ఘనంగా అజ్వ జన్మదిన వేడుకలు.

ఘనంగా అజ్వ జన్మదిన వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:.

 

 

 

ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షుడు షైక్ రబ్బాని యొక్క తమ్ముడు షైక్ సులేమన్ తనయుని కూతురు అజ్వ యొక్క జన్మదిన సంధర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి కేకు కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. షేక్ రబ్బాని మాట్లాడుతూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను నువ్వు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.అని చెప్పారు. ఈ కార్యక్రమంలో షేక్ షఫీ ఉద్దీన్ షేక్ సజ్జహోద్దీన్ బంధుమిత్రులు కుటుంబ సభ్యుల తదితరులు పాల్గొన్నారు.

ట్రంప్ బర్త్‌డే రోజు పుతిన్ ఫోన్ ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం గురించి చర్చలు.

ట్రంప్ బర్త్‌డే రోజు పుతిన్ ఫోన్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం గురించి చర్చలు…

Donald Trump: ఇజ్రాయెల్ యుద్ధంపై ట్రంప్ స్పందించారు. తన బర్త్‌డే రోజున రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్ తనకు ఫోన్ చేశాడని, యుద్ధంపై మాట్లాడామని చెప్పారు. యుద్ధం ఆపడానికి నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య భీకర యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. మిస్సైల్స్, డ్రోన్లతో పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యక్షంగానే ఇజ్రాయెల్‌కు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా, ఇరాన్.. ఇజ్రాయెల్ యుద్ధంపై ట్రంప్ స్పందించారు. తన బర్త్‌డే రోజున రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్ తనకు ఫోన్ చేశాడని, యుద్ధంపై మాట్లాడామని చెప్పారు. యుద్ధం ఆపడానికి నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
ఈ విషయాలను సోషల్ మీడియా వేదికగా ఆయన వెల్లడించారు. ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో.. ‘అధ్యక్షుడు పుతిన్ ఈ రోజు ఉదయం నాకు ఫోన్ చేశారు. ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. దాని కంటే ముఖ్యంగా ఇరాన్ దేశం గురించి మాట్లాడుకున్నాం. దాదాపు గంట సేపు మాట్లాడుకున్నాం. నేను అనుకుంటున్నట్లే ఆయన కూడా అనుకుంటున్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం ఆగాలని కోరుకుంటున్నారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం గురించి కొంచెంసేపు మాత్రమే మాట్లాడుకున్నాం.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హుగ్గెల్లి మధు జన్మదిన వేడుకలు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హుగ్గెల్లి మధు జన్మదిన వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో బి ఆర్ ఎస్ యువ నాయకులు హుగ్గెల్లి మధు గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,పాక్స్ చైర్మన్ మచ్చెందర్,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,
ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,మాజి సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రవికిరణ్, ఝరసంఘం పట్టణ అధ్యక్షులు ఏ బాబా,యువ నాయకులు మూర్తుజా,సత్యం ముదిరాజ్ ,డా. నాగరాజ్,పర్వేజ్ పటేల్, ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పొద్దంతా ఆనందం.. పొద్దుపోయాక విషాదం..

పొద్దంతా ఆనందం.. పొద్దుపోయాక విషాదం..

హైదరాబాద్ :నేటిధాత్రి

 

car accident

కన్నీళ్లు మిగిల్చిన జన్మదిన వేడుక కృష్ణా బ్యాక్వాటర్ వద్దకు వెళ్లి వస్తుండగా..
రోడ్డు ప్రమాదం ముగ్గురు అన్నదమ్ముల మృతి..
మరో నలుగురికి గాయాలు

 

యాచారం, న్యూస్టుడే: వారంతా స్నేహితులు.. పాతికేళ్లలోపు యువకులు.. వారిలో ఒకరి పుట్టినరోజు నేపథ్యంలో సరదాగా గడిపేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరో నలుగురు గాయాలపాలై కన్నవాళ్లకు కన్నీళ్లు మిగిల్చారు. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం గుడిబండ గ్రామానికి చెందిన వాసా సాయితేజ(23), వాసా పవన్ కుమార్(25), వాసా రాఘవేందర్ (24), వాసా శివకుమార్, ఇ. సాయికుమార్ వరసకు అన్నదమ్ములు. మూసాపేటలో నివాసం ఉండే ఎం.సందీప్, శివకుమార్ వారి మిత్రులు. వీరందరూ హైదరాబాద్లో వేర్వేరు చోట్ల ఉంటూ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వాసా శివకుమార్ జన్మదినం సందర్భంగా మంగళవారం ఉదయం అందరూ కలిసి నల్గొండ జిల్లా నేరేడుకొమ్మ మండలం వైజాగ్ కాలనీలోని కృష్ణా బ్యాక్వాటర్ వద్దకు వెళ్లారు. పొద్దుపోయే వరకూ అక్కడే ఆనందంగా గడిపారు. తిరుగు ప్రయాణంలో.. రాత్రి 2 గంటల ప్రాంతంలో రంగారెడ్డి జిల్లా యాచారం మాల్ పట్టణం దాటిన కొద్దిసేపటికి వీరు ప్రయాణిస్తున్న కారు..ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సు ఢీకొన్నాయి. ప్రమాదంలో కారు నుజ్జయింది. వాసా సాయితేజ, వాసా పవన్కుమార్, వాసా రాఘవేందర్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడగా.. పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మృతుడు పవన్కుమార్కు మూడేళ్ల కుమార్తె ఉందని, ఆయన భార్య ప్రస్తుతం గర్భవతి అని పోలీసులు తెలిపారు. మిగిలిన వారంతా అవివాహితులని వెల్లడించారు.

చలి మెడ.రాజేశ్వరరావు ఘనంగా జన్మదిన వేడుకలు.

చలి మెడ.రాజేశ్వరరావు ఘనంగా జన్మదిన వేడుకలు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

తంగళ్ళపల్లి మండలం. నేరెళ్ల గ్రామంలో. బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లో.కరీంనగర్ డైరీ యూనిట్.సూపర్వైజర్ గుర్రం సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో. కరీంనగర్ డైరీ చైర్మన్ చలి మెడ రాజేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరీంనగర్ డైలీ చైర్మన్ రాజేశ్వరరావు జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకోవడం జరిగిందని కరీంనగర్ డైరీ స్థాపించి డైరీ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ అట్లాగే రోజుకు 2000 లీటర్ల నుండి రెండు లక్షల లీటర్ల వరకు పాల ఉత్పత్తిని పెంచిన ఘనత చైర్మన్ రాజేశ్వరరావు ది అని. మాకు పండుగ రోజు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పిల్లాపాపలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఇట్టి జన్మదిన వేడుకలను ఘనంగా జరిపించుకున్నామని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. బి సి యు ఇన్చార్జి రాగుల మధుసూదన్. సూపర్వైజర్ ఉమ్మారెడ్డి భానుచందర్. ల్యాబ్ అసిస్టెంట్ తిరుపతి. శేఖర్. నరేష్. శ్రీనివాస్. రాజు. సాయికుమార్ రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

ఎమ్మెల్యే కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన.

మానకొండూరు ఎమ్మెల్యే కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మండల .

పార్టీ నాయకులు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

 

 

తంగళ్ళపల్లి మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బయలుదేరి మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కవ్వం పల్లి.

సత్యనారాయణ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు .

పుట్టినరోజు సందర్భంగా తంగళ్ళపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు బుక్స్ అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.

ఇట్టి కార్యక్రమంలో సిరిసిల్ల ఏఎంసీ డైరెక్టర్ ఆరెపల్లి బాలు.

కాంగ్రెస్ పార్టీ మానవ హక్కుల యువజన విభాగం అధ్యక్షులు గుగ్గిల భరత్ గౌడ్.

కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు అందరు కలిసి ఇల్లంతకుంటమండలంలోని కాంగ్రెస్ పార్టీ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వం పల్లి సత్యనారాయణ.

పుట్టినరోజు వేడుకలను మండలంలో పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ కార్యక్రమంలో. జిల్లా మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

సలీం జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే.

బిఆర్ఎస్ యువ నాయకులు సలీం జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

బిఆర్ఎస్ యువ నాయకులు సలీం గారి జన్మదిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి శాలువా పూలమాలలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా,యువ నాయకులు మిథున్ రాజ్, బొల్లారం రత్నం , మాజి సర్పంచ్ సంజీవ్,కళాకారుడు సునీల్,నాయకులు జూబీర్,అమీర్,జగన్ తదితరులు .

ఘనంగా ఎంపీ పోరిక బలరాం నాయక్ జన్మదిన వేడుకలు.

ఘనంగా ఎంపీ పోరిక బలరాం నాయక్ జన్మదిన వేడుకలు…

నేటి ధాత్రి -బయ్యారం :-

 

 

 

 

అభివృద్ధి ప్రదాత, పేదల పెన్నిధి,ప్రజానాయకుడు, మనసున్న మారాజు,అవినీతి లేని నాయకుడు, గిరిజన ముద్దుబిడ్డ,మాజీ కేంద్రమంత్రి కోరిక బలరాం నాయక్ జన్మదిన వేడుకలను బయ్యారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ బయ్యారం పట్టణ అధ్యక్షులు నాయిని శ్రీనివాస్ రెడ్డి, మహిళ కమిటీ మండల అధ్యక్షురాలు తగిరా నిర్మల రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులు తెప్పించి బయ్యారం ఏజెన్సీ మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడపాలని కోరారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి మల్లయ్య, తగిరి సత్తి రెడ్డి, భూక్యా రవి నాయక్, చెరుకుపల్లి నాగమణి, దాసరి శ్రీధర్, చల్ల గోవర్ధన్, సరోజ, సుజాత, నాగమణి తదితరులు పాల్గొన్నారు

యువజన కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లిసత్యం జన్మదిన వేడుకలు

యువజన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలు

కరీంనగర్, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం జన్మదిన సందర్భంగా రామడుగు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అనుపురం పరుశురాం గౌడ్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లి గ్రామంలోని ప్రశాంతి భవన్ లో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శ్యాంసుందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జవాజి హరీష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పిండి సత్యం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాపురాజు, నేరేళ్ల మల్లేశం, చొప్పదండి అనిల్, మధు, సంతోష్ , అజయ్, మహేష్, సాయి, సాగర్, ఎండి. ముషూ, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా హ‌రీష్ రావు జ‌న్మ‌దిన వేడుక‌లు.

ఘనంగా హ‌రీష్ రావు జ‌న్మ‌దిన వేడుక‌లు

జహీరాబాద్ నేటిధాత్రి:

మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఎమ్మెల్యే మాణిక్ రావు కేక్ కట్ చేసిన అనంతరం గులాబీ శ్రేణులతో శుభాకాంక్షలు తెలిపారు.ఈ సంద‌ర్భంగా శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు మాట్లాడుతూ ఉద్య‌మ నాయ‌కుడు కేసీఆర్ వెన్నంటి నడిచిన నిజమైన గులాబీ సైనికుడు హ‌రీష్ అని అన్నారు.పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారికి వెన్నుదన్నుగా నిలుస్తున్న గొప్ప నాయకుడు హ‌రీష్ రావు గార‌ని కొనియాడారు. భారత రాష్ట్ర సమితి పార్టీ పార్టీ వెన్నెముక, క‌ష్ట‌కాలంలో నిలుస్తూ.. ప్ర‌జ‌ల త‌ర‌పున పోరాడుతున్న యోధుడు హ‌రీష్ రావుగార‌ని అన్నారు. 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటం, 10 ఏండ్ల ప్ర‌భుత్వ పాల‌న‌లో నీటి పారుద‌ల‌, ఆర్థిక మంత్రిగా వారు రాష్ట్రానికి ఎన‌లేని సేవ‌లు చేశారు. చ‌రిత్ర‌లో నిలిచిపోయే కాళేశ్వ‌ర ప్రాజెక్టు సాకారంలో కేసీఆర్ గారితో పాటు హ‌రీష్ గారు శ్ర‌మ, కృషి మ‌రువ‌లేనిద‌ని అన్నారు. హ‌రీష్ రావు నిండు నూరేళ్లు అష్టైశ్వ‌ర్యాల‌తో , సుఖ సంతోషాల‌తో జీవించాల‌ని కోరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ మ‌ళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు, ముఖ్య‌మంత్రిగా తిరిగి కేసీఆర్ గారిని చేయ‌డంలో హ‌రీష్ రావు గారి నాయ‌క‌త్వాన్ని తెలంగాణ కోరుకుంటోంద‌ని అన్నారు.కార్య‌క్ర‌మంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప ,మాజి మున్సిపల్ చైర్మన్ అల్లాడి నర్సింలు, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా, మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు హిరు రాథోడ్ ,యువ నాయకులు మిథున్ రాజ్ ,చిన్న రెడ్డి,వెంకట్, నర్సింహ రెడ్డి,ఇబ్రహీం,దేవదాస్,గణేష్,సురేష్ ,నరేష్ రెడ్డి,జాకీర్,అశోక్ రెడ్డి,ఇమ్రాన్ ,నాయకులు కార్యకర్తలు త‌దిత‌రులు పాల్గొన్నారు

ఘనం గా బీసీ ఉద్యమ నేత పర్ష హన్మాండ్లు జన్మదిన వేడుకలు.

ఘనం గా బీసీ ఉద్యమ నేత పర్ష హన్మాండ్లు జన్మదిన వేడుకలు

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

 

తెలంగాణ సిరిసిల్ల జిల్లా బీసీ ఉద్యమ నేత పర్ష హన్మాండ్లు జన్మ దిన వేడుకలను బీసీ సంక్షేమ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యం లో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం లో మరియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యం లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు,బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పర్శ హన్మాండ్లు ను శాలువా తో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు,ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీలు బానిసలు కాదు పాలకులు కావాలని ఉద్యమించుచున్న మహోన్నతమైన వ్యక్తి హన్మాండ్లు అన్నారు,ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. పర్శ హన్మాండ్లు జన్మదినం బీసీ లందరికి పండుగ దినం అని జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు,బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పర్ష హన్మాండ్లు జన్మదిన వేడుకలు హైదరాబాదులో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. బీసీల హక్కుల సాధన కోసం జైలు జీవితాన్ని అనుభవించిన గొప్ప వ్యక్తి పర్ష హన్మాండ్లు అని అన్నారు. పర్ష హన్మాండ్లు మునుముందు ఎన్నో పదవులు అధిరోహించాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పర్ష హన్మాండ్లు, మల్లేశం, తదితర బీసీ సంఘం నేతలు పాల్గొనడం జరిగినది.

ఘనంగా గండ్ర జ్యోతి రెడ్డి జన్మదిన వేడుకలు.

ఘనంగా గండ్ర జ్యోతి రెడ్డి జన్మదిన వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ భగవంతుణ్ణి ఆశీర్వాదంతో నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ, ప్రజా క్షేత్రంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆ శ్రీ వేంకటేశ్వర స్వామి కృపాకటాక్షలు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

హరీశ్​రావు​ జన్మదిన వేడుకలో రోగులకు పండ్లు పంపిణీ.

హరీశ్​రావు​ జన్మదిన వేడుకలో రోగులకు పళ్ళు పంపిణీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండలంలో షేక్ సోహెల్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల శివారులోని శ్రీ కితకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్యకర్తల మధ్య కేక్ కట్ చేశారు. ఝరాసంగం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఝరాసంగం జరిగిన వేడుకల్లో
మండల అధ్యక్షులు వెంకటేశం మాజీ ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్ ఫారూఖ్ పటేల్ పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా మాజీ మంత్రి హరీశ్​రావు​ జన్మదిన వేడుకలు.

ఘనంగా మాజీ మంత్రి హరీశ్​రావు​ జన్మదిన వేడుకలు
జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

మాజీ రాష్ట్ర ఆర్థిక మంత్రి, ట్రబుల్ షూటర్ హరీశ్‌ రావు పుట్టినరోజు సందర్భంగా ఝరాసంగం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటేశం తమ మండల బృందంతో నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఆయన పది కాలాల పాటు ప్రజా సేవలో కొనసాగాలని, శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భ‌గ‌వంతుడు ఆయ‌న‌కు శక్తిని ప్ర‌సాదించాలని కోరుకున్నారు.

ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాల‌ని, ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మాజీ మంత్రి ఆకాంక్షించారు.

కేక్ కట్ చేసి ఒకరినొకరు కేక్ తినిపించుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

Former Minister Harish Rao’s

 

 

అలాగే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి లో మండల మైనారిటీ యువనాయకులు షేక్ సోహైల్ మరియు పరమేశ్వర్ పాటిల్ శివశంకర్ పాటిల్ ఆధ్వర్యంలో పండ్లను అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్ పాటేల్ ఫారూఖ్ పటేల్ ప్రభు పటేల్.

గోపాల కృష్ణ పాటిల్.బస్వరాజ్ పాటిల్ శివశంకర్ పాటిల్ భాయ్ వెంకటరెడ్డి నాగేశ్సజ్జన్.

నాభి పటేల్ లాలప్ప గొల్ల నర్సిములు ఆంజనేయులు నర్సిములు మాణిక్యదవ్ కిషన్ రాథోడ్ సీను తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి జన్మదిన.

ఘనంగా సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి జన్మదిన వేడుకలు…

నేటి ధాత్రి – బయ్యారం :-

 

 

బయ్యారం సొసైటీ చైర్మెన్ మూల మధుకర్ రెడ్డి జన్మదిన వేడుకలను యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఘనంగా జరిపినారు.ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి తమ్మిశెట్టి వెంకటపతి మాట్లాడుతూ, ఎల్లప్పుడూ మండల అభివృద్ధి గురించి ఆలోచించించే మూల మధుకర్ రెడ్డి భవిష్యత్ లో మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.బయ్యారం ఏజెన్సీ అభివృద్ధి కై పాటుపడుతున్న ప్రజా నాయకుడని కొనియాడారు.అనంతరం శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు నాగరాజు,నిరంజన్, రాకేష కార్తీక్,జాన్,ప్రసన్నకుమార్, సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు.

ఘనంగా మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి:

టేకుమట్ల మండల కేంద్రంలో
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్.ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి,దుద్దిళ్ళ శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ గౌడ్,కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సతీష్ గౌడ్ మాట్లాడుతూ,మృదుస్వభావి, తన తండ్రి ఆశయ సాధన కోసం పరితపించే నాయకుడు,కక్ష సాధింపు రాజకీయాలు చేయకుండా,ప్రజాసేవ లక్ష్యoగా కొన్ని దశాబ్దాలుగా ప్రజా సేవ చేస్తున్న దుదిల్ల కుటుంబం.మంత్రి శ్రీధర్ బాబు భవిష్యత్తులో తన సేవలను మరింత విస్తరింప చేస్తూ రాజకీయంగా ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షిస్తూ మనస్పూర్తిగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో.జిల్లా మండల నాయకులు యువజన కాంగ్రెస్ జిల్లా మండల నాయకులు.గ్రామ శాఖ అధ్యక్షులు.సోషల్ మీడియా కోఆర్డినేటర్.కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

జున్నుతుల మధుకర్ రెడ్డి జన్మదిన వేడుకలు.

జున్నుతుల మధుకర్ రెడ్డి జన్మదిన వేడుకలు

శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ధర్మకర్త

వీణవంక ( కరీంనగర్ జిల్లా) నేటి ధాత్రి:

వీణవంక మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జున్నుతుల మధుకర్ రెడ్డి 43వ జన్మదిన వేడుకలు వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎక్కటి రఘపాల్ రెడ్డి, ఎండీ సాహెబ్ హుస్సేన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్స్ పండ్లు పంపిణీ చేయడం జరిగింది
అనంతరం మండల అధ్యక్షుడు రఘపాల్ రెడ్డి ఎండి సాహెబ్ హుస్సేన్ లు మాట్లాడుతూ, కార్యకర్త స్థాయి నుండి ధర్మ కర్త గా ఎదిగి ముందు ముందు మరెన్నో పదవులను పొందాలని వారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంచాలని వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నాము అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎక్కటి రఘపాల్ రెడ్డి, మాజీ అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్,గంగాడి రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ లు చిన్నాల అయిలయ్య, మార్కెట్ డైరెక్టర్ మాదాసు సునీల్,కర్ర తిరుపతి రెడ్డి, నాయకులు ఈదునూరి పైడి కుమార్,ఒరేం శ్రీనివాస్, ఉయ్యాల నాగరాజు,కర్ర గురు,మర్రి సమ్మయ్య తదితరులు పాలుగోన్నారు.

ఆధ్వర్యంలో మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు.

పరకాల నేటిధాత్రి

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

 

పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం రోజున టిపిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ 59వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి,విజయ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తో కలిసి హాజరై కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి,పరకాల,నడికూడా మండల అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి,బుర్ర దేవేందర్ గౌడ్,కుంకుమేశ్వర స్వామి ఆలయకమిటీ చైర్మన్ కొలుగూరి రాజేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ పరకాల పట్టణ కమిటీ మరియు సమన్వయకమిటి సభ్యులు చిన్నల గొనాద్,మంద రాంచెందర్,బొచ్చు చెందర్,చందుపట్ల రాఘవరెడ్డి,పంచగిరి జయమ్మ, మార్క రఘుపతి గౌడ్,పసుల రమేష్,మడికొండ సంపత్ కుమార్,మాజీ జెడ్పిటిసి పాడి కల్పన దేవి ప్రతాపరెడ్డి దుబాసి వెంకట స్వామి,అనిల్,పోరండ్ల వేణు,ఒంటెరు శ్రవణ్, మంద నాగరాజు,దార్న వేణుగోపాల్,గడ్డం శివ,లక్కమ్ వసంత,బొమ్మకంటి చంద్రమోలి,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా హనీస్ వర్ధన్ జన్మదిన వేడుకలు.

ఘనంగా హనీస్ వర్ధన్ జన్మదిన వేడుకలు

పాల్గొన్న బిజెపి నాయకులు

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలంలోని భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపెల్లి సాయిగీత- శ్రీకాంత్ దంపతుల పుత్రుడు హనీష్ వర్ధన్ మొదటి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ పుట్టినరోజు వేడుకకు రాష్ట్ర,మండల బిజెపి నాయకులు పాల్గొని ఆశీర్వ ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సి లింగ్ మెంబర్ రాయరాకుల మొగిలి,మండల అధ్యక్షులు నరహరిశెట్టి రామకృష్ణ, సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి, బూత్ అధ్యక్షులు సుమన్ చంద్రమొగిలి, నవీన్, రవి, మురళి పాల్గొన్నారు.

ఘనంగా జూనియర్ ఎన్టిఆర్ జన్మదిన వేడుకలు.

ఘనంగా జూనియర్ ఎన్టిఆర్ జన్మదిన వేడుకలు

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలకేంద్రం లోని ప్రభుత్వ ఆసుపత్రిలో నందమూరి తారకరామా రావు(జూనియర్ ఎన్టీఆర్) జన్మదినాన్ని పురస్కరిం చుకుని దాసరి నరేష్ ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు.అనంతరం రోగులకు అరటిపండ్ల పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్ర మంలో అమ్మ అశోక్,,దాసరి విష్ణు,ప్రణయ్, నవీన్, అఖి ల్,మోహన్,పవన్,సుమంత్ కిరణ్,తేజ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version