దిగులు చెందుతున్న పత్తి రైతన్నలు…..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-15T120400.188.wav?_=1

 

దిగులు చెందుతున్న పత్తి రైతన్నలు…..!

◆:- భారీ వర్షాలకు పంటకు నష్టం…..

◆:- ఎర్రబారుతున్న పత్తి…..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

భారీ వర్షాలకు పత్తి రైతులు నష్టపోతున్నారు. వేల రూపాయలు పెట్టి సాగు చేసిన పత్తి పంట చేతికి వచ్చే సమయంలో దెబ్బ తిన్నది. ప్రారంభంలో పత్తి పంట ఆశాజనకంగా ఉండడంతో రైతులకు సంబరపడ్డారు. కానీ పంట ఏర్పుగా పెరిగే సమ యంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పత్తి పంట దెబ్బతినడంతో పత్తి రైతన్నలు దిగులు
చెందుతున్నారు.

మండల పరిధిలో..

 

 

 

నుంచి మండలంలో కొన్ని సంవత్సరాల రైతులు అధిక విస్తీర్ణంలో పత్తి సాగు చేస్తున్నారు. మండలంలో 33 వేల ఎకరాల్లో పత్తి సాగైనట్లు అధికారులు తెలిపారు. వర్షం ఎక్కువైనా కొంతమేర పంట తట్టుకుంటుందని ఉద్దేశంతో అన్నదాతలు పత్తి పంట సాగుకు మొగ్గు చూపారు. వర్షాలు
అశజనకంగా ఉండటంతో ప్రారంభంలో ప్రతి చేనుకు ఆశ జనకంగా ఉండేది. పంట ఎక్కువగా పెరగడంతో దిగుబడులపై ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల గత 15 రోజుల నుంచి భారీ వర్షాలు కురవడంతో అంత బాగా దెబ్బతిన్నది. మండలం లోని పత్తి పంటలు ఎక్కువగా నష్టం వాటిల్లింది.

ఎర్రబారిన పత్తి పంట

భారీ వర్షాల వల్ల పంట ఎరుపు రంగ మారుతుంది. పొలాల్లో నీరు చేరి పంట దెబ్బతింటుంది. ఇప్పటికే ఎకరాకు 15 వేల రూపాయలు ఖర్చు చేసిన రైతులు ఉన్న పంటను కాపాడుకునేందుకు అదనంగా రూ.10 వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితిలో ఏర్పడ్డాయి. మొక్కల్లో బలం లేక దిగుబడి పూర్తిగా తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. కౌలు రైతులు చేతి నుంచి డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ఎకరానికి రూ.15వేలు ఖర్చు చేశాం

◆:- మొహమ్మద్ సుల్తాన్ సలావుద్దీన్, పత్తి రైతు

ఏడెకరాల్లో పత్తి సాగు చేశా. పంట కోసం భారీగా పెట్టుబ డులు పెట్టి ఎకరానికి రూ.15 వేలు చొప్పున ఖర్చు చేశాను. ఇంకా రసాయన మందులను పిచికారి చేయాలి, కలుపు తీయడం చేయాల్సి ఉంది. ఎకరాకు ఇంకా రూపాయలు 10వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంది. పెట్టుబడులు పెట్టిన తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎకరానికి కనీసం 10శాతం దిగుబడి వస్తాయి అనుకున్నాము. కానీ సగం కూడా వచ్చే అవకాశాలు లేవు. ప్రభుత్వం పత్తి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.

భారీ వర్షాలతో జహీరాబాద్లో పంట నష్టం, ప్రజల ఆవేదన…

భారీ వర్షాలతో జహీరాబాద్లో పంట నష్టం, ప్రజల ఆవేదన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఆగస్టులో కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలో ఆస్తి, ప్రాణ నష్టం జరిగిన నేపథ్యంలో, బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో జహీరాబాద్లో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలు జనాలను విసుగు చెందిస్తున్నాయి. గురువారం ఝరాసంగం మండలంలో ఉదయం 8 గంటల నుంచే వర్షం కురుస్తుండటంతో, కోతకు వచ్చిన పంటలను ధాన్యంగా మార్చే ప్రక్రియకు అంతరాయం కలిగి, చేతికొచ్చిన పంట కళ్ళముందే నాశనం అవుతుంటే చూసి భరించలేమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉదయమే మొదలైన వర్షం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-11T114409.684.wav?_=2

 

ఉదయమే మొదలైన వర్షం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ సెప్టెంబర్ 11:ఆగష్టు మాసంలో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు నీటమునిగి పెద్ద మొత్తంలో ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే, వరద బాధితులను ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయల కేటాయించినప్పటికీ బాధితుల కష్టాలు వర్ణనాతీతం ఇలాంటి బాధాకరమైన విషయాలు మరవకముందే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోని ప్రభావంతో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు జనాలు విసుగు చెందుతున్నారు. గురువారం ఉదయం 8 గంటలకే మొదలైన వర్షంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు పొలాల్లో ఉన్నటువంటి కోతకు వచ్చిన పంటల్ని కోసి ధాన్యంగా మార్చే ప్రక్రియలో పనులకు అంతరాయం కలగడంతో చేతికొచ్చిన పంట కళ్ళముందే నాశనం అవుతుంటే చూసి భరించలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాలుష్య జలాలతో పంట నష్టం.. నరోత్తం ఆగ్రహం,..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-30T123110.593.wav?_=3

 

కాలుష్య జలాలతో పంట నష్టం.. నరోత్తం ఆగ్రహం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ సమీపంలోని యాంత్రిక పశువదశాల నుండి కాలుష్య జలాలను పంటపొలాలకు వదులుతున్నారని, దీనివల్ల పంట నష్టం జరుగుతోందని ఎస్సీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ నరోత్తం శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆరోపించారు. ఈ సమస్యపై తక్షణమే స్పందించి, కాలుష్య జలాలను నిలిపివేయాలని ఆయన అధికారులను కోరారు.

యూరియా కుంభకోణానికి పాల్పడుతున్న రేవంత్ ప్రభుత్వం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-26T155155.515-1.wav?_=4

యూరియా కుంభకోణానికి పాల్పడుతున్న రేవంత్ ప్రభుత్వం..

రైతుల సమస్యలు విస్మరించి.. కాంగ్రెస్ రాజకీయ యాత్రలు..

కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ రాష్ట్ర సివిల్ సప్లై మాజీ చైర్మన్,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సరిపడా యూరియా అందించని రేవంత్ రెడ్డి ప్రభుత్వం యూరియా కుంభకోణానికి పాల్పడుతున్నదని రాష్ట్ర సివిల్ సప్లైస్ మాజీ చైర్మన్ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే,బిఆర్ఎస్
రాష్ట్ర నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.యూరియా కొరత వనల రైతులు పడుతున్న ఇబ్బందుల వల్ల స్పందించిన పెద్ది సుదర్శన్ రెడ్డి అండగా ఉంటున్నారు.నిత్యం ప్రజలు,రైతుల కోసం మరోసారి పోరాటం చేయకతప్పలేదు.నర్సంపేట డివిజన్ పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై జరుగుతున్న రైతు పోరాటాల్లో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రత్యక్షంగా పాల్గొని అధికారులను,కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ యూరియా కొరత సృష్టించి మార్కెట్ ధర కంటే అధిక ధరకు నానో యూరియా అమ్ముతూ రైతులను ఆర్థికంగా దోచుకుంటున్న ప్రభుత్వాలపై పెద్ది మండిపడ్డారు.పంటలు పాడవుతున్నాయని యూరియా కోసం ఆడిగిన రైతులపైన పిడిగుద్దులతో కాంగ్రెస్ పార్టీ దండయాత్ర చేస్తున్నదని విమర్శించారు.సన్నరకం వడ్లు కొనుగోలు చేసిన ప్రభుత్వం రాష్ట్రంలో రైతులకు రూ.1267 కోట్లా బోనస్ కాగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో రూ. 262 కోట్లు బోనస్ ఎగవేసిందని,రైతులు కష్టాల్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ అంగు ఆర్భాటాలతో కాంగ్రెస్ ప్రభుత్వం బోగస్ యాత్రలు చేస్తున్నదని ఎద్దేవా చేశారు.వరంగల్ డిక్లరేషన్ లో చెప్పిన కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ కౌలు రైతులు ,రైతు కూలీలకు ఇచ్చిన హామీలు,ఎగబెట్టిన రైతూ భరోసాపై ఎందుకు ప్రస్తావించడం లేదని మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు.యూరియా కొరత పైన కాంగ్రెస్, బిజెపి పార్టీల మధ్య ఉన్న లాలూచీ ఒప్పందం ఏంటని.. 52 సార్లు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి ఒక్కరోజు కూడా రైతుల కోసం కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని పత్రికా సమావేశంలో ఎందుకు అడగడంలేదని సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శించారు.యూరియా జాతీయ సమస్య ఐతే పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదన్నారు.
యూరియా కోసం క్యూలైన్లలో నిలబడే వేలమంది రైతులు బిఆర్ఎస్ పార్టీ రైతులే అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ పార్టీకి డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు.యూరియా కొరత అనేది కాంగ్రెస్ పార్టీ సృష్టించిన కృత్తిమ కొరతే అని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టును చేపట్టి పూర్తిచేయలేదని,సాగునీరు అందివ్వని ఆసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి యాత్రలు చేసే అర్హతలేదని ఆరోపించారు.ఆరు గ్యారెంటీలు 420 హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పదానికి సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర సివిల్ సప్లై మాజీ చైర్మన్,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు.

కోనాపూర్‌లో యూరియా కొరతపై రైతుల ధర్నా…

కోనాపూర్‌లో యూరియా లభ్యం లేక రైతుల రోడ్డుపై ధర్నా..

రామాయంపేట ఆగస్టు 25 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట మండలం నుండి
మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని కోనాపూర్ గ్రామంలో యూరియా లభ్యం కాక రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం గ్రామంలోని వందలాది మంది రైతులు కలిసి గ్రామ ప్రధాన రహదారిపై బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా ఆగిపోయి, ట్రాక్టర్లు, ఆటోలు, బస్సులు, రెండు చక్రాల వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. ఆకస్మికంగా ఏర్పడిన ఈ పరిస్థితితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Farmers Protest Over Urea Shortage in Konapur

రైతులు మాట్లాడుతూ—వర్షాకాలంలో పంటల సాగు ఉధృతంగా సాగుతున్న తరుణంలో యూరియా అందకపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని, పంటలపై పెట్టిన ఖర్చు వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులుగా యూరియా కోసం సహకార సంఘం, మార్కెట్ యార్డ్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఒక్క బస్తా కూడా అందలేదని, ప్రభుత్వం రైతాంగ సమస్యల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
రైతులు మాట్లాడుతూ, “ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమవుతోంది. రైతులకు ఎరువులు అందించడం లో విఫలమవుతోంది. ఈ పరిస్థితి కొనసాగితే పంటలన్నీ నాశనం అవుతాయి. మా జీవితాలు ప్రమాదంలో పడతాయి” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధర్నా విషయం తెలిసి పోలీసులు అక్కడకు చేరుకొని రైతులతో మాట్లాడారు. అధికారులు త్వరలోనే యూరియా సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు. అయితే హామీలు కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, లేకపోతే మరింత తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
స్థానికులు కూడా ఈ సందర్భంలో మాట్లాడుతూ—గ్రామంలో యూరియా కొరత కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

“మెట్‌పల్లి రైతుల ఆందోళన: అక్రమ మోరంపై చర్యలు కోరింత”…

మెట్ పల్లి

ఆగస్టు 22 నేటి ధాత్రి

 

 

మెట్ పల్లి పట్టణ రైతులు ఆర్డీవో కి అక్రమంగా మొరం తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందించారు అనంతరం రైతులు మాట్లాడుతూ పట్టణ శివారు వెంకట్రావుపేట రేగుంట లో ఉన్న మా పొలాల తోవలో గుండు గుట్టలను నిత్యం జెసిబి లతో కొంతమంది గ్రూపులుగా ఏర్పడి నిత్యం మూడు నాలుగు జెసిబి లు 20 పైగా ట్రాక్టర్లతో మొరము తరలిస్తూ ఉన్నారు .
ఈ అక్రమ మోరం తీసుకెళ్లేటప్పుడు అతివేగంగా రావడం రాత్రింబవళ్లు లో కూడా ట్రాక్టర్లు తిరగడం పంట పొలాలు వెళ్లే దారి పూర్తిగా ధ్వంసం అయిందని అంతేకాకుండా అనుభవం లేని లైసెన్స్ లేని డ్రైవర్లతో వంట పొలాల్లో ట్రాక్టర్లు దించడం దీని ద్వారా పంటలు ధ్వంసం అవుతున్నాయని ఇంతకుముందు తహసిల్దార్ కి మొరము తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చిన వారు పట్టించుకోలేదని మొరం డిమాండ్ ఎక్కువ ఉండడంతో జెసిపిల ద్వారా గుండు గుట్ట నుండి తీసుకొచ్చి డ్రంపులు చేస్తూ అధికారులు చూసి చూడనట్టు వివరిస్తున్నారని ప్రస్తుతం గుండు గుట్ట కనుమరుగవుతూ ఉన్నదని అధికారులు మాకేం పట్టింపులేనట్టు వ్యవహరిస్తున్నారని మేము పంట పొలాలకు వెళ్లి కెనాల్ దారిలో అక్కడి కాలనీవాసులు కెనాల్ వెంట సిసి రోడ్డుపై జెసిబి లు ట్రాక్టర్లు మిల్లర్లు కార్లు అన్ని రోడ్లపై నిలుపుతున్నారని బండ్లను తీయమంటే వారు బెదిరిస్తూ భయంతో గురి చేస్తున్నారని దయచేసి మా యందు దయతలిచి మా సమస్యలకు వెంటనే పరిష్కరించాలని అక్రమ మొరంపై చర్యలు తీసుకోవాలని కెనాల్ వెంట సిసి రోడ్డుపై ఉన్న వెహికల్స్ తీయించి మాకు న్యాయం చేయాలని వినతిపత్రం ఇచ్చామని అన్నారు .ఈ కార్యక్రమంలో జెట్టి లింగం ఒజ్జల బుచ్చిరెడ్డి ఎర్రోళ్ల హనుమాన్లు ఆకుల నరేష్ నారాయణ బొడ్ల ఆనందు ఒజ్జల శ్రీనివాస్ కురుమ సాయిలు లక్ష్మణ్ యమ రాజయ్య అరిగేలా లక్ష్మణ్ జెట్టి శ్రీనివాస్ బాలరాజు సంజీవ్ గంగారెడ్డి సురేష్ దేవయ్య తదితర రైతులు పాల్గొన్నారు.

వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-20T143106.483-1.wav?_=5

 

వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

పి ఎ సి ఎస్ మాజీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మొరంచ వెంబడి నీట మునిగిన వరి పొలాలను అంచనవేసి రైతులకు నష్టపరిహారం అందించాలని గణపురం మాజీ సొసైటీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి అన్నారు.
గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి పంట పూర్తిగా దెబ్బతిందని పొలాల్లో ఇసుక దిబ్బలు పెరికపోయాయని, పత్తి పంట నష్టం జరిగిందని పంట నష్టం విషయంలో ప్రభుత్వం స్పందించి వ్యవసాయ శాఖ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నష్టం అంచనా వేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి, జిల్లా అధికారులకు పూర్ణచంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. గ్రామపంచాయతీలో పాలకవర్గాలు లేక వర్షాల కారణంగా దోమల నివారణలో జాప్యం జరుగుతుందని అధికారులు వెంటనేc స్పందించి పరిశుభ్రత చర్యలు చేపట్టాలని కోరారు.

భారీ వర్షాలకు పంట నష్టం: ఏఓ పరిశీలన…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T164823.516-1.wav?_=6

 

భారీ వర్షాలకు పంట నష్టం: ఏఓ పరిశీలన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను మండల వ్యవసాయ అధికారి సోమవారం మధ్యాహ్నం స్వయంగా సందర్శించారు. ఈ సందర్భంగా మినుము, పెసర, సోయా పంటలు తీవ్రంగా నష్టపోయినట్లు తెలిపారు. వర్షం నీరు పంట పొలాల్లో నిల్వ ఉండకుండా చూసుకోవాలని రైతులకు సూచించారు.

నీట మునిగిన రైతుల పంట పొలాలకు ప్రభుత్వం ఆదుకోవాలి…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T130701.101.wav?_=7

 

నీట మునిగిన రైతుల పంట పొలాలకు ప్రభుత్వం ఆదుకోవాలి

బీజేపీ మండల అధ్యక్షులు ఊర నవీన్ రావు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం లో
అధిక వర్షాలతో గణపురం మండలంలో మోరంచవాగు ఉప్పొంగడంతో వాగు పరిసర ప్రాంతాల్లో నీట మునిగిన పంట పొలాలను జిల్లా అధికార యంత్రాంగం పరిశీలించి తక్షణమే నష్ట పరిహారం చెల్లించాలని బీజేపీ మండల అధ్యక్షులు ఊర నవీన్ రావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతు జిల్లాలో మరి కొద్ది రోజులు అధిక వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారి చేసిందని, ఇప్పటికే మోరంచ వాగు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో మండలంలోని సీతారాంపూర్ ధర్మరావుపేట, గణపురం, చెల్పూర్ శివారులో వరద తాకిడికి గురై పంట పొలాలు నీట మునిగాయన్నారు. గత రెండు రోజులుగా వరి పంట నీటిలో మునిగి ఉండటం, పొలాల్లో ఇసుకమేటలు వేసి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. కావున తక్షణమే ప్రభుత్వం, అధికార యంత్రాంగం స్పందించి సర్వే చేపట్టి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. అదే వి ధంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫలస్ బీమా యోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆ పథకాన్ని అమలు చేస్తే రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలని కోరారు.

వర్ష బీభత్సం తీవ్ర పంట నష్టం మహిళ రైతు ఆవేదన.

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T121410.690-1.wav?_=8

 

వర్ష బీభత్సం తీవ్ర పంట నష్టం మహిళ రైతు ఆవేదన.

చిట్యాల, నేటిధాత్రి : 

 

 

చిట్యాల మండలం ముచినిపర్తి గ్రామానికి చెందిన మూల లక్ష్మి అనే మహిళ రైతు మూడెకరాల్లో పత్తి చేను వేయగా గత నాలుగు రోజుల నుండి కురుస్తున్న వర్షానికి చేన్లోకి నీరు రావడంతో మూడు ఎకరాల పంట పూర్తిగా నీట మునిగింది
ప్రైవేట్ బ్యాంకుల్లో అప్పులు తీసుకొచ్చి పంట పెట్టుబడి పెడితే ప్రకృతి వైపరీత్యానికి రైతు పలవుతున్నాడని మహిళా రైతు ఆవేద వ్యక్తం చేసింది దీనికి తోడు చేను పక్కన ఉన్న మరో రైతు కట్టలాగా మట్టితో నింపడంతో చేనులో ఉన్న నీరు బయటకు పోకుండా అందులోనే నిలిచి పంట పూర్తిగా మాడిపోయింది ప్రకృతి చేసిన వైపరీత్యానికి రైతుకు ఆత్మహత్య శరణ్యంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో మహిళలకు ముందు వరుసలో ప్రాధాన్యమిస్తున్న వ్యవసాయ రంగంలో నష్టపోతున్న మహిళా రైతుకు సాయం అందించి ఆదుకోవాలని పలువురు వేడుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version