మద్దులపల్లిలో 8వ విడత గాలికుంటు టీకాలు…

మద్దులపల్లిలో 8వ విడత గాలికుంటు టీకాలు

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్ మండలంలోని మద్దులపల్లి గ్రామంలో జాతీయ పశు వ్యాధి నియంత్రణ కార్యక్రమం భాగంగా 8వ విడత గాలికుంటు నివారణ టీకా కార్యక్రమం డాక్టర్ రాజబాబు పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెల్పుల సరిత పశువుల ఆరోగ్యంపై రైతులకు అవగాహన కార్యక్రమాలు, ఫర్టిలిటీ క్యాంపులు నిర్వహించాలని సూచించారు. గ్రామంలో పశువుల చికిత్స సౌకర్యాలు, కృత్రిమ గర్భధారణ సేవలు, పచ్చి గడ్డి విత్తనాల అందుబాటు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో మొత్తం 116 పశువులకు టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తిరుపతి, లక్ష్మణ్, సంతోష్, ముదాస్సిర్, ఉపసర్పంచ్ లచ్చిరెడ్డి, రైతులు సమ్మయ్య, బానేష్, ఓదేలు పాల్గొన్నారు.

పశువులకు గాలి కుంట టీకాలు వేయించాలి…

పశువులకు గాలి కుంట టీకాలు వేయించాలి

మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్

భూపాలపల్లి నేటిధాత్రి

మున్సిపాలిటీ పరిధిలోని జంగేడులో జాతీయ పశువ్యాధుల నివారణ ఉచిత గాలికుంటువ్యాధి నిరోధక టీకాల కార్యక్రమానికి ముఖ్యఅతిగా మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య పశువర్ధక డాక్టర్ తిరుపతి హాజరైనారు ఈ సందర్భంగా పశువులకు గాలికుంట టీకా వ్యాధులు వేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
పశువులలో కాళ్ళలో పుండ్లు ఏర్పడి నడవలేకపోవడం
నోటిలో పుండ్లు ఏర్పడి మేత మేయకపోవడం ఈ వ్యాధి వలన తీవ్రమైన జ్వరం, పాడి పశువులలో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గడం, పునరుత్పత్తి సామర్థ్యం పని సామర్థ్యం తగ్గడం వల్ల రైతుకు అపారమైన ఆర్థిక నష్టం కలుగుతుంది. వారు అన్నారు
3 నెలలు పైబడిన అన్ని గోజాతి మరియు గేదెజాతి పశువులకు ఈ టీకాలు వేయించండి.
ఈ టీకాలు చూడి పశువులకు కూడా సురక్షితమైనవి.
టీకాలు వేసిన ప్రతి పశువుకు గుర్తింపు చెవిపోగు వేసి వాటి వివరాలు, పశుపోషకుల వివరాలు భారత్ పశు దాన యాప్ లో నమోదు చేయించండి.
రైతులు, పశుపోషకులు అందరూ తప్పక మీ పశువులన్నింటికీ టీకాలు ఇప్పించుకుని మీ విలువైన పశుసంపదను గాలికుంటు వ్యాధి నుండి రక్షించుకోగలరు.
గాలికుంటు వ్యాధి రహిత రాష్ట్రంగా గుర్తింపు సాధిద్దాం- పశు ఉత్పత్తులకు విలువను పెంచుదాం వారు అన్నారు ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version