ఉపాధ్యాయురాలు యాదమ్మ పదవీవిరమణ

వ్యక్తి జీవితంలో ఉద్యోగ ప్రస్థానం ముఖ్యమైనది.

బాలానగర్ ఎంఈఓ శంకర్.

బాలానగర్ నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలు యాదమ్మ ఈరోజు పదవి విరమణ పొందింది. ఈ సందర్భంగా ఎంఈవో శంకర్ మాట్లాడుతూ.. యాదమ్మ తన సుదీర్ఘ వృత్తి జీవితంలో ఎంతో మంది విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల అభ్యున్నతికి ఆమె కృషి చేశారన్నారు. ఆమె శేష జీవితం ఆరోగ్యంగా, ప్రశాంతంగా గడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version