మూడు చింతలపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు…

మూడు చింతలపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు – రిటర్నింగ్ అధికారులకు బి–ఫారంలు అందజేత

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

 

మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రిటర్నింగ్ అధికారులకు మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, డీసీసీ మాజీ అధ్యక్షుడు టీపీసీసీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అభ్యర్థులతో కలసి అధికారికంగా బి–ఫారంలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి విశేష స్పందన ఉందని, అభివృద్ధి – సంక్షేమమే తమ లక్ష్యమని తెలిపారు. పార్టీ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రజల మధ్యకు వెళ్లాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ నరసింహులు యాదవ్, మూడు చింతలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ఇంచార్జ్ తోటకూర అజయ్ యాదవ్, అమర్ సింగ్, మాజీవైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version