జహీరాబాద్ ప్రాంత వాసుల ఆశల పై నీళ్లు చల్లిన రేవంత్.

జహీరాబాద్ ప్రాంత వాసుల ఆశల పై నీళ్లు చల్లిన రేవంత్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మెదపల్లి తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ పాత్రికేయులతో.మాట్లాడుతూ నిన్న జరిగిన సీఎం జహీరాబాద్ పర్యటనలో కొత్తగా ఏమీ ఆశించేది లేదని .బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్ట్ కి భారీగా నిధులు మంజూరు చేస్తే బాగుండేది అని నాలుగు నియోజక వర్గాల రైతులు. సంతోషం వ్యక్తం చేసేవారన్నారు .జిల్లా లోని పలు నియోజక వర్గాల్లో పలు అభివృద్ధి పనులకు గాను నిధులు కేటాయిస్తే అన్ని వర్గాల వారు హర్షించేవారని ఇసంధరభంగా తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ దయ బట్టరు.కొత్తగా ఇచ్చిందేమి లేకపోగా గత కెసిఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన వాటికే రిబ్బన్ కటింగ్ లు చేసి చేతులు దులుపుకున్నారు అని అన్నారు .రానున్న రోజుల్లో ప్రజలు కూడా చేతి వాటం తప్పకుండా చూపెడతారు అని గుర్తు పెట్టుకోవాలని .ఈ సందర్భంగా మెదపల్లి తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ అన్నారు .

నేల రాలిన పంటలు..అడుగంటిన ఆశలు

నేల రాలిన పంటలు..అడుగంటిన ఆశలు

-అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి

-అసత్యపు ప్రచారాలు..వినతి పత్రాలతో ప్రజలకు ఒరిగేదేమీ లేదు

-భూపాలపల్లి ఎమ్మెల్యేకు రైతులపై ఏమాత్రం ప్రేమ ఉన్న తెలంగాణలో ఫసల్ బీమా యోజన అమలయ్యేలా ముఖ్యమంత్రిని ఒప్పించండి

-నష్టపోయిన రైతుల పంట పొలాలను పరిశీలిస్తున్న చందుపట్ల కీర్తిరెడ్డి

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

రెక్కల కష్టాన్ని నమ్ముకొని పంటలు పండించిన రైతన్నకు అకాల వర్షాలు తీవ్ర నష్టాన్నే మిగిల్చాయని..చేతికొచ్చిన పంట కళ్ళముందే కొట్టుకుపోతుంటే ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో రైతులు కూరుకుపోతున్నారని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి ఆవేదనను వ్యక్తం చేశారు. ఈనెల 15న రాత్రి ఈదురు గాలులతో కురిసిన వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతుల పంటలను శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని రంగాపురం గ్రామంలో బిజెపి భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు మోరే వేణుగోపాల్ రెడ్డి, నేతృత్వంలోని బిజెపి బృందంతో పర్యటించి పంటలను పర్యవేక్షించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈదురు గాలులతో కురిసిన వడగండ్ల వానకు వరి, మామిడి, మొక్కజొన్న అరటి, మిర్చి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. రైతులపై ఏమాత్రం ప్రేమ ఉన్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వెంటనే స్పందించి అకాల వర్షాలతో నష్టపోయిన పంటలను సర్వే చేయించి..పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ:50 వేలు ఇప్పించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించాలని డిమాండ్ చేశారు. అసత్యపు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. అధికారంలో ఉండి వినతి పత్రాలు ఇస్తే ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. దేశవ్యాప్తంగా బీమా యోజన అమలవుతుంటే, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. దీంతో అకాల వర్షాలకు..ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో తెలంగాణలో ఫసల్ బీమా యోజనను అమలు చేసే విధంగా కృషిచేసి రైతులను ఆదుకోవాలే తప్ప..మీ చేతకానితనాన్ని కేంద్ర ప్రభుత్వంపై నెట్టడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అన్నమునేని భూమారావు బలుగూరి రాజేశ్వరరావు లోకుల బోయిన తిరుపతి మండల ఉపాధ్యక్షులు బలుగూరి కిషన్ రావు రంగపురం మాజీ ఉప సర్పంచి వైనాల ప్రియాంక శివకుమార్ బలుగూరి తిరుపతిరావు అరికాంతపు కృష్ణారెడ్డి చిలకమర్రి రాజేంద్రప్రసాద్ రంగపురం బూత్ అధ్యక్షులు తక్కలపల్లి విజేందర్ రావు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version