మూడవ రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె..

మూడవ రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె

బస్టాండ్ కూడలిలో ట్రాఫిక్‌కు అంతరాయం

పరకాల,నేటిధాత్రి

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె పరకాల పట్టణంలో మూడవ రోజుకు చేరుకుంది.సమ్మె కారణంగా బస్సు సేవలు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ వాహనాలపై ఆధారపడుతున్నారు.ఈ క్రమంలో బస్టాండ్ కూడలి వద్ద ఆటోలు,క్యాబ్‌లు,ఇతర ప్రైవేట్ వాహనాలు అధిక సంఖ్యలో నిలిపివేయబడుతున్నాయి. నియంత్రణ లేకుండా పార్కింగ్ చేయడంతో అక్కడ ట్రాఫిక్ రద్దీ తీవ్రంగా పెరిగింది.ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతూ,ప్రయాణికులు మరియు స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.ముఖ్యంగా పీక్ అవర్స్ సమయంలో పరిస్థితి మరింత విషమంగా మారుతోంది.ట్రాఫిక్ సమస్యనునియంత్రించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.మరోవైపు,కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించే వరకు సమ్మె కొనసాగుతుందని కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version