ఘనంగా మున్సిపాలిటిలో అంబేద్కర్ జయంతి వేడుకలు..

ఘనంగా మున్సిపాలిటిలో అంబేద్కర్ జయంతి వేడుకలు

నర్సంపేట నేటిధాత్రి:

వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపల్ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్,మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువల స్థాపనలో అంబేద్కర్ చేసిన సేవలను వారు కొనియాడారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version