ఘనంగా మహాఅన్నదాన కార్యక్రమం…

ఘనంగా మహాఅన్నదాన కార్యక్రమం

మరోసారి దేవాలయంలో అన్నదానం

అయ్యప్ప స్వామి దేవాలయానికి 108 కుర్చీల బహుకరణ

నర్సంపేట,నేటిధాత్రి:

 

వరంగల్ నర్సంపేట పట్టణంలోని శ్రీ ధర్మశాస్తా అయ్యప్పస్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామి సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహా అన్నదాన కార్యక్రమం 25 వ మండల పూజల వేడుకల్లో భాగంగా మంగళవారం నాటికి ఐదో రోజుకు చేరుకున్నది.అన్నదాతలుగా రూప ఇండస్ట్రీస్ యజమాని చకిలం శారద కృష్ణమూర్తి, బిర్రు రాజేశ్వరి సునీల్ కుమార్, దాసరి పద్మ జయేందర్ రెడ్డి ఉన్నారని దేవాలయ ట్రస్టు చైర్మన్ సింగిరికొండ మాధవశంకర్ గుప్తా,అధ్యక్షుడు సైపా సురేష్,ప్రధాన కార్యదర్శి చింతల కమలాకర్ రెడ్డి,కోశాధికారి దొడ్డ రవీందర్ గుప్తా తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కమిటీ సభ్యులు,ఆలయ పూజారులు,గురుస్వాములు, అయ్యప్ప మాలదారులు పాల్గొన్నారు.

పదోసారి దేవాలయంలో మహా అన్నదానం..

నర్సంపేట మండలంలో రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా పనులు నిర్వహిస్తున్న బిర్రు రాజేశ్వరి సునీల్ కుమార్ గత పది సంవత్సరాలుగా దేవాలయంలో జరుగుతున్న మహా అన్నదాన కార్యక్రమంలో అన్నదాతలుగా ఉంటున్నారని అయ్యప్ప దేవాలయ ట్రస్ట్ కమిటీ పేర్కొంటూ ఆయనను సన్మానించారు.

దేవాలయానికి 108 కుర్చీల బహుకరణ.

నర్సంపేట పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి, అయ్యప్ప దేవాలయ గురుస్వామి మిడుదొడ్డి బాబురావు 25 వేల రూపాయల విలువ చేసే 108 కుర్చీల బహుకరణ చేసినట్లు ఆలయ కమిటీ తెలిపారు.

గ్రామ సేవా సమితి ఆధ్వర్యంలో కుర్చీలు వితరణ…

గ్రామ సేవా సమితి ఆధ్వర్యంలో కుర్చీలు వితరణ.

పలమనేరు(నేటి ధాత్రి)

 

పలమనేరు పట్టణంలో గల ఫస్ట్ క్లాస్ సివిల్ కోర్ట్ బార్ అసోసియేషన్
కు శివాడి గ్రామ సేవా సమితి ఆధ్వర్యంలో కుర్చీలు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్.భాస్కర్ చేతుల మీదుగా వితరణ అందించినట్లు సేవాసమితి అధ్యక్ష, కార్యదర్శులు, రామ్మూర్తి ,ధనంజయ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా గ్రామ సేవా సమితి ప్రతినిధులు మాట్లాడుతూ తమ సంస్థ గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద, నిరుపేదలకు అందిస్తున్న సేవల్లో భాగంగా పలమనేరు బార్ అసోసియేషన్కు కుర్చీలు ఇవ్వాలనే సంకల్పాన్ని నెరవేర్చమన్నారు. అదేవిధంగా భవిష్యత్తులో పలమనేరు నియోజకవర్గంలో ఉన్న ప్రాంతాలకు తమ సేవలు విస్తరించి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గిరిజనులకు ఏ వసతులు లేక ఇబ్బందులకు గురవుతున్నారో అధ్యాయనం చేసి వారి ద్వారానే తెలుసుకొని మౌలిక వసతులు కల్పించడానికి కృషి చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుపేద మహిళలను గుర్తించి మా సంస్థ ద్వారా చేతి వృత్తులు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించి వాటి ద్వారా వారి జీవనోపాదులు మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తామన్నారు. ఇప్పటికే తమ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు అందించామని భవిష్యత్తులో తమ కార్యచరణను రూపొందించుకొని ప్రజలకు సేవలు అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్,భాస్కర్ మాట్లాడుతూ గ్రామ సేవా సమితి తమ బార్ అసోసియేషన్ చేస్తున్న సేవలను గుర్తించి కుర్చీలు విరాళంగా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సేవ సమితి అధ్యక్షులు రామ్మూర్తికి శాలువ కప్పి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ సభ్యులు ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, మహిళా కార్యదర్శి మహేశ్వరి, న్యాయవాదులు రాజారెడ్డి, లక్ష్మణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version