రామరాజ్యం తలపించేలా వైఎస్ఆర్ పాలన..

రామరాజ్యం తలపించేలా వైఎస్ఆర్ పాలన

టిపిసిసి జనరల్ సెక్రెటరీ నల్లపు దుర్గాప్రసాద్

చర్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ఆర్ 16వ వర్ధంతి వేడుకలు

నేటి ధాత్రి చర్ల

డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా చర్ల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డికి భద్రాచలం టీపీసీసీ జనరల్ సెక్రెటరీ నల్లపు దుర్గా ప్రసాద్ ఘనంగా నివాళులు అర్పించారు వైయస్సార్ 16వ వర్ధంతి సందర్భంగా టిపిసిసి జనరల్ సెక్రెటరీ నల్లపు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రధాన ఎజెండాగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి భారత దేశంలోనే గుర్తింపు పొందుతూ రామరాజ్యం తలపించేలా దివంగత సీఎం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి పాలన ప్రజలకు అందించారని అన్నారు ప్రజలకు చేరువుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్రలు చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్న మహోన్నత వ్యక్తి అన్నారు కాంగ్రెస్ పార్టీ చర్ల మండల యువ నాయకులు విజయ్ నాయుడు మాట్లాడుతూ పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీ పథకం విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ పథకాలను ప్రవేశపెట్టిన చిరస్మరణీయుడు అని కొనియాడారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండెపుడి భాస్కరరావు మాట్లాడుతూ రైతులకు సాగునీటి కాలువలను పంట పొలాలకు అందించి సాగునీటిని అందించిన మహోన్నత వ్యక్తి అన్నారు మాజీ ఎంపీటీసీ చర్ల మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు మడకం పద్మ మాట్లాడుతూ రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన మహోన్నత నాయకుడు వైఎస్సార్ అని అన్నారు చర్ల ఎస్సీ సెల్ మండల ప్రెసిడెంట్ సాల్మన్ రాజు మాట్లాడుతూ ఆనాడు ఇందిరమ్మ ఇళ్ళను ఇచ్చి పేద ప్రజలకు గూడును కల్పించిన మహనీయ దేవుడు అని అన్నారు
ఈ కార్యక్రమంలో చర్ల కాంగ్రెస్ నాయకులు గుండెపుడి భాస్కరరావు ఎస్సి సెల్ మండల ప్రెసిడెంట్ సల్మాన్ రాజ్ సీనియర్ కాంగ్రెస్ యువ నాయకులు విజయ్ నాయుడు సత్తిబాబు మాజీ ఎంపీటీసీ మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు మడకం పద్మ అంజి బబు మేడి రమేష్ మైపా జోగారావు చింతయ్య మండల మరియు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version