మహదేవపూర్ బాధిత కుటుంబాలను బీజేపీ నేతలు పరామర్శ…

బాధిత కుటుంబాలను పరామర్శించినబీజేపీ రాష్ట్ర నాయకులుచల్లనారాయణ రెడ్డి**

* మహదేవపూర్ సెప్టెంబర్ 13 (నేటి ధాత్రి *

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడినటువంటి రాంశెట్టి సమ్మయ్యని పరామర్శించి ప్రమాదంకు సంబదించిన పరిస్థితులను, వారి బాగోగులను అడిగి తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణ రెడ్డీ అలాగే
గిరిజన ఆశ్రమ పాఠశాల ఆవరణలో హాస్టల్స్ లో డైలీ వెజ్, కాoటినింజెంట్ వర్కర్ల సమస్యల పరిష్కరానికై చేస్తున్నటువంటి నిరవధిక సమ్మెకు మద్దతు తెలుపుతూ, ప్రభుత్వం వెంటనే వర్కర్ల సమస్యల పరిష్కరానికి కృషి చెయ్యాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది,
మహాదేవపూర్ మండలంలోని అంబట్ పల్లి గ్రామంలో గురువారం గోదావరి తీరా ప్రాంతంలో పిడుగు పాటుకు మృతి చెందిన 94 గోర్లు, వాటి కాపరులను పరామర్శించి, అనంతరం మాట్లాడుతూ పశు సంబంధిత అధికారులు, కలెక్టర్ తక్షణమే స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరడం జరిగింది,అలాగే 94 మృతి చెందిన గోర్లతో పాటు ఇంకో 30 గోర్లు కూడా చనిపోయే పరిస్థితి లో వున్నవి కాబట్టి వాటిని కూడా కలుపుకొని ఆర్థిక సహాయం చేయాలనీ, గొర్ల యొక్క విలువ మొత్తం 14 లక్షల నుంచి 15లక్షలు వరకు ఉంటుందని,కానీ ప్రభుత్వ సహాయం కింద గొర్రెకు 5000 వేలు నష్ట పరిహారం ఇస్తూ బాధిత కుటుంబలు 9 లక్షల వరకు నష్ట పోతుందని, ఆలా కాకుండా 14 లక్షలు అన్నిటి విలువ కట్టి ప్రభుత్వo ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు, అలాగె బీజేపీ ప్రభుత్వం కూడా బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు,ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్, ప్రధాన కార్యదర్శులు గుజ్జుల శంకర్ శంకర్,లింగంపల్లి వంశీదర్ రావు,శ్రావణ్, బీజేపీ మండల నాయకులు ఆడప లక్ష్మి నారాయణ, కొక్కు శ్రీనివా స్, సాగర్ల రవీందర్, దాడిగేలా వెంకటేష్, రాకేష్, అయ్యప్పతో పాటు పలువురు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version