ఆర్డీవోని కోరిన సీనియర్ సిటిజన్ సమస్యలను.

ఆర్డీవోని కోరిన సీనియర్ సిటిజన్ సమస్యలను పరిష్కరించాలని విన్నపం

సిరిసిల్ల టౌన్: మే 21 (నేటిధాత్రి)

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని సిరిసిల్ల జిల్లా సీనియర్ సిటిజన్ ప్రతినిధులు రాష్ట్ర కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ జిల్లాలో ఉన్న సీనియర్ సిటిజన్ వృద్ధులను తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వం నుండి గాని,సేవా సంస్థల నుండి గాని,ప్రభుత్వ పెన్షన్ విధానాలు గాని,జిల్లాలో ఉన్న వృద్ధులకు సహాయ సహకారాలు అందించాలని కోరడం జరిగినది. ఏదైనా వృద్ధులకు ఇబ్బంది ఉంటే సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆర్డీవో ని కోరడం జరిగింది , ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ జిల్లా అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య, కోశాధికారి దొంత దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.

నేల రాలిన పంటలు..అడుగంటిన ఆశలు

నేల రాలిన పంటలు..అడుగంటిన ఆశలు

-అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి

-అసత్యపు ప్రచారాలు..వినతి పత్రాలతో ప్రజలకు ఒరిగేదేమీ లేదు

-భూపాలపల్లి ఎమ్మెల్యేకు రైతులపై ఏమాత్రం ప్రేమ ఉన్న తెలంగాణలో ఫసల్ బీమా యోజన అమలయ్యేలా ముఖ్యమంత్రిని ఒప్పించండి

-నష్టపోయిన రైతుల పంట పొలాలను పరిశీలిస్తున్న చందుపట్ల కీర్తిరెడ్డి

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

రెక్కల కష్టాన్ని నమ్ముకొని పంటలు పండించిన రైతన్నకు అకాల వర్షాలు తీవ్ర నష్టాన్నే మిగిల్చాయని..చేతికొచ్చిన పంట కళ్ళముందే కొట్టుకుపోతుంటే ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో రైతులు కూరుకుపోతున్నారని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి ఆవేదనను వ్యక్తం చేశారు. ఈనెల 15న రాత్రి ఈదురు గాలులతో కురిసిన వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతుల పంటలను శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని రంగాపురం గ్రామంలో బిజెపి భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు మోరే వేణుగోపాల్ రెడ్డి, నేతృత్వంలోని బిజెపి బృందంతో పర్యటించి పంటలను పర్యవేక్షించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈదురు గాలులతో కురిసిన వడగండ్ల వానకు వరి, మామిడి, మొక్కజొన్న అరటి, మిర్చి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. రైతులపై ఏమాత్రం ప్రేమ ఉన్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వెంటనే స్పందించి అకాల వర్షాలతో నష్టపోయిన పంటలను సర్వే చేయించి..పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ:50 వేలు ఇప్పించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించాలని డిమాండ్ చేశారు. అసత్యపు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. అధికారంలో ఉండి వినతి పత్రాలు ఇస్తే ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. దేశవ్యాప్తంగా బీమా యోజన అమలవుతుంటే, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. దీంతో అకాల వర్షాలకు..ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో తెలంగాణలో ఫసల్ బీమా యోజనను అమలు చేసే విధంగా కృషిచేసి రైతులను ఆదుకోవాలే తప్ప..మీ చేతకానితనాన్ని కేంద్ర ప్రభుత్వంపై నెట్టడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అన్నమునేని భూమారావు బలుగూరి రాజేశ్వరరావు లోకుల బోయిన తిరుపతి మండల ఉపాధ్యక్షులు బలుగూరి కిషన్ రావు రంగపురం మాజీ ఉప సర్పంచి వైనాల ప్రియాంక శివకుమార్ బలుగూరి తిరుపతిరావు అరికాంతపు కృష్ణారెడ్డి చిలకమర్రి రాజేంద్రప్రసాద్ రంగపురం బూత్ అధ్యక్షులు తక్కలపల్లి విజేందర్ రావు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version