ఆర్టీసీ సమ్మెకు భారతీయ మజ్దూర్ సంఘ మద్దతు…

ఆర్టీసీ సమ్మెకు భారతీయ మజ్దూర్ సంఘ మద్దతు

పరకాల,నేటిధాత్రి

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు భారతీయ మజ్దూర్ సంఘ (బీఎంఎస్) మద్దతు ప్రకటించింది.ఈ సందర్భంగా పరకాల ఆర్టీసీ డిపో వద్ద కార్మికులతో కలిసి సంఘీభావం వ్యక్తం చేశారు.రాష్ట్ర భవన నిర్మాణ విభాగ కార్యదర్శి అడ గాని జనార్దన్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కొందరు కార్మికులు తీవ్ర నిర్ణయాలకు వెళ్లే పరిస్థితులు ఏర్పడినట్లు తెలిపారు.కార్మికుల న్యాయమైన డిమాండ్లను చర్చల ద్వారా వెంటనే పరిష్కరించాలని,ఆర్టీసీని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.యూనియన్ల ఏర్పాటు హక్కులను గౌరవించాలని కూడా కోరారు.తెలంగాణలో ఇటీవల ఆర్టీసీ కార్మికులు చేసిన నిరసనలు ఆందోళనకర పరిస్థితులను సూచిస్తున్నాయని,ప్రభుత్వం తక్షణం స్పందించకపోతే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశముందని హెచ్చరించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ప్రజలకు సేవలందించే కార్మికులకు తగిన గౌరవం,భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version