
8వసారి రక్తదానం చేసిన రాసమల్ల కృష్ణ
పరకాల నేటిధాత్రి శనివారం రోజున పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు రక్తం అత్యవసరం ఉండటంతో సమాచారం మేరకు స్థానిక రేడియోగ్రాఫర్ రాసమల్ల కృష్ణ స్పందించి రక్త దానం చేయడం జరిగింది.వెంటనే స్పందించి ఆపదలో ఉన్న వారు నావరు అని చూడకుండా రక్తదానం చేసిన కృష్ణను ఆర్ఎంఓ డాక్టర్.బాలకృష్ణ ల్యాబ్ టెక్నీషన్ సుమలత,శివకుమార్,కొక్కుల రమేష్ మరియు ఆసుపత్రి సిబ్బందితో పాటు పలువురు అభినందించారు.