రక్త దానం చేద్దాం ప్రాణాలను కాపాడుదాం.

రక్త దానం చేద్దాం ప్రాణాలను కాపాడుదాం.

#రక్తదాతల సేవ స్ఫూర్తి అభినందనీయం.

#జిల్లా కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మన్ దివాకర టి.ఎస్.

ములుగు జిల్లా, నేటిధాత్రి:

రక్తదానం చేయడం ద్వారా నిండు ప్రాణాలను కాపాడవచ్చని, రక్తదాతల సేవ స్ఫూర్తి ప్రశంసా నియమని జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. అన్నారు.
శనివారం ములుగు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ -టి జి ఓ అసోసియేషన్, టీఎన్జీవో యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో ములుగు గట్టమ్మ దేవాలయ సమీపంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ దివాకర
టి.ఎస్.సందర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మనం ఇచ్చే ప్రతి రక్తపు బొట్టు ఒక నిండు ప్రాణాన్ని నిలబెడుతుందని, రక్తదానం అనేది కేవలం ఒక కార్యక్రమంగా చూడకూడదని, అది ఒక గొప్ప సామాజిక సంస్కృతిగా మారాలని ఉద్ఘాటించారు. జీవితాలను కాపాడే మహత్తర సేవలో భాగంగా ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తం అందుబాటులో ఉండడం అత్యవసర చికిత్స లలో ఎంతో కీలకమని, ముఖ్యంగా ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, అత్యవసర వైద్య సేవల సమయంలో రక్తదానం ప్రాణదాతగా నిలుస్తుందని అన్నారు.
జిల్లాలోని ప్రజలు,ఉద్యోగులు, ఉపాధ్యాయులు,యువత, పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేశారు.
అదనపు కలెక్టర్లు సి హెచ్ మహేందర్ జి, సంపత్ రావులు రక్తదానం చేసి ఉద్యోగులకు, దాతలకు స్ఫూర్తిగా నిలిచారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సి హెచ్ మహేందర్ జి, సంపత్ రావు, డి ఆర్ డి ఓ చంద్రశేఖర్, అడిషనల్ డిఆర్డిఓ శ్రీనివాస్, ఉద్యోగ సంఘ ప్రతినిధులు, యువత, వైద్య బృందం, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పోలీస్ అమరవీరుల స్మారక వారోత్సవాల సందర్బంగా రక్తదాన శిభిరం ఏర్పాటు…

పోలీస్ అమరవీరుల స్మారక వారోత్సవాల సందర్బంగా రక్తదాన శిభిరం ఏర్పాటు

పరకాల,నేటిధాత్రి

 

 పోలీస్ అమరవీరుల స్మారక వారోత్సవాల సందర్భంగా మంగళవారంరోజున పట్టణంలోని డిపిఆర్ ఫంక్షన్ హల్ లో డివిజన్ పోలీస్ ల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.సిఐలు క్రాంతి కుమార్,రంజిత్ రావు,సంతోష్ రక్తదాన శిబిరాన్ని ప్రారంబించి మాట్లాడుతూ రక్తదానం చేయడం అత్యంత మహత్తరమైన సేవ,ఒక్క యూనిట్ రక్తంతో ముగ్గురు ప్రాణాలను రక్షించగలమనే సత్యాన్ని మనందరం గుర్తుంచుకోవాలని పోలీస్ అమరవీరుల స్మారక వారోత్సవాల సందర్భంలో ఇలాంటి రక్తదాన శిబిరాలు నిర్వహించడం ద్వారా సమాజానికి సేవ చేయడమే కాకుండా అమరవీరుల త్యాగాలను స్మరించడమన్నది కూడా మన బాధ్యత అని పోలీస్ సిబ్బందితో పాటు ప్రజలు,యువత స్వచ్ఛందంగా పాల్గొనడం అభినందనీయమని దాదాపు 180మంది వరకు రక్తదానం చేసారని పేర్కొన్నారు.అనంతరం పాల్గొన్న రక్త దాతలకు సర్టిఫికెట్లను అందజేశారు.ఈ కార్యక్రమంలో పరకాల డివిజన్ ఎస్సైలు,పోలీసు సిబ్బంది,యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version