ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి:టి పిటిఎఫ్…

ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి:టి పిటిఎఫ్.

కోదాడ, నేటి ధాత్రి:

 

ఉద్యోగ ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు, డిఏ లు, హెల్త్ కార్డులు పిఆర్ సి, సిపిఎస్ రద్దు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని టిపిటిఎఫ్ తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు రాపర్తి రామ నరసయ్య, రాష్ట్ర కౌన్సిలర్ సిహెచ్.బిక్షం ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం కోదాడ పట్టణం ఎమ్మెస్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన టిపిటిఎఫ్ ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణ ఆత్మీయ అభినందన సన్మాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడినారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేయడానికి నాణ్యమైన విద్య అందించడానికి బాధ్యతలు కోసం నిలబడతామని విద్య, ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం హక్కుల సాధన కోసం నిరంతరం టిపిటిఎఫ్ ముందుండి పోరాడుతుందని తెలిపారు. ఇటీవల మార్చి 31, 2026న ఉపాధ్యాయ ఉద్యోగ విరమణ పొందిన టిపిటిఎఫ్ సంఘ ఉపాధ్యాయులు పోతురాజు సత్యనారాయణ స్కూల్ అసిస్టెంట్ బోటనీ వాయిల సింగారం, పోతురాజు నరసయ్య స్కూల్ అసిస్టెంట్ హిందీ, పేరం ముత్తయ్య గెజిటెడ్ హెడ్మాస్టర్ లను శాలువా మెమొంటో పూలమాల అంకరణతో ఘనంగా సన్మానించడం జరిగింది. టిపిటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు బడుగుల సైదులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీనియర్ సభ్యులు ముత్తవరపు రామారావు, డి ఎన్ స్వామి, పొనుగోటి కోటయ్య, టి పి టి ఎఫ్ డివిజన్ సంఘం బాద్యులు కొల్లు శ్రీనివాసరావు, ఏ. హనుమంతరావు, కైలాస వెంకటేశ్వర్లు, సుధాకర్, రాజమహేంద్ర, కృష్ణయ్య పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version