెద్దమందడి మండలంలో అనేక గ్రామాల్లో ప్రచారం చేశా నని గెలుపు కు కృషి చేశానని చిన్నారి రెడ్డి చెప్పారు . తెలంగాణ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ బీ ఎ సి కమిటీకి కే సీ వేణుగోపాల్ ఇన్చార్జిగా ఉన్నారని ఆ కమిటీలోనేను కూడా ఉన్నానని చిన్నారెడ్డి చెప్పారు . సీఎం రేవంత్ రెడ్డి తన.పై నమ్మకంతో బేగంపేట్ ప్రజాపాలన కార్యాలయం ప్రజల వినతి పత్రాలు స్వక రి o చు ట అప్ప గించారని చెప్పారు ప్రతి శుక్రవారం 8 వేల నుండి 12 వేల వరకు ప్రజలు. వస్తుంటారని వారితో. ఫిర్యాదులు స్వీకరించి అప్పటికప్పుడు సంబంధిత కలెక్టర్లతో అధికారులతో ఫోన్లో సంప్రదించి ప్రజల సమస్యలకు పరిష్కారం కావడానికి కృషి చేస్తున్నానని చిన్నారెడ్డి చెప్పారు. ఓపి క తో ప్రజల వినతి పత్రాల స్వీక రి స్తు.న్న నని ఆయన పేర్కొన్నారు .పార్లమెంట్ ఎన్నికల్లో డాక్టర్ మల్లు రవి గెలవడానికి వనపర్తి నియోజకవర్గ మొత్తం పర్యటించానని గెలుపుకు కృషి చేశానని ఆయన పేర్కొన్నారు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి ఇంటికి వెళ్లి రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని సీఎం రేవంత్ ముఖ్యమంత్రి ఆయాతారని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రచారంలో చేశానని ప్రజలను కోరానని చెప్పారు శ్రీమతి సోనియా గాంధీ పాదాభివందనం అసెంబ్లీ ఎన్నికలలో నాకు టికెట్ ఇవ్వడానికి నా యొక్క పేరును టికెట్ రావడానికి లిస్టులో టిక్ చేశారని చెప్పారు .ప్రస్తుత ఎమ్మెల్యే మెగా రెడ్డి సర్వే చేసిన బృందానికి గల్లీ నుంచి ఢిల్లీ వరకు డబ్బులు ఇచ్చి అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇచ్చి టికెట్ తెచ్చుకున్నారని విమర్శించారు 46 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ కి సేవలందించానని ఇప్పుడు కూడా నా వ్యక్తిగత విషయంలో జోక్యం చేసుకోవద్దని నాకు అన్ని తెలుసునని అన్నారు ఎమ్మెల్యే కు ఒకటి చెబుతున్న నీ వెంబడి ఉన్న నాయకుల అభిప్రాయాలు తీసుకొని ఇతర నాయకుల అభివృద్ధికి అడ్డుపడితే సహించనని హెచ్చరించారు ఈ విలేకరుల సమావేశంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బి కృష్ణ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్ న్యాయవాది కిరణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.